Israel: ఇండియా నుంచి ఇజ్రాయిల్కి ఆయుధాలతో వెళ్తున్న నౌకను అనుమతించని స్పెయిన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel: ఇండియా నుంచి ఇజ్రాయిల్కి ఆయుధాలను తీసుకెళ్తున్న నౌకను తమ నౌకాశ్రయంలో లంగరు వేయడానికి స్పెయిన్ అంగీకరించలేదు. మారియాన్ డానికా అనే డానిష్ జెండాతో ఉన్న ఓడకు అనుమతి నిరాకరించింది. నాటో కూటమిలో సభ్యదేశంగా ఉన్న స్పెయిన్ ఇలా చేయడం సంచలనంగా మారింది. భారతదేశం నుంచి ఇజ్రాయిల్లోని హైఫా నౌకాశ్రయానికి 27 టన్నుల పేలుడు పదార్థాలను తీసుకెళ్తున్నట్లు ఎల్ పైస్ వార్తా పత్రిక నివేదించింది. ఈ నౌక చెన్నై నుంచి బయలుదేరినట్లు తెలుస్తోంది. స్పెయిన్ ఆగ్నేయ ఓడరేవు కార్టజేనా వద్దకు ఆయుధాలతో కూడిన ఇజ్రాయిల్కి వెళ్లే ఓడకు స్పెయిన్ అనుమతి నిరాకరించిందని ఆ దేశ రవాణా శాఖ మంత్రి ఆస్కార్ పుయెంటే గురువారం తెలిపారు.
‘‘ మేము ఇలా చేయడం ఇదే తొలిసారి. ఎందుకంటే ఇజ్రాయిల్కి ఆయుధాలను రవాణా చేస్తున్న ఓడను మేము గుర్తించడం ఇదే మొదటిసారి. ఇది స్పానిష్ ఓడరేవులో డాక్ చేయాలని అనుకున్నారు. ఇజ్రాయిల్కి ఆయుధాలను తీసుకెళ్లే ఏ ఓడకైనా ఇదే స్థిరమైన విధానం. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక స్పష్టమైన కారణంతో క్రమపద్ధతిలో నిరాకరిస్తుందని, మధ్యప్రాశ్యానికి మరింత ఆయుధాలు అవసరం లేదని, శాంతి కావాలి’’ అని స్పెయిన్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయల్ ఆల్బరేస్ చెప్పారు.
Also Read
- US Airstrike: తారాస్థాయికి చేరిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి బీ-1 బాంబర్!
- Ebola: ఎబోలా విజృంభణ.. వెయ్యికి పైగా జనాలు మృతి.. WHO వార్నింగ్..
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
- Pakistan: మధ్యవర్తిత్వం చేశాం కదా $10 బిలియన్లు ఇవ్వండి.. అమెరికాను కోరిన పాకిస్తాన్..
Read Also: Hyd -Vijayawada Highway : హైదరాబాద్-విజయవాడ హైవేపై ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్రదేశాలు ఇవే..!
స్పెయిన్లో అధికారంలో ఉన్న వామపక్ష కూటమి ఒత్తిడి నేపథ్యంలో ఈచర్య వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ ఓడ ఇజ్రాయిల్ కాకుండా చెక్ రిపబ్లిక్ వెళ్లిందని ఆ దేశ రవాణా మంత్రి ఆస్కార్ ఫ్యూయెంటే మరో ప్రకటనలో పేర్కొన్నాడు. అమెరికా నేతృత్వంలోని నాటో కూటమిలో సభ్య దేశంగా ఉన్న స్పెయిన్ నుంచి ఇజ్రాయిల్కి వ్యతిరేకంగా ఈ చర్య వచ్చింది. గాజాపై ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధాన్ని స్పెయిన్ నిరంతరం వివర్శిస్తూనే ఉంది. పాలస్తీనా దేశాన్ని గుర్తించాలని యూరోపియన్ దేశాలను కోరుతోంది.
అక్టోబర్ 7 న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్పై దాడి చేసి 1200 మంది చంపేయడమే కాకుండా, 240 మందిని బందీలుగా పట్టుకున్నారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజాపై విరుచుకుపడుతోంది. తాజాగా ఇజ్రాయిల్ ఈజిప్టు బోర్డర్లోని రఫాను కూడా ఆక్రమించింది. హమాస్ని పూర్తిగా తుదముట్టేంచే లక్ష్యంగా ఇజ్రాయిల్ దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 35,774 మంది పాలస్తీనియన్లు మరణించారు.
- Tags
- india
- Israel
- Israel-Hamas War
- NATO
- Spain
తాజావార్తలు
-
Dinesh Karthik vs Dewald Brevis: ఆ షాట్ నేర్పిస్తా.. కానీ అస్సలు ఆడొద్దు!
-
Yuvraj Singh: “శాంతియుత పరిష్కారమే మార్గం”.. సీజేపీ ఆందోళనలపై స్పందించిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్!
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Jeetendra: 4 లక్షల పెట్టుబడితో 450 కోట్ల జాక్పాట్ కొట్టిన నటుడు… అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Vallabhaneni Vamsi: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ.. పట్టిసీమ నీటిపై జోక్యం చేసుకోండి..
ట్రెండింగ్
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!