Eric Garcetti: చైనా, పాక్కి దగ్గరగా ఉండటం వల్లే భారత్ మాకు దూరమైంది: అమెరికా రాయబారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eric Garcetti: భారత్-అమెరికా సంబంధాల గురించి ఇండియాలో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో పాకిస్తాన్, చైనాతో స్నేహం కారణంగా తమకు భారత్ దూరమైందని అన్నారు. అయితే, 2000వ దశకం నుంచి భారత్-అమెరికా సంబంధాల్లో గణనీయమైన మార్పు కనిపించిందని చెప్పారు. రెండు దేశాల మధ్య పౌర అణు ఒప్పందం ద్వైపాక్షిక సంబంధాలకు కీలకమైన క్షణంగా నొక్కి చెప్పారు9.
‘‘ అమెరికా చైనా, పాకిస్తాన్లను ఎన్నుకున్నందుకు గతంలో భారత్, అమెరికాకు దూరంగా ఉంది, కానీ 2000లో భారత్-యూఎస్ పౌర అణు ఒప్పందంతో సంబంధాలల్లో స్థిరమైన కదలిక ఉంది’’ అని గార్సెట్టి చెప్పారు. అణు ఒప్పందం అంతర్జాతీయ వేదికల్లో భారత్ని ఏకీకృతం చేయడాన్ని సులభతరం చేసిందని, ఇది భారత్ పట్ల యూఎస్ నిబద్ధతకు ప్రతీక అని రాయబారి పేర్కొన్నారు.
Also Read
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
- Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
- RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
- Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
Read Also: Sandeshkhali: బెంగాల్ సందేశ్ఖాలీలో టెన్షన్.. తృణమూల్ ఎమ్మెల్యే సహాయకుడిపై దాడి..
చాలా కాలంగా, మేము బ్రిటీష్ వారి నుంచి ఇండియాకు స్వాతంత్ర్యం కోసం మద్దతు ఇచ్చాము, మాకు గొప్ప సంబంధాలు ఉన్నాయని, మేము 70ల్లో చైనాకు అమెరికా దగ్గరా ఉండటంతో భారత దేశానికి దూరంగా వెళ్లామని, వారిని రష్యా వైపు నెట్టామని గార్సెట్టీ చెప్పారు. అమెరికా, పాకిస్తాన్కి సన్నిహితంగా ఉండటంతో భారత్ తమను నమ్మదగిన భాగస్వామిగా చూడలేదని అన్నారు. 2000లలో అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జ్ డబ్ల్యూ బుష్ అణు ఒప్పందంపై భారత్తో చర్చలు జరపడం ప్రారంభించినప్పుడు ఈ అభిప్రాయం మారిపోయిందని అన్నారు.
ప్రస్తుత పరిస్థితులపై గార్సెట్టీ ఆశావాదాన్ని వ్యక్తం చేశారు. రెండు దేశాలు ఇప్పుడు నిబద్ధతతో కూడిన సంబంధంతో సమానంగా ఉన్నాయని అన్నారు. అమెరికా గడ్డపై ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూను హతమార్చేందుకు కుట్ర జరిగిందని, ఇందులో భారత అధికారుల ప్రమేయం ఉందనే ఆరోపణలపై భారత్ జవాబుదారీతనం పట్ల అమెరికా సంతృప్తి వ్యక్తం చేసిందని గార్సెట్టి చెప్పారు.
తాజావార్తలు
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
VishnuPriya : ఏడ్చి ఏడ్చి విసిగిపోయా, ఇక నోరు మూసుకునేది లేదు: విష్ణుప్రియ ఫైర్!
-
Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
-
RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
ట్రెండింగ్
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!