కజకిస్థాన్లో జరగనున్న షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోడీ హాజరు కావడం లేదు. ఆయన స్థానంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ భారత్ తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దీనికి హాజరవుతారు. ఇక్కడకు వచ్చే ప్రపంచ నాయకులను విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కలవనున్నారు.
India Pakistan Border : భారత్, పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలోని పంజాబ్లోని ఫజిల్కా నగరంలో నిన్న రాత్రి కాల్పుల ఘటన వెలుగు చూసింది. పాకిస్థాన్ వైపు నుంచి నిన్న రాత్రి భారత్-పాకిస్థాన్ సరిహద్దులు దాటి పాకిస్థాన్ పౌరుడు చొరబాటుకు ప్రయత్నించాడు.
IND vs SA Test : చెన్నై వేదికగా జూన్ 28 న మొదలైన దక్షిణాఫ్రికా, ఇండియా ఏకైక టెస్టు మ్యాచ్ లో భారత మహిళల జట్టు 10 వికెట్ల తేడాతో భారీ విజయాన్నీ అందుకుంది. సోమవారం ఉదయం రెండో ఇన్నింగ్స్ ను 232/2 (ఫాలోఆన్) తో బ్యాటింగ్ మొదలు పెట్టిన సౌతాఫ్రికా 373 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్ కు కేవలం 37 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ టార్గెట్ ని భారత మహిళలు…
Indian Cricket Team Photo on Dawn’s front page: టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్ను టీమిండియా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కింగ్స్టన్ ఓవల్ మైదానంలో దక్షిణాఫ్రికాతో నువ్వానేనా అన్నట్లు సాగిన ఫైనల్ సమరంలో భారత్ 7 పరుగుల తేడాతో గెలిచి.. పొట్టి ప్రపంచకప్ను రెండోసారి కైవసం చేసుకుంది. టైటిల్ సొంతం చేసుకున్న భారత క్రికెట్ జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత్ మీడియానే కాకుండా అంతర్జాతీయ మీడియా కూడా భారత క్రికెట్ జట్టుపై ప్రశంసల…
17 ఏళ్ల తర్వాత టీ-20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుపై బీసీసీఐ కాసుల వర్షం కురిపించింది. ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించిన భారత జట్టుకు రూ.125 కోట్ల ప్రైజ్ మనీ లభిస్తుంది. బోర్డు కార్యదర్శి జై షా జూన్ 30న ఈ విషయాన్ని ప్రకటించారు.