Dussehra 2023: అక్కడ రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయరు.. ఎందుకో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసర పండుగను జరుపుకుంటారు. అయితే, ఈ రోజు రాముడు లంక రాజు అయినా.. రావణుడిని వధించి విజయం సాధించాడని ప్రజలు నమ్ముతారు. అందుకే, చెడుపై మంచి గెలిచిన దానికి చిహ్నంగా ప్రతి ఏడాది విజయదశమి రోజున రావణుడి దిష్టిబొమ్మను దహనం చేసే సంప్రదాయం వస్తుంది. కానీ, భారతదేశంలో కొన్ని చోట్ల రావణుడి దిష్టిబొమ్మను అస్సలు దహనం చేయరు. ఎందుకో తెలుసా..?
Read Also: IND vs NZ: క్యాచ్ మిస్ చేసిన జడ్డూ.. తన భార్య రివాబా రియాక్షన్ ఇదే..!
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
అయితే, రావణాసురుడి భార్య మండోదరి జన్మస్థలం మందసౌర్ అని పిలుస్తుంటారు. అందుకే ఇక్కడి ప్రజలు రావణుడిని తమ అల్లుడిగా భావిస్తారు. అందుకే అల్లుడి మరణం వాళ్లకు సంతోషాన్ని ఇవ్వదు.. అందుకే ఇక్కడి ప్రజలు రావణుడి దహనం చేసేందుకు ఇష్టపడరు. ఇక్కడ రావణుని మరణానికి దసర పండగా నాడు సంతాపం తెలియజేస్తారు. అంతేకాకుండా.. ఇక్కడ 35 అడుగుల ఎత్తైన వణాసురుడి విగ్రహం కూడా ఉంటుంది.
Read Also: Azam Khan: “మేము ఎన్కౌంటర్ కావొచ్చేమో”.. యూపీ నేత ఆజం ఖాన్ కీలక వ్యాఖ్యలు..
ఇక, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బిస్రాఖ్ గ్రామంలో వణాసురుడి జన్మించాడనే గట్టి నమ్మకం. అందుకే అక్కడి ప్రజలు రావణుడిని తమ పూర్వీకుడిగా కొలుస్తారు. అందుకే దసరా పండగ రోజు అతని ఆత్మకు శాంతి కలగాలని ప్రత్యేక పూజలు చేస్తారు. రావణుని తండ్రి విశ్రవ మహర్షి ఇక్కడ ఒక శివలింగాన్ని స్థాపించాడని కూడా నమ్ముతారు. దీనికి గౌరవార్థం ఈ ప్రదేశానికి బిస్రాఖ్ అని పేరు కూడా పెట్టారు. అయితే, ఇక్కడి ప్రజలు రావణాసురుడిని మహా బ్రాహ్మణుడిగా భావిస్తారు.
Read Also: Jabardasth Dhanraj: పవన్ డైరెక్టర్ నే డైరెక్ట్ చేయబోతున్న జబర్దస్త్ కమెడియన్
దీంతో, కాంగ్రాలోని లంకాధిపతి శివుని కోసం కఠిన తపస్సు చేసి.. పరమేశ్వరుడికి ఆశీస్సులు పొందాడని ఇక్కడి ప్రజల్లో ఓ నమ్మకం ఉంది. అందుకే ఇక్కడి ప్రజలు రావణుడిని మహాదేవుని భక్తుడిగా వారు భావిస్తారు. అందువలన ఇక్కడ కూడా రావణ దహనం చేయరు. అయితే, ఈ ప్రదేశం మండోదరి తండ్రికి రాజధానిగా ఉండేదని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. రావణుడు మండోదరిని ఇక్కడే పెళ్లి చేసుకున్నాడని స్థానిక ప్రజలు చెబుతున్నారు. అందుకే ఇక్కడి ప్రజలు విజయదశమి నాడు రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయరు. ఈ ప్రదేశంలో గోండు తెగకు చెందిన ప్రజలు నివసిస్తుంటారు. వీరు తమను తాము రావణుడికి వారసులుగా భావిస్తారు. వీళ్లు రావణుడిని పూజిస్తారు. కొందరి అభిప్రాయం ప్రకారం.. తులసీదాస్ రామాయణం మాత్రమే రావణుడిని చెడ్డదిగా చూపిస్తుందట. అందుకే ఈ ప్రదేశంలో కూడా రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయరు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!