భారత్తో గువాహటి వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా పూర్తి పట్టు సాధించింది. ప్రస్తుతం నాలుగో రోజు కొనసాగుతోండగా.. లంచ్ బ్రేక్ సమయానికి రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 220 రన్స్ చేసింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 508 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది. క్రీజులో ట్రిస్టన్ స్టబ్స్ (60), వియాన్ ముల్డర్ (29) ఉన్నారు. ఈ జోడి 5వ వికెట్కు 71 బంతుల్లో 42 పరుగులు జత చేసింది. Also Read: Telangana Panchayat…
స్వదేశంలో బ్యాటింగ్, బౌలింగ్లో బెబ్బులిలా చెలరేగే భారత్.. దక్షిణాఫ్రికాకు సిరీస్ను కోల్పోవడం ఇక లాంఛనమే. మొదటి టెస్టులో దారుణ ఓటమిని చవిచూసిన టీమిండియా.. రెండో టెస్టులోనూ ఓటమి దిశగా సాగుతోంది. మొదటి ఇన్నింగ్స్లో ప్రొటీస్ టీమ్ 489 రన్స్ చేయగా.. భారత్ 201 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 26 రన్స్ చేయగా.. 314 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలుంది. టీమిండియాకు 400 రన్స్ లక్ష్యంను విధించే అవకాశం ఉంది.…
భారత్-దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్లో రెండవ, చివరి టెస్ట్ మ్యాచ్ గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. రెండు రోజుల ఆట పూర్తయింది. నేడు మ్యాచ్లో మూడో రోజు ఆట కొనసాగుతోంది. మూడో రోజు కూడా భారత్ పేలవమైన ప్రదర్శనతో నిరాశపర్చింది. మూడవ రోజు కూడా, దక్షిణాఫ్రికా జట్టు బౌలింగ్ తో అద్భుతం చేసింది. మార్కో జాన్సెన్ మూడవ రోజు మొత్తం 6 వికెట్లు పడగొట్టగా, హార్మర్ కూడా మూడు వికెట్లు పడగొట్టాడు. కేశవ్ మహారాజ్ ఒక వికెట్…
గువాహటి వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది. తొలి ఆట ముగిసే సమయానికి ప్రొటీస్ టీమ్ 6 వికెట్ల నష్టానికి 247 రన్స్ చేసింది. ముత్తుస్వామి (25), కైల్ వెరినె (1) క్రీజులో ఉన్నారు. దక్షిణాఫ్రికా టాప్ ఆర్డర్ బ్యాటర్లు రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్స్ పడగొట్టగా.. జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. తొలి రోజు…
ఆసియా పిచ్లలో.. ముఖ్యంగా టెస్ట్ మ్యాచ్లలో టాస్ గెలవడం ఏ జట్టుకైనా అత్యంత చాలా కీలకం. కానీ భారత్ మాత్రం వరుసగా టాస్ ఓడిపోతోంది. 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి టీమిండియా టాస్ గెలిచిన సందర్భాలు చాలా తక్కువ. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో కూడా టాస్ కలిసిరాలేదు. కోల్కతా టెస్టులో సారథి శుభ్మాన్ గిల్ టాస్ ఓడగా.. గౌహతి టెస్ట్లో కొత్త కెప్టెన్ రిషబ్ పంత్ అయినా టాస్ నెగ్గుతాడు అనుకుంటే అది…
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో భారత్ ఓడిన విషయం తెలిసిందే. 124 పరుగులను ఛేదించలేక 93 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 15 ఏళ్ల తర్వాత భారత్లో దక్షిణాఫ్రికా టెస్ట్ మ్యాచ్ గెలిచింది. అంతకుముందు కూడా టీమిండియాకు పరాజయాలు ఎదురయ్యాయి. వరుస ఓటములతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నిత్యం ప్రయోగాలు చేసే గౌతీని తప్పించాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ స్పదించింది. గంభీర్పై పూర్తి విశ్వాసం…
Ricky Ponting: ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండో టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ శుభ్మన్ గిల్ అందుబాటులో లేకపోతే.. ఆ బాధ్యతలు స్వీకరించడానికి రిషబ్ పంత్ పూర్తిగా సిద్ధంగా ఉన్నాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన గిల్ స్థానాన్ని భర్తీ చేసే సత్తా అతనికి ఉందని పేర్కొన్నాడు. గిల్ మెడ గాయం కారణంగా నవంబర్ 22న ప్రారంభమయ్యే టెస్టు మ్యాచ్పై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో పాంటింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. Smriti…
దక్షిణాఫ్రికాతో కోల్కతాలో జరిగిన మొదటి టెస్ట్లో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ గాయపడిన విషయం తెలిసిందే. మెడ నొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడ్డ గిల్.. తొలి ఇన్నింగ్స్లో కేవలం మూడు బంతులు మాత్రమే ఎదుర్కొని రిటైర్డ్ అవుట్గా వెనుదిరిగాడు. రెండో ఇన్నింగ్స్లో అయితే బ్యాటింగ్ కూడా చేయలేదు. నవంబర్ 22 నుంచి గువాహటిలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్ట్ ఆరంభం కానుంది. ఈ టెస్ట్లో గిల్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో గిల్ ఆరోగ్యంపై…
దక్షిణాఫ్రికాతో కోల్కతాలో జరిగిన మొదటి టెస్టులో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. స్వల్ప ఛేదనలో భారత్ ఆలౌట్ అయింది. దాంతో పిచ్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. నేపథ్యంలో భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ స్పందిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. భారత్లో స్పిన్ పిచ్లను ఇప్పుడే కొత్తగా తయారు చేయడం లేదని, కొన్ని దశాబ్దాలుగా ఇదే జరుగుతోందన్నాడు. ఎప్పటి నుంచో స్పిన్ పిచ్లు ఉన్నాయని, అప్పుడు ఎవరూ ఎందుకు ప్రశ్నించలేదని భువీ ప్రశ్నించాడు. ఆటలో గెలుపోటములు…
IND vs SA: కోల్కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ తొలి రోజే దక్షిణాఫ్రికా తక్కువ స్కోరుకే కుప్పకూలింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా, భారత బౌలర్ల ధాటికి కేవలం 159 పరుగులకే కుప్పకూలింది. జస్ప్రీత్ బుమ్రా ధాటికి ప్రోటిస్ బ్యాటర్లు క్యూ కట్టారు. బుమ్రాకి తోడుగా సిరాజ్, ల్దీప్ కూడా కీలక వికెట్లు తీసి మరింత ఒత్తిడి తెచ్చారు. ఓపెనర్లు ఐడెన్ మార్క్రామ్, రికెల్టన్…