భారత్లో ఒలింపిక్స్ నిర్వహణపై ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు. 2036లో ఒలింపిక్స్ను నిర్వహించేందుకు ఇండియా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసిందని ప్రధాని వ్యాఖ్యానించారు.
Kyrgyzstan: కిర్గిజ్ స్థాన్ దేశంలో భారత్, పాకిస్తానీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని అక్కడి స్థానికులు దాడులకు తెగబడుతున్నారు. రాజధాని బిష్కెక్లో గత రెండు రోజులుగా స్థానికులు, విదేశీ విద్యార్థులకు మధ్య ఘర్షణలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన విద్యార్థులపై దాడులకు చేస్తున్నారు. ఈ హింసాత్మక సంఘటనల్లో ఇప్పటికే ముగ్గురు పాకిస్తానీ విద్యార్థులు మరణించినట్లు నివేదికలు ఉన్నాయి. ఇప్పటికే భారత్, పాకిస్తాన్ దేశాలు తమ పౌరులను ఇళ్లకే పరిమితం కావాలని సలహాలు జారీ చేసింది.…
అమెరికా మరోసారి భారత్ ను మెచ్చుకుంది. భారత్ లో సార్వత్రికి ఎన్నికలపై అమెరికా ప్రశంసలు కురిపించింది. ప్రపంచంలో భారత్ కంటే శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం మరొకటి లేదని కొనియాడింది. ఆ దేశ వైట్ హౌస్ జాతీయ భద్రతా సమాచార సలహాదారు జాన్ కిర్బీ ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ భారత్ను ప్రశంసించారు.
Pakistan: పాకిస్తాన్ కొత్త ప్రభుత్వంలోని మంత్రులు భారత్పై వరసగా ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఇటీవల ఆ దేశంలోని పలువురు మంత్రులు భారతదేశ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు.
Israel: ఇండియా నుంచి ఇజ్రాయిల్కి ఆయుధాలను తీసుకెళ్తున్న నౌకను తమ నౌకాశ్రయంలో లంగరు వేయడానికి స్పెయిన్ అంగీకరించలేదు. మారియాన్ డానికా అనే డానిష్ జెండాతో ఉన్న ఓడకు అనుమతి నిరాకరించింది.
లోక్సభ ఎన్నికల వేళ భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త సురేష్ వి షెనాయ్ ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించారు. భారత ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తున్నది.. దేశంలో అవకాశాలకు కొదవలేదని అన్నారు.
పాకిస్థాన్ ప్రస్తుతం దైనీయ స్థితికి చేరుకుంది. ఈ పరిస్థితిని వివరిస్తూ.. ఆ దేశ చట్టసభ చర్చ జరుగుతోంది. ఈనేపథ్యంలో చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్ మాట్లాడుతూ.. భారత్ చంద్రుడిపై కాలుమోపుతుంటే.. పాక్ (Pakistan) మాత్రం ఇంకా మురుగు కాలువల్లో పిల్లల మరణాలనూ నివారించలేకపోతోందంటూ పేర్కొన్నారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి ఉత్తరాఖండ్ వక్ఫ్ బోర్డు చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం యుద్ధం అంచున ఉన్న ఈ తరుణంలో భారత్కి ప్రధాని మోడీ బలమైన నాయకత్వం అవసరమని బుధవారం అన్నారు.
ప్రస్తుతం దేశంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సమయాని కంటే ముందే అండమాన్ - నికోబార్ను తాకబోతున్నాయి.
Jaishankar: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ని గతేడాది గుర్తు తెలియని వ్యక్తులు కెనడాలోని సర్రేలో కాల్చిచంపారు. ఈ కేసులో నలుగురు భారతీయులను కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు.