75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం 132 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో యంగ్ లీకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది.
భారత్తో సరిహద్దు వివాదంపై డ్రాగన్ కంట్రీ చైనా మరోసారి సంచలన కామెంట్స్ చేసింది. ద్వైపాక్షిక సంబంధాలను సరిహద్దు వివాదంతో ముడిపెట్టడం సరికాదని వెల్లడించింది. డ్రాగన్ కంట్రీ చర్యల ఫలితంగానే తూర్పు లద్ధాఖ్లోని గల్వాన్ లోయలో భారత్- చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగింది.
75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా భారత్ కు అభినందనలు తెలియజేస్తున్నారు. కాగా, భారత్లోని రష్యా రాయబార కార్యాలయం ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది. రష్యా రాయబార కార్యాలయం ఓ వీడియోను షేర్ చేసి 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపింది.
India on Pak: గతేడాది పాకిస్తాన్లో ఇద్దరు ఉగ్రవాదుల్ని గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు. అయితే ఈ హత్యల్లో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి ఆరోపించారు. అయితే, పాకిస్తాన్ ఆరోపణల్ని భారత్ తీవ్రంగా ఖండగించింది. పాక్ ఆరోపణలు భారత వ్యతిరేక ప్రచారాన్ని పెంపొందించడానికి తాజా ప్రయత్నమని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.
Pakistan: ఇటీవల కాలంలో పాకిస్తాన్లో భారత వ్యతిరేక ఉగ్రవాదులు ఒక్కొక్కరిగా గుర్తుతెలియని వ్యక్తుల చంపుతున్నారు. అయితే ఈ హత్యల వెనక భారత్ ఉందని పాక్ ప్రభుత్వం అంతర్గతంగా అనుకుంటున్నప్పటికీ.. ఎప్పుడూ కూడా బహిరంగ వ్యాఖ్యలు చేయలేదు. అయితే తొలిసారిగా పాక్ విదేశాంగ కార్యదర్శి సైరస్ సజ్జాద్ భారత్పై సంచలన ఆరోపణలు చేశారు. ఇద్దరు భారత ఏజెంట్లు యోగేష్ కుమార్, అశోక్ కుమార్ ఆనంద్లు పాకిస్తాన్ గడ్డపై ఇద్దరు పాకిస్తానీలను హత్యల్లో ప్రయేయం ఉందని ఆరోపించారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఖలిస్తానీ ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కెనడాను భారత్ హెచ్చరించింది. కెనడా తమ దౌత్య సముదాయాలకు భద్రత కల్పించాలని భారత్ కోరింది.
లంచ్ బ్రేక్ సమయానికి 28 ఓవర్లు ఆడిన ఇంగ్లాండ్ కీలకమైన 3 వికెట్లను కోల్పోయి 108 పరుగులు చేసింది. ఇక, ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జానీ బేయిస్ట్రో 32 పరుగులు, జో రూట్ 18 పరుగులతో నాటౌట్ గా క్రీజులో ఉన్నారు.
General elections: భారతదేశంలో లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మరికొన్ని నెలల్లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం(WEF) ‘ది గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2024’ పేరుతో ఓ నివేదికను తీసుకువచ్చింది. భారత్లో సార్వత్రిక ఎన్నికల సమయంలో తప్పుడు సమాచార ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెప్పింది. ప్రపంచంలోనే తప్పుడు సమాచార ప్రమాదాన్ని ఎదుర్కోవడంలో భారత్ మొదటిస్థానంలో ఉందని నివేదిక తెలిపింది. నివేదిక జనవరి ప్రారంభంలో దాని గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ మరియు గ్లోబల్…
Rohan Bopanna getting to World Number 1: 43 ఏళ్ల వయసులో భారత టెన్నిస్ స్టార్ రోహన్ బొప్పన్న చరిత్ర సృష్టించాడు. పురుషుల డబుల్స్ టెన్నిస్ చరిత్రలో ప్రపంచ నం. 1గా నిలిచిన అతిపెద్ద వయసుకుడిగా బొప్పన్న నిలవనున్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్ 2024 ముగిసిన తర్వాత రిలీజ్ చేసే ర్యాంకుల్లో బొప్పన్న ఈ ఘనతను అందుకోనున్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల డబుల్స్లో బొప్పన్న, మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడి సెమీ-ఫైనల్కు చేరుకోవడంతో ప్రపంచ నంబర్ 1…
గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొనేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ రేపు (గురువారం) భారత్కు రానున్నారు. రిపబ్లిక్ డే పరేడ్కు మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరుకాబోనున్నారు.