భారత్-ఆప్ఘనిస్థాన్ మధ్య బంధం మరింత బలపడుతోంది. ఇటీవల ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తా భారత్లో పర్యటించారు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య బంధం స్ట్రాంగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో తొలి తాలిబన్ దౌత్యవేత్తను నియమించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
భారతీయ టెన్నిస్ లెజెండ్, రెండు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ రోహన్ బోపన్నా తన ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్కు వీడ్కోలు పలికారు. 20 సంవత్సరాలకు పైగా కొనసాగిన ఈ అద్భుతమైన ప్రయాణానికి ముగింపు పలికిన ఈ 45 ఏళ్ల అథ్లెట్, ఇన్స్టాగ్రామ్లో ఎమోషనల్ పోస్టును పోస్టు చేశారు. బోపన్న చివరిసారిగా పారిస్ మాస్టర్స్ 1000లో అలెగ్జాండర్ బుబ్లిక్తో కలిసి డబుల్స్ మ్యాచ్ ఆడాడు. నా జీవితానికి అర్థం ఇచ్చిన ఈ ఆటకు.. మర్చిపోలేని రీతిలో 20 సంవత్సరాల పాటు…
కేరళ సరికొత్త చరిత్రను సృష్టించింది. దేశంలోనే తొలి పేదరికం లేని రాష్ట్రంగా అవతరించింది. ఈ మేరకు కేరళ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ శనివారం ప్రకటించారు. భారతదేశంలోనే పేదరికాన్ని నిర్మూలించిన మొదటి రాష్ట్రంగా కేరళ నిలిచిందని వెల్లడించారు.
భారత్-అమెరికా మధ్య కీలక రక్షణ ఒప్పందం జరిగింది. దశాబ్ద కాలం నాటి రక్షణ చట్టానికి భారతదేశం అమెరికా సంతకం చేశాయి. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. 10 ఏళ్ల పాటు ఉండే ఈ ఒప్పందం ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక, భద్రతా సహకారాన్ని బలోపేతం చేయనుంది.