SCO Summit 2024: ఉగ్రవాదంపై పరోక్షంగా చైనా, పాక్ను టార్గెట్ చేసిన జైశంకర్ .. జిన్పింగ్ ఎదుటే!
- ఉగ్రవాదంపై పాకిస్థాన్ను దుయ్యబట్టిన జైశంకర్
- పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్పై మండిపాటు
- ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే దేశాలను ఏకాకిని చేయాలన్న జైశంకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SCO Summit 2024: కజకిస్థాన్ రాజధాని అస్తానాలో ఉగ్రవాదంపై ప్రధాని నరేంద్ర మోడీ చాణక్య అని పిలిచే విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్పై మండిపడ్డారు. షాంఘై సహకార సంస్థ(SCO) సమావేశంలో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ సహా పలు దేశాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జైశంకర్, ఉగ్రవాదులను ప్రోత్సహించే వారికి, సురక్షితమైన స్వర్గధామాన్ని అందించే, ఉగ్రవాదాన్ని విస్మరించే దేశాలను ఒంటరిగా, బహిర్గతం చేయాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు.
ఉగ్రవాదంపై పాకిస్థాన్ను దుయ్యబట్టిన జైశంకర్
చైనా, పాక్లపై పరోక్షంగా ధ్వజమెత్తిన జైశంకర్.. ఉగ్రవాదాన్ని అదుపు చేయకుండా వదిలేస్తే ప్రాంతీయ, ప్రపంచ శాంతికి పెను ముప్పుగా పరిణమించవచ్చని అన్నారు. కజకిస్థాన్ రాజధాని అస్తానాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) దేశాధినేతల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయాలను వ్యక్తం చేసిన జైశంకర్, ఉగ్రవాదంపై పోరు అనేది ఎస్సీఓ ప్రాథమిక లక్ష్యాలలో ఒకటని అన్నారు. సదస్సులో జైశంకర్ మాట్లాడుతూ.. “మనలో చాలా మందికి మన సొంత అనుభవాలు ఉన్నాయి, అవి తరచుగా మన సరిహద్దులు దాటి బయటపడతాయి. ఏదైనా రూపంలో ఉగ్రవాదాన్ని అదుపు చేయకపోతే ప్రాంతీయ, ప్రపంచ శాంతికి పెద్ద ముప్పు అని స్పష్టంగా ఉండాలి” అని అన్నారు.
Also Read
- New York Floods: న్యూయార్క్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన మహిళ.. వీడియో వైరల్
- China Floods: భారత్లో ఎండలు.. చైనాలో వరదలు.. ముంచెత్తిన భారీ వర్షాలు
- Asim Munir: అసిమ్ మునీర్ టెహ్రాన్ పర్యటన ఆకస్మిక రద్దు.. కారణమిదే!
- Unknown Gunmen: పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే దేశాలను ఏకాకిని చేయాలి..
ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే, సురక్షిత స్వర్గధామాలు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలను అంతర్జాతీయ సమాజం ఏకాకిని చేసి బహిర్గతం చేయాలని పాకిస్థాన్, దాని మిత్రదేశమైన చైనాను ఉద్దేశించి జైశంకర్ పరోక్షంగా వ్యాఖ్యానించారు. పాకిస్థాన్కు చెందిన వాంటెడ్ టెర్రరిస్టులను బ్లాక్లిస్ట్లో చేర్చాలని ఐక్యరాజ్యసమితికి సమర్పించిన తీర్మానాలను చైనా తరచుగా అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. “సీమాంతర ఉగ్రవాదానికి నిర్ణయాత్మక ప్రతిస్పందన అవసరం, టెర్రరిజం ఫైనాన్సింగ్, రిక్రూట్మెంట్ను పటిష్టంగా ఎదుర్కోవాలి. మన యువతలో రాడికలైజేషన్ను వ్యాప్తి చేసే ప్రయత్నాలను నిరోధించడానికి మనం చురుకైన చర్యలు తీసుకోవాలి” అని ఆయన అన్నారు.
జీ-20ని గుర్తు చేసిన జైశంకర్
గత ఏడాది భారత అధ్యక్షుడిగా జీ20లో ఈ అంశంపై విడుదల చేసిన సంయుక్త ప్రకటన ఇండియా భాగస్వామ్య నిబద్ధతను నొక్కి చెబుతుందని జైశంకర్ అన్నారు. ‘వసుదైక కుటుంబం’ అంటే ‘ప్రపంచమంతా ఒకే కుటుంబం’ అనే పురాతన సూత్రాన్ని అనుసరించి ప్రజలు ఏకం కావడానికి, సహకరించడానికి, ఎదగడానికి, అభివృద్ధి చెందడానికి ఎస్సీవో ఒక ప్రత్యేకమైన వేదికను అందిస్తుందని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!