Pakistan: భారత్ వాళ్లకు మద్దతు ఇస్తుంటే, మనం దొంగలుగా చూస్తున్నాం.. పాక్ మంత్రి ప్రశంసలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ కొత్త ప్రభుత్వంలోని మంత్రులు భారత్పై వరసగా ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఇటీవల ఆ దేశంలోని పలువురు మంత్రులు భారతదేశ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. భారత్ చంద్రుడిపై అడుగు పెడుతుంటే మనం మాత్రం అడుక్కుతింటున్నామని పాకిస్తాన్ ఎంపీ తన ఆవేదన వ్యక్తం చేశారు. దీని తర్వాత పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సీన్ నఖ్వీ భారత్ని ప్రశంసించారు. తమ దేశం వ్యాపారవేత్తలను దొంగలుగా చూస్తుంటే, భారత్ మాత్రం ఆ దేశంలోని వ్యాపారవేత్తలకు మద్దతుగా నిలుస్తోందని అన్నారు. భారత్ అభివృద్ధి చెందడానికి ఇది ఓ కారణం అంటూ వ్యాఖ్యలు చేశారు.
భారతదేశంలో వ్యాపారవేత్తలకు గౌరవం ఉంటుందని, ప్రభుత్వం వారికి మద్దతుగా నిలుస్తుందని ఆయన అన్నారు. కానీ పాకిస్తాన్లో మాత్రం వ్యాపారవేత్తలు ఎదుగుతుంటే వారిపై దొంగలుగా ముద్ర వేస్తారని చెప్పారు. ఓ వ్యాపారవేత్తగా నా డబ్బును నాకు నచ్చిన చోట పెట్టుబడి పెడతా, నా భార్యకు లండన్లో ఆస్తులు ఉన్నాయి, అక్కడ వాటికి పన్నులు చెల్లిస్తున్నామని ఆయన అన్నారు. విదేశాల్లో పెట్టుబడి పెట్టడం తప్పుకాదని, అక్రమంగా సంపాదించే ఆస్తులపై దర్యాప్తు సంస్థలు విచారణ చేపటొచ్చని అన్నారు. పాక్కి చెందిన పలు మీడియా సంస్థలకు కూడా దుబాయ్లో ఆస్తులు ఉన్నాయని చెప్పారు.
Also Read
- Oil Exports: కొత్తగా పైప్లైన్లు, పోర్టు.. హార్ముజ్ బైపాస్కు గల్ఫ్ దేశాల మాస్టర్ ప్లాన్
- US-Iran War: 'ట్రంప్ను చంపేస్తాం'.. శవపేటికలో అమెరికా అధ్యక్షుడు..ఇరాన్ ప్రచారం..
- Earthquake: న్యూజిలాండ్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
- JD Vance-Iran: జేడీ వాన్స్కు ఇరాన్ రహస్య హెచ్చరిక? అంతర్జాతీయంగా తీవ్ర కలకలం
Read Also: Delhi Air Port: విమానం అత్యవసర ల్యాండింగ్.. ప్రయాణికులు సేఫ్
ఇదిలా ఉంటే ‘‘దుబాయ్ లీక్స్’’ పేరుతో విడుదలైన ఓ నివేదిక పాకిస్తాన్ ప్రజల్లో ఆగ్రహానికి కారణమైంది. దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగంలో పాక్కి చెందిన 17 మంది భారీ సంఖ్యలో ఆస్తులను కూడబెట్టినట్లుగా తేలింది. వీటి విలువ దాదాపుగా రూ. 90 వేట కోట్లకు పైగానే ఉంటుందని లెక్క కట్టింది. పాకిస్తాన్ మంత్రి నఖ్వీ భార్య పేరు మీద కూడా ఆస్తులు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ పిల్లలైన బిలాలవల్ భుట్టో జర్దారీ, భఖ్త్వర్ భుట్టో, ఆసీఫా భుట్టో కూడా ఈ జాబితాలో ఉన్నారు. మాక్ మాజీ పీఎం నవాజ్ షరీఫ్ కొడుకు హుస్సేన్ నవాజ్, మాజీ ఆర్మీ చీఫ్ కమల్ జావేద్ బజ్వా తనయుడి పేరుపై కూడా ఆస్తులు ఉన్నాయి. చాలా మంది రిటైర్డ్ పాక్ ఆర్మీ అధికరుల పేర్లు కూడా జాబితాలో ఉన్నాయి. ఇలా పాక్ ప్రముఖుల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. వీళ్లంతా విదేశాల్లో డబ్బును దాచుకుంటే, పాక్కి పెట్టుబడులు ఎలా వస్తాయని అక్కడి ప్రజానీకం ప్రశ్నిస్తోంది.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!