Rishabh Pant, Ishan Kishan in contention for T20 World Cup 2024 Said Rahul Dravid: టీ20 ప్రపంచకప్ 2024 ముందు భారత్ ఆఖరి పొట్టి సిరీస్ ఆడేసింది. ఇక ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ అనంతరం భారత ఆటగాళ్లు ఐపీఎల్ 2024లో ఆడనున్నారు. ఆపై యూఎస్, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్లో బరిలోకి దిగుతారు. ఈ పొట్టి టోర్నీలో ఎవరికి అవకాశం దక్కుతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.…
అండర్ -19 వరల్డ్ కప్ లో భారత్ విక్టరీ కొట్టింది. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా 84 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. ఆ తర్వాత 252 పరుగుల పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా 167 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా బ్యాటర్లలో ఆదర్శ్ సింగ్ (76), ఉదయ్ సహారన్ (64) పరుగులతో…
Amit Shah: భారతదేశంలోకి మయన్మార్ నుంచి స్వేచ్ఛగా ప్రజల రాకపోకలను నియంత్రించేందుకు మయన్మార్ సరిహద్దుల్లో కంచెను నిర్మిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. మయన్మార్లో జాతుల సంఘర్షణ నుంచి తప్పించుకునేందుకు అక్కడి సైనికులు భారత్ లోని మిజోరాం, మణిపూర్ రాష్ట్రాలకు వస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మయన్మార్తో భారత్ సరిహద్దుల్ని బంగ్లాదేశ్తో సమానంగా రక్షించాలని అస్సాం పోలీస్ కమాండో పాసింగ్ పరేడ్లో అమిత్ షా అన్నారు.
భారతదేశంలో 355 కొత్త కోవిడ్ -19 ఇన్ఫెక్షన్ల ఒక్క రోజు పెరుగుదల నమోదైంది. దేశంలో ఇప్పుడు క్రియాశీల కేసుల సంఖ్య 2,331 గా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది.. శుక్రవారం INSACOG ప్రకారం, దేశంలో ఇప్పటివరకు మొత్తం 1,378 COVID-19 సబ్-వేరియంట్ JN.1 కేసులు నమోదయ్యాయి, మణిపూర్ దాని ఉనికిని గుర్తించిన తాజా రాష్ట్రంగా అవతరించింది.. ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) అనౌన్స్ చేసిన డేటా ప్రకారం మహారాష్ట్రలో అత్యధికంగా 320…
Suryakumar Yadav Surgery: టీమిండియా స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ సర్జరీ సక్సెస్ అయింది. స్పోర్ట్స్ హెర్నియా సమస్యతో బాధపడుతున్న సూర్య.. శస్త్రచికిత్స కోసం ఇటీవల జర్మనీ వెళ్లాడు. బుధవారం అతడికి వైద్యులు సర్జరీ చేశారు. సర్జరీ అనంతరం ఆస్పత్రి బెడ్పై ఉన్న తన ఫొటోను సూర్య సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు. అతి త్వరలో పునరాగమనం చేస్తా అని పేర్కొన్నాడు. ‘శస్త్రచికిత్స…
Iran's strikes in Pakistan: పాకిస్తాన్పై ఇరాన్ దాడి చేసింది. బలూచిస్తాన్ లోని కీలమైన రెండు ప్రాంతాలపై వైమానికి దాడులకు పాల్పడింది. దీనిపై భారత్ స్పందించింది. ఇది రెండు దేశాలకు సంబంధించిన విషయమని, ఉగ్రవాదం పట్ల ఇరాన్ స్పందించిందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇరాన్ తన ఆత్మరక్షణ కోసం దాడులు చేసినట్లు భారత్ అర్థం చేసుకుంటుందని తెలిపింది. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ వైఖరిని భారత్ మరోసారి నొక్కి చెప్పింది.
3 టీ20 సిరీస్ లో భాగంగా భారత్-అఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగనుంది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో భారత్ మూడు మార్పులతో బరిలోకి దిగుతుంది. అటు అఫ్ఘనిస్తాన్ జట్టులో కూడా మూడు మార్పులు చేశారు. మూడో టీ20లో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ జితేష్ శర్మ, పేసర్ అర్ష్దీప్ సింగ్ ఆడటం లేదు. వికెట్ కీపర్ సంజూ…
India and Pakistan Share T20I Whitewash Record: భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మద్య ప్రస్తుతం టీ20 సిరీస్ జరుగుతోంది. టీ20 ప్రపంచకప్ ముందు ఆడుతున్న ఈ చివరి సిరీస్లో భారత్ అదరగొడుతోంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకున్న రోహిత్ సేన.. పొట్టి ఫార్మాట్లో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉంది. గురువారం బెంగళూరు వేదికగా అఫ్గానిస్థాన్తో జరిగే మ్యాచ్లో భారత్ విజయం సాధిస్తే.. టీ20 చరిత్రలో అత్యధిక వైట్వాష్లు చేసిన జట్టుగా…