PM Modi: ఈ ఏడాది ఎస్సీఓకు పాకిస్థాన్ ఆతిథ్యం.. దాయాది దేశాన్ని ప్రధాని మోడీ సందర్శిస్తారా?
- ఈ ఏడాది అక్టోబర్లో ఎస్సీఓకు పాకిస్థాన్ ఆతిథ్యం
- అన్ని సభ్య దేశాలను ఆహ్వానించిన పాకిస్థాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఈ ఏడాది అక్టోబర్లో షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సమావేశానికి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమావేశానికి గ్రూప్ దేశాల ప్రభుత్వాధినేతలందరినీ ఆహ్వానించారు. ఈ గ్రూప్లో భారత్ కూడా భాగం. అదే సమయంలో, పాకిస్తాన్, భారత్ మధ్య సంబంధాల గురించి ప్రపంచానికి తెలుసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎస్సీఓలో పాల్గొనేందుకు పాకిస్థాన్కు వెళతారా అనేది అతిపెద్ద ప్రశ్న. పాకిస్థాన్ విషయంలో మోడీ ప్రభుత్వ విధానం చాలా స్పష్టంగా ఉంది. పాక్ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నంత కాలం ఇరు దేశాల మధ్య ఎలాంటి చర్చలు ఉండవని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పదే పదే పునరుద్ఘాటించారు.
అయితే, భారత్తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని పాకిస్థాన్ ఎప్పుడూ వాదిస్తోంది. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆయన అన్న నవాజ్ షరీఫ్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే, నవాజ్ షరీఫ్కు కృతజ్ఞతలు తెలుపుతూ, పాకిస్థాన్కు ప్రధాని మోడీ తగిన సమాధానం కూడా ఇచ్చారు. “నవాజ్ షరీఫ్, మీ సందేశాన్ని నేను అభినందిస్తున్నాను. భారత ప్రజలు ఎల్లప్పుడూ శాంతి, భద్రత, ప్రగతిశీల ఆలోచనలకు అనుకూలంగా ఉంటారు. మా ప్రజల శ్రేయస్సు, భద్రత ఎల్లప్పుడూ మా ప్రాధాన్యత” అని ఆయన అన్నారు. కజకిస్థాన్ రాజధాని అస్తానాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన విదేశాంగ మంత్రి జై శంకర్.. ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాన్ని చదివారు. ఉగ్రవాదంపై పోరు అనేది ఎస్సీఓ ప్రాథమిక లక్ష్యాలలో ఒకటని ఇందులో ఆయన గుర్తు చేశారు.
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
ఎస్సీవోలో ఎనిమిది దేశాలు
భారతదేశం, చైనా, రష్యా, పాకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఎస్సీఓ సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇది ఒక ప్రభావవంతమైన ఆర్థిక, భద్రతా సంస్థ. ఇది అతిపెద్ద అంతర్-ప్రాంతీయ అంతర్జాతీయ సంస్థలలో ఒకటిగా ఉద్భవించింది.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!