Netanyahu: ‘అవును నేను చనిపోయాను’.. మరో వీడియో విడుదల చేసిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు..
- నెతన్యాహు మరణం వార్తలకు ఫుల్ స్టాప్..
- కాఫీతో సరదాగా వీడియో విడుదల..
- ఇజ్రాయెల్ ప్రజలకు సందేశం పంపిన ప్రధాని నెతన్యాహు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్ దాడిలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చనిపోయారని సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అయ్యాయి. ఈ ఊహాగానాలపై స్పందిస్తూ.. నెతన్యాహు స్వయంగా ఒక వీడియోను ‘ఎక్స్’ (ట్విట్టర్)లో విడుదల చేసి.. ఆ వార్తలను నవ్వుతూ కొట్టిపారేశారు.
కాఫీ తాగుతూ కౌంటర్..
నెతన్యాహు ఒక కేఫ్ వద్ద కాఫీ ఆర్డర్ చేస్తూ వీడియోలో కనిపించారు. ‘నేను చనిపోయాను… కాఫీ కోసం’ అంటూ ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. ‘నా ప్రజల కోసం నేను ప్రాణాలు ఇస్తున్నాను, వారి ధైర్యం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది’ అని ఆయన అన్నారు.
Also Read
- Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
Also Read:Moinabad Farmhouse Drugs Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. ఈగల్ టీం కీలక ప్రకటన..
ఇదిగో ఐదు వేళ్లు..
కొన్ని రోజుల క్రితం నెతన్యాహు ప్రెస్ మీట్లో పాల్గొన్న వీడియోను ఎవరో మార్ఫింగ్ చేసి.. ఆయన చేతికి ఆరు వేళ్లు ఉన్నాయని.. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో చేసిన వీడియో అని ప్రచారం చేశారు. దీనికి సమాధానంగా.. నెతన్యాహు తన రెండు చేతులను కెమెరా వైపు చూపిస్తూ.. ‘నా చేతి వేళ్లను లెక్కపెట్టాలనుకుంటున్నారా..? ఇక్కడ చూడండి, ఇదిగో ఇక్కడ… చూశారా? అన్నీ బాగానే ఉన్నాయి’ అని నవ్వుతూ చెప్పారు.
ప్రజలకు భరోసా..
ఇజ్రాయెల్ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. బయటకు వెళ్లండి కానీ ఎప్పుడూ సురక్షిత ప్రాంతాలకు దగ్గరలోనే ఉండండి. మీ ధైర్యం నాకు, ప్రభుత్వానికి, సైన్యానికి, మోసాద్ సంస్థకు ఎంతో బలాన్ని ఇస్తోంది. మేము ఇరాన్పై చాలా గట్టిగా దాడులు చేస్తున్నాం. మీరు ధైర్యంగా ముందుకు సాగండి, నేను కూడా మీతోనే ఉంటాను అని భరోసానిచ్చారు. అలాగే.. స్థానిక అధికారులు ఇచ్చే భద్రతా సూచనలను ఎప్పటికప్పుడు పాటించాలని ఆయన కోరారు.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలై 16 రోజులు దాటింది. గత నెలలో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించడంతో ఈ ఘర్షణ మరింత తీవ్రమైంది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ యుద్ధంలో ఇప్పటివరకు దాదాపు 2,000 మందికి పైగా మరణించారని.. వారిలో ఎక్కువ మంది ఇరాన్కు చెందినవారేనని సమాచారం. అమెరికా కూడా తన సైనిక బలగాలను ఆ ప్రాంతానికి పంపి.. ఇజ్రాయెల్కు మద్దతుగా నిలుస్తోంది.
తాజావార్తలు
-
Zombie Reddy 2: తేజ సజ్జ బర్త్డేకు ‘జోంబీ రెడ్డి 2’ బిగ్ సర్ప్రైజ్.. ప్రశాంత్ వర్మ హిట్కు సీక్వెల్ రెడీ!
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!