India’s aid to Gaza: గాజాకు భారత్ భారీ సాయం.. 6.5 టన్నుల వైద్య సామాగ్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India’s aid to Gaza: ఇజ్రాయిల్, హమాస్ యుద్ధం నడుమ గాజాలోని సాధారణ పాలస్తీనా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు ఏ రాకెట్ ఎటునుంచి వస్తుందో అని, ఎక్కడ ఏ బాంబు పేలుతుందో అని భయపడుతున్నారు. మరోవైపు ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ ని దిగ్భంధించింది. ఉత్తర గాజాలోని ప్రజలను సురక్షితమైన దక్షిణ ప్రాంతాలకు వెళ్లాలని సూచించడంతో, ఆ ప్రాంతంలోని 10 లక్షల మందిలో 7 లక్షల మంది దక్షిణ వైపు వెళ్లారు.
ప్రస్తుతం దక్షిణాన ఉన్న ఈజిప్టు నుంచి గాజాలోని రఫా క్రాసింగ్ వద్ద నుంచి గాజా ప్రజలకు మానవతా సాయం అందుతోంది. ఇదిలా ఉంటే యుద్ధంతో తల్లడిల్లిపోతున్న గాజా ప్రజలకు భారత్ కూడా ఆపన్నహస్తం అందించింది. పాలస్తీనా ప్రజల కోసం దాదాపుగా 6.5 టన్నుల వైద్యసాయాన్ని, 32 టన్నుల విపత్తు సహాయ సామాగ్రిని పాలస్తీనాకు పంపింది. ఈజిప్టు గుండా గాజాలోకి ఈ సాయం చేరుతుంది. ‘‘పాలస్తీనా ప్రజల కోసం దాదాపుగా 6.5 టన్నుల వైద్యసాయాన్ని, 32 టన్నుల విపత్తు సాయాన్ని తీసుకుని IAF C-17 విమానం ఈజిప్ట్లోని ఎల్-అరిష్ విమానాశ్రయానికి బయలుదేరింది’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందబ్ బాగ్చీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
Also Read
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
Read Also: Israel: హిజ్బుల్లా డేంజరస్ గేమ్ ఆడుతోంది.. లెబనాన్ని యుద్ధంలోకి లాగుతోంది..
మానవతా సాయం కింద ప్రాణాలను రక్షించే మందులు, శస్త్రచికిత్స వస్తువలుు, టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్స్, టార్పాలిన్స్, శానిటరీ వస్తువులు, నీటి శుద్దీకరణ వస్తువులు ఇందులో ఉన్నట్లు బాగ్చీ వెల్లడించారు. పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ తో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడిన మూడు రోజుల తర్వాత పాలస్తీనాకు భారత్ సాయాన్ని అందించింది. పాలస్తీనాకు భారత్ మానవతా సాయాన్ని పంపుతుందని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.
అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ పై ఊచకోతకు పాల్పడ్డారు. ఈ దాడిలో 1400 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో గాజాపై ఇజ్రాయిల్ పై విరుచుకుపడుతోంది. హమాస్ ఉగ్రవాదులను సర్వనాశనం చేస్తామని ప్రకటించిన ఇజ్రాయిల్, వారి స్థావరాలను టార్గెట్ చేస్తూ కీలక నేతలను మట్టుబెడుతోంది. ఇజ్రాయిల్ దాడుల్లో గాజాలో 4000కు పైగా మరణించారు.
🇮🇳 sends Humanitarian aid to the people of 🇵🇸!
An IAF C-17 flight carrying nearly 6.5 tonnes of medical aid and 32 tonnes of disaster relief material for the people of Palestine departs for El-Arish airport in Egypt.
The material includes essential life-saving medicines,… pic.twitter.com/28XI6992Ph
— Randhir Jaiswal (@MEAIndia) October 22, 2023
తాజావార్తలు
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!