POK: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో ‘ఆజాదీ’ నినాదాలు మిన్నంటుతున్నాయి. పాకిస్తాన్ నుంచి విముక్తి కావాలంటూ పీఓకే ప్రజలు ఉద్యమిస్తున్నారు. అయితే, ఈ నిరసనలను అణిచివేసేందుకు పాకిస్తాన్ శతవిధాలా ప్రయత్నిస్తోంది.
చైనా- భారత్ మధ్య తీవ్రమైన ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉంటుంది. సరిహద్దుల్లో చైనాతో ఘర్షణలు కొనసాగుతున్నప్పటికీ.. వాణిజ్యం ఎందుకు పెరుగుతోందనే ప్రశ్నకు విదేశాంగ మంత్రి జైశంకర్ సమాధానమిచ్చారు.
ప్రపంచంలోని 5 దేశాల్లో ఉన్న ఖలిస్తానీ టైగర్ ఫోర్స్ (కేటీఎఫ్)కి చెందిన 5 మంది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు భారత్పై భారీ కుట్రకు ప్లాన్ చేస్తున్నారు. వారు విదేశాలలో నుంచి ప్లాట్లు చేస్తున్నారు.
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో మరో భారతీయ యువకుడిని అరెస్టు చేసినట్లు కెనడా పోలీసులు శనివారం తెలిపారు. ఆ కేసుకు సంబంధించి ఇప్పటికే కరణ్ బ్రార్ (22), కమల్ప్రీత్ సింగ్ (22), కరణ్ప్రీత్ సింగ్ (28) ముగ్గురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
భారతదేశం వారసత్వ పన్ను విధిస్తే.. దేశంలోని చాలా మంది ధనవంతులు దేశాన్ని విడిచిపెట్టి, పన్ను లేని దేశానికి తరలిపోతారని రాజకీయ ఆర్థికవేత్త గౌతమ్ అదాని అన్నారు. గతంలో స్వీడన్లో భారీ వారసత్వ పన్ను ఉండేదని.. అయితే చాలా మంది ధనవంతులు ఆ దేశం నుంచి పారిపోతున్నందున వారసత్వ పన్నును తొలగించిందని చెప్పారు. దుబాయ్ వంటి దేశాలకు వెళ్లి పన్నులు చెల్లించకుండా తప్పించుకుంటున్నారని తెలిపారు.
సింగపూర్ ప్రధాని లీ హ్సీన్ లూంగ్ భారతీయ ప్రతిభను మెచ్చుకున్నారు. భారత్ లోని ఐఐటీ(IIT), ఐఐఎం(IIM)ని ప్రశంసించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తన 20 ఏళ్ల ప్రధానమంత్రి పదవీకాలం గురించి చర్చించారు.
మాల్దీవుల్లో నివసిస్తున్న భారత సైనికులంతా ఇప్పుడు స్వదేశానికి చేరుకున్నారు. మాల్దీవుల నుంచి భారత్ తన సైనికులందరినీ ఉపసంహరించుకున్నట్లు మాల్దీవుల ప్రభుత్వం ప్రకటించింది.
పాలస్తీనాను సభ్యదేశంగా చేయాలనే ప్రతిపాదనకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భారత్ మద్దతు తెలిపింది. పాలస్తీనాకు మద్దతుగా ఓటేసింది. ఐక్యరాజ్యసమితిలో అరబ్ దేశాల సమూహం సమర్పించిన తీర్మానంలో పాలస్తీనా సభ్యత్వానికి పూర్తి అర్హత కలిగి ఉందని పేర్కొంది.
India-Canada: ఖలిస్తాన్ మద్దతుదారులకు, ఇండియా వ్యతిరేకులకు మద్దతుగా వ్యవహరిస్తోంది కెనడాలోని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత
మాల్దీవులు- భారత్ మధ్య కొంత కాలంగా ఓ వివాదం కొనసాగుతోంది. కొద్దినెలల కిందట భారత ప్రధాని మోడీ లక్షద్వీప్ పర్యటన చేశారు. ఆయన సోషల్ మీడియాలో ఫొటోలు పంచుకున్న నేపథ్యంలో మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే.