డాలర్లు సంపాదించేందుకు అగ్రరాజ్యం అమెరికా వెళ్లిన వారికి గట్టి షాక్ తగులుతోంది. డొలాల్డ్ ట్రంప్ అధ్యక్ష భాద్యతలు చేపట్టిన వెంటనే తన మార్క్ పాలన చూపిస్తూ దూసుకెళ్తున్నాడు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతోంది అమెరికా ప్రభుత్వం. యూఎస్ లో అక్రమంగా ఉంటున్న భారతీయులను సైతం వెనక్కి పంపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొంత మంది భారతీయులను వెనక్కి పంపింది. 205 మంది భారతీయులను వెనక్కి పంపించింది. టెక్సాస్ నుంచి బయల్దేరిన ఆ విమానం బుధవారం మధ్యాహ్నం అమృత్…
ఆధార్ కార్డు.. దేశ పౌరులకు ముఖ్యమైన దృవపత్రంగా మారిపోయింది. ఏ పని జరగాలన్నా ఆధార్ ను ఇవ్వాల్సిందే. ప్రభుత్వ స్కీముల ద్వారా లబ్ధి పొందాలన్నా, బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి, సిమ్ కార్డ్స్ తీసుకోవడానికి ఆధార్ నెంబర్ ను ఉపయోగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆధార్ కు ఇంపార్టెన్స్ పెరిగింది. ఆధార్ లేకపోతే ప్రభుత్వ ప్రయోజనాలను పొందలేని పరిస్థితి. అయితే భారత్ లో ఇప్పటి వరకు ఆధార్ కార్డు జారీ చేయని రాష్ట్రం ఒకటి ఉందని తెలుసా? ఆ…
ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. ఇంగ్లాండ్తో జరిగే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ నుంచి ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను తొలగించారు. మంగళవారం భారత వన్డే జట్టు ప్రకటించినప్పుడు బుమ్రా పేరు జట్టులో లేదు.
భారతదేశంలోని ఎలక్ట్రిక్ బైక్ ప్రియులకు శుభవార్త..! ఓలా ఎలక్ట్రిక్ రోడ్స్టర్ X ఎలక్ట్రిక్ బైక్ను భారత మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ బైక్ టీజర్ను ఓలా తాజాగా విడుదల చేసింది. అధికారిక లాంచ్ రేపు (ఫిబ్రవరి 5, 2025)న జరగనుంది. అయితే.. ఈ ఎలక్ట్రిక్ బైక్ కు సంబంధించిన ప్రత్యేక ఫీచర్లపై ఓ నజర్ వేసేద్దాం.
Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత డొనాల్డ్ ట్రంప్ తాను అనుకున్న పనుల్ని చేస్తున్నారు. ముఖ్యంగా అక్రమంగా అమెరికాలో నివసిస్తున్న వారిని దేశం నుంచి బహిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. దీని వల్ల అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులు ఇంటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్ సహా వివిధ దేశాలకు చెందిన అక్రమ వలసదారుల సామూహిక బహిష్కరణ ప్రారంభమైంది. అమెరికాలో సుమారుగా 11 మిలియన్ల మంది డాక్యుమెంట్లు లేని వలసదారులు ఉన్నట్లు అంచనా.
రైల్వే బడ్జెట్.. ఏపీకి భారీగా పెరిగిన నిధుల కేటాయింపు.. ఈ బడ్జెట్ లో ఏపీకి రూ. 9,417 కోట్ల విలువైన ప్రాజెక్టులు కేటాయింపులు జరిగాయని తెలిపారు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్.. ఈ బడ్జెట్ లో యూపీఏ హయాంలో కంటే ఏపీకి 11 రెట్లు అధికంగా నిధులు కేటాయించామన్నారు.. ఏపీలో మొత్తం అమలవుతోన్న రైల్వే ప్రాజెక్టులు రూ. 84,559 కోట్ల వరకు కేటాయించామన్నారు.. కొత్త ప్రాజెక్టులు ఓ పద్ధతిలో, శాస్త్రీయమైన రీతిలో కేటాయింపులు జరుగుతున్నాయి. కొత్త…
ఎన్టీఆర్కు భారతరత్నపై బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు విశ్వ విఖ్యాత నటసార్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు అలియాస్ ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది.. ఇక, ఆయన కుమారుడైన టీడీపీ ఎమ్మెల్యే, నటసింహ నందమూరి బాలకృష్ణను ఈ మధ్యే ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ వరించింది.. అయితే, ఈ అవార్డులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బాలకృష్ణ.. నాకు పద్మభూషణ్ కాదు.. నాన్న (ఎన్టీఆర్)కు భారతరత్న రావాలని వ్యాఖ్యానించారు.. నాకు పద్మభూషణ్ అవార్డు కంటే..…
MG ZS EV Price : ఎంజీ మోటార్ తన ప్రసిద్ధ ఎలక్ట్రిక్ SUV MG ZS EV ధరను పెంచి వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చింది. ఈ ఎలక్ట్రిక్ కారు కొనాలని ప్లాన్ చేస్తున్న వారు ఇప్పుడు ఈ కారు కొనడానికి అదనంగా రూ. 89,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది.