India’s aid to Gaza: గాజాకు భారత్ భారీ సాయం.. 6.5 టన్నుల వైద్య సామాగ్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India’s aid to Gaza: ఇజ్రాయిల్, హమాస్ యుద్ధం నడుమ గాజాలోని సాధారణ పాలస్తీనా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు ఏ రాకెట్ ఎటునుంచి వస్తుందో అని, ఎక్కడ ఏ బాంబు పేలుతుందో అని భయపడుతున్నారు. మరోవైపు ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ ని దిగ్భంధించింది. ఉత్తర గాజాలోని ప్రజలను సురక్షితమైన దక్షిణ ప్రాంతాలకు వెళ్లాలని సూచించడంతో, ఆ ప్రాంతంలోని 10 లక్షల మందిలో 7 లక్షల మంది దక్షిణ వైపు వెళ్లారు.
ప్రస్తుతం దక్షిణాన ఉన్న ఈజిప్టు నుంచి గాజాలోని రఫా క్రాసింగ్ వద్ద నుంచి గాజా ప్రజలకు మానవతా సాయం అందుతోంది. ఇదిలా ఉంటే యుద్ధంతో తల్లడిల్లిపోతున్న గాజా ప్రజలకు భారత్ కూడా ఆపన్నహస్తం అందించింది. పాలస్తీనా ప్రజల కోసం దాదాపుగా 6.5 టన్నుల వైద్యసాయాన్ని, 32 టన్నుల విపత్తు సహాయ సామాగ్రిని పాలస్తీనాకు పంపింది. ఈజిప్టు గుండా గాజాలోకి ఈ సాయం చేరుతుంది. ‘‘పాలస్తీనా ప్రజల కోసం దాదాపుగా 6.5 టన్నుల వైద్యసాయాన్ని, 32 టన్నుల విపత్తు సాయాన్ని తీసుకుని IAF C-17 విమానం ఈజిప్ట్లోని ఎల్-అరిష్ విమానాశ్రయానికి బయలుదేరింది’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందబ్ బాగ్చీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
Also Read
- పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై 'Telegram'కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
- Delhi Government: కీలక ఆదేశాలు.. వర్క్ ఫ్రమ్ హోమ్కు గుడ్బై
- Ram Mandir Donation Scam: రోజూ రూ.6-8 లక్షలు మాయం..? రామ మందిరం కేసులో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- EPFOలో కీలక మార్పులు.. పోర్టల్లో రెండు సేవలకు ముగింపు..
Read Also: Israel: హిజ్బుల్లా డేంజరస్ గేమ్ ఆడుతోంది.. లెబనాన్ని యుద్ధంలోకి లాగుతోంది..
మానవతా సాయం కింద ప్రాణాలను రక్షించే మందులు, శస్త్రచికిత్స వస్తువలుు, టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్స్, టార్పాలిన్స్, శానిటరీ వస్తువులు, నీటి శుద్దీకరణ వస్తువులు ఇందులో ఉన్నట్లు బాగ్చీ వెల్లడించారు. పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ తో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడిన మూడు రోజుల తర్వాత పాలస్తీనాకు భారత్ సాయాన్ని అందించింది. పాలస్తీనాకు భారత్ మానవతా సాయాన్ని పంపుతుందని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.
అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ పై ఊచకోతకు పాల్పడ్డారు. ఈ దాడిలో 1400 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో గాజాపై ఇజ్రాయిల్ పై విరుచుకుపడుతోంది. హమాస్ ఉగ్రవాదులను సర్వనాశనం చేస్తామని ప్రకటించిన ఇజ్రాయిల్, వారి స్థావరాలను టార్గెట్ చేస్తూ కీలక నేతలను మట్టుబెడుతోంది. ఇజ్రాయిల్ దాడుల్లో గాజాలో 4000కు పైగా మరణించారు.
🇮🇳 sends Humanitarian aid to the people of 🇵🇸!
An IAF C-17 flight carrying nearly 6.5 tonnes of medical aid and 32 tonnes of disaster relief material for the people of Palestine departs for El-Arish airport in Egypt.
The material includes essential life-saving medicines,… pic.twitter.com/28XI6992Ph
— Randhir Jaiswal (@MEAIndia) October 22, 2023
తాజావార్తలు
-
CM Chandrababu Naidu: ‘సీమలో సీన్ మారింది’.. ఫ్యాక్షన్ రాజకీయాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Trump: ‘జస్ట్ వారికి విరామం ఇచ్చాం’.. ఖమేనీ అంత్యక్రియల వేళ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Rythu Bharosa : రైతులకు గుడ్న్యూస్.. 5-6 ఎకరాలకు రైతు భరోసా జమ
-
Rajamouli Goes Global: రాజమౌళికి అరుదైన గౌరవం
-
Hyderabad: జిమ్ ప్రియులకు బిగ్ అలర్ట్.. యువతే టార్గెట్గా స్టెరాయిడ్స్, నిషేధిత ఇంజెక్షన్ల దందా..
ట్రెండింగ్
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..