Maldives: మాల్దీవుల్లో చైనా అనుకూల వ్యక్తి మహ్మద్ ముయిజ్జు అధ్యక్షుడు కాగానే.. భారత వ్యతిరేక వైఖరి అవలంభిస్తున్నాడు. ఇప్పటికే ద్వీపదేశంలో ఉన్న భారత సైనికులను వెళ్లాల్సిందిగా కోరాడు. ఇప్పుడు మరో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నాడు. భారత్తో కలిసి మాల్దీవులు చేస్తున్న హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందాన్ని పునరుద్ధరించుకోబోమని ఆ దేశం చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. మాల్దీవుల పబ్లిక్ పాలసీ అండర్ సెక్రటరీ మహ్మద్ ఫిరుజుల్ మాట్లాడుతూ..
Iran: భారతీయ సందర్శకులకు ఇరాన్ గుడ్ న్యూస్ చెప్పింది. తమ దేశానికి వచ్చే భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి వచ్చే సందర్శకుల వీసా నిబంధనలను ఏకపక్షంగా రద్దు చేయాలని ఇరాన్ మంత్రివర్గం నిర్ణయించిందని ఇరాన్ సాంస్కృతిక వారసత్వం, పర్యాటక మంత్రి ఎజ్జతోల్లా జర్ఘామి తెలిపారు. భారత్తో సహా 33 దేశాలకు వీసా నిబంధనలను రద్దు చేస్తూ ఇరాన్ బుధవారం నిర్ణయం తీసుకుంది.
భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పాడు. టెస్ట్ సిరీస్ కోసం తాను దక్షిణాఫ్రికా వెళ్లేందుకు రెడీగా లేనట్లు వెల్లడించాడు. తన మోకాలి నొప్పి కోసం చికిత్స తీసుకుంటున్నాను.. కాస్త ఊరట లభించినా కచ్చితంగా టీమ్ తో కలుస్తానని వెల్లడించాడు.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దును సుప్రీంకోర్టు సమర్థించింది. ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే అని, రాజ్యాంగానికి లోబడే నిర్ణయం ఉందని తెలిపింది. ఆర్టికల్ 370 కేవలం తాత్కిలిక సదుపాయం మాత్రమే అని, ఇది దేశంలో అవిభాజ్య అంతర్భాగమని చెప్పింది. అయితే జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్రానికి సూచించింది.
U19 World Cup 2024 India Squad: అండర్-19 ప్రపంచకప్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ జూనియర్ సెలక్షన్ కమిటీ మంగళవారం ప్రకటించింది. ప్రస్తుతం దుబాయ్లో అండర్-19 ఆసియాకప్ 2023లో పాల్గొంటున్న జట్టునే మెగా టోర్నీకి ఎంపిక చేసింది. ప్రపంచకప్ జట్టుకు పంజాబ్కు చెందిన ఉదయ్ సహరన్ కెప్టెన్గా వ్యవహరించనుండగా.. మధ్యప్రదేశ్కు చెందిన సౌమ్య్కుమార్ పాండే వైస్ కెప్టెన్గా అవకాశం దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికా వేదికగా జనవరి 19 నుంచి ఫిబ్రవరి 11 వరకు ప్రపంచకప్ జరగనుంది.…
మెర్సర్స్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ర్యాంకింగ్స్ 2023లో హైదరాబాద్ "భారతదేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరం"గా ర్యాంక్ చేయబడింది.. ఈ జాబితాలో 153వ ర్యాంక్తో హైదరాబాద్ టాప్ స్పాట్లో నిలవగా.. ఆ తర్వాత 154వ ర్యాంక్తో పుణె రెండో స్థానం, 156వ ర్యాంక్తో బెంగళూరు మూడో స్థానం, 161 ర్యాంక్తో చెన్నై నాలుగో స్థానం, 164 ర్యాంక్తో ముంబై ఐదో స్థానం, 170 ర్యాంక్తో కోల్కతా ఆరో స్థానం, 172 ర్యాంక్తో న్యూఢిల్లీ ఏడో స్థానంలో నిలిచాయి.
Joe Biden: రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ వచ్చే నెలలో భారత్కు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. వచ్చే ఏడాది జనవరిలో కాకుండా వేరే తేదీలో క్వాడ్ కాన్ఫరెన్స్ను నిర్వహించాలని భారతదేశం పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇండియా-సౌతాఫ్రికా మధ్య రెండో టీ20 మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. గ్కెబెర్హాలోని సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. కాగా.. ఆతిథ్య దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అయితే డిసెంబర్ 10న జరగాల్సిన మొదటి టీ20 వర్షం కారణంగా టాస్ లేకుండానే రద్దయింది. అయితే ఈ మ్యాచ్ కు సంబంధించి ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉందో తెలుసుకుందాం. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 నెంబర్ వన్ బౌలర్ రవి…
China: 2017లో భారత్, చైనాల మధ్య డోక్లామ్ వివాదం తలెత్తిన సమయంలో పశ్చిమ భూటాన్కు సమీపంలో ఉన్న సిలిగురి కారిడార్ ఒక ముఖ్యమైన వ్యూహాత్మక ప్రదేశంగా మారింది.
కరోనా పూర్తిగా నామరూపాల్లేకుండా పోయిందని అనుకుంటున్న తరుణంలో, మరోసారి కేసుల పెరుగుదల హాట్ టాపిక్ గా మారింది. చాలా రోజుల తర్వాత మళ్లీ కొవిడ్ కొత్త కేసులు పెద్ద సంఖ్యలో బయటపడ్డాయి. 24 గంటల వ్యవధిలో 166 మంది కొత్తగా కొవిడ్ మహమ్మారి బారినపడ్డారు. ఈ 166 కొత్త కేసులలో అత్యధికంగా కేరళ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 895కు చేరిందని తెలిపింది కేంద్రఆరోగ్య శాఖ. మొన్నటి వరకు…