Pakistan: భారత్ వాళ్లకు మద్దతు ఇస్తుంటే, మనం దొంగలుగా చూస్తున్నాం.. పాక్ మంత్రి ప్రశంసలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ కొత్త ప్రభుత్వంలోని మంత్రులు భారత్పై వరసగా ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఇటీవల ఆ దేశంలోని పలువురు మంత్రులు భారతదేశ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. భారత్ చంద్రుడిపై అడుగు పెడుతుంటే మనం మాత్రం అడుక్కుతింటున్నామని పాకిస్తాన్ ఎంపీ తన ఆవేదన వ్యక్తం చేశారు. దీని తర్వాత పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సీన్ నఖ్వీ భారత్ని ప్రశంసించారు. తమ దేశం వ్యాపారవేత్తలను దొంగలుగా చూస్తుంటే, భారత్ మాత్రం ఆ దేశంలోని వ్యాపారవేత్తలకు మద్దతుగా నిలుస్తోందని అన్నారు. భారత్ అభివృద్ధి చెందడానికి ఇది ఓ కారణం అంటూ వ్యాఖ్యలు చేశారు.
భారతదేశంలో వ్యాపారవేత్తలకు గౌరవం ఉంటుందని, ప్రభుత్వం వారికి మద్దతుగా నిలుస్తుందని ఆయన అన్నారు. కానీ పాకిస్తాన్లో మాత్రం వ్యాపారవేత్తలు ఎదుగుతుంటే వారిపై దొంగలుగా ముద్ర వేస్తారని చెప్పారు. ఓ వ్యాపారవేత్తగా నా డబ్బును నాకు నచ్చిన చోట పెట్టుబడి పెడతా, నా భార్యకు లండన్లో ఆస్తులు ఉన్నాయి, అక్కడ వాటికి పన్నులు చెల్లిస్తున్నామని ఆయన అన్నారు. విదేశాల్లో పెట్టుబడి పెట్టడం తప్పుకాదని, అక్రమంగా సంపాదించే ఆస్తులపై దర్యాప్తు సంస్థలు విచారణ చేపటొచ్చని అన్నారు. పాక్కి చెందిన పలు మీడియా సంస్థలకు కూడా దుబాయ్లో ఆస్తులు ఉన్నాయని చెప్పారు.
Also Read
- OPEC: యూఏఈ బాటలో ఇరాక్.. ఒపెక్లో సౌదీ అరేబియా ఆధిపత్యానికి సవాల్..
- Denmark: డెన్మార్క్లో అజాన్పై బ్యాన్.. ఇస్లామీకీకరణపై ఆందోళన..
- Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
Read Also: Delhi Air Port: విమానం అత్యవసర ల్యాండింగ్.. ప్రయాణికులు సేఫ్
ఇదిలా ఉంటే ‘‘దుబాయ్ లీక్స్’’ పేరుతో విడుదలైన ఓ నివేదిక పాకిస్తాన్ ప్రజల్లో ఆగ్రహానికి కారణమైంది. దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగంలో పాక్కి చెందిన 17 మంది భారీ సంఖ్యలో ఆస్తులను కూడబెట్టినట్లుగా తేలింది. వీటి విలువ దాదాపుగా రూ. 90 వేట కోట్లకు పైగానే ఉంటుందని లెక్క కట్టింది. పాకిస్తాన్ మంత్రి నఖ్వీ భార్య పేరు మీద కూడా ఆస్తులు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ పిల్లలైన బిలాలవల్ భుట్టో జర్దారీ, భఖ్త్వర్ భుట్టో, ఆసీఫా భుట్టో కూడా ఈ జాబితాలో ఉన్నారు. మాక్ మాజీ పీఎం నవాజ్ షరీఫ్ కొడుకు హుస్సేన్ నవాజ్, మాజీ ఆర్మీ చీఫ్ కమల్ జావేద్ బజ్వా తనయుడి పేరుపై కూడా ఆస్తులు ఉన్నాయి. చాలా మంది రిటైర్డ్ పాక్ ఆర్మీ అధికరుల పేర్లు కూడా జాబితాలో ఉన్నాయి. ఇలా పాక్ ప్రముఖుల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. వీళ్లంతా విదేశాల్లో డబ్బును దాచుకుంటే, పాక్కి పెట్టుబడులు ఎలా వస్తాయని అక్కడి ప్రజానీకం ప్రశ్నిస్తోంది.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: ‘పెళ్లి నుంచి తప్పించుకోలేవు’.. కేతన్పై సియా గోయల్ సంచలన ఆరోపణ
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
-
OPEC: యూఏఈ బాటలో ఇరాక్.. ఒపెక్లో సౌదీ అరేబియా ఆధిపత్యానికి సవాల్..
-
Stainless Steel Railing Cleaning Tips: ఖరీదైన క్లీనర్లు కొనక్కర్లేదు.. ఇంట్లోనే స్టీల్ రెయిలింగ్లను మెరిపించే సీక్రెట్స్..
-
Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం వెండి ఇటుకలు మాయమయ్యాయా? సిట్ దర్యాప్తులో సంచలన నిజాలు!
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!