Donald Trump: భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నాడు. ‘‘మీరు (భారత్, పాక్) ఘర్షణ పడితే ప్రతీ దేశంపై 200 శాతం సుంకాలు విధిస్తానని నేను చెప్పాను. డబ్బు కోల్పోయే పరిస్థితి వస్తే మనం పోరాడాలని అనుకోము’’ అని అమెరికా అధ్యక్షుడు బోర్డ్ ఆఫ్ పీస్ ప్రారంభ సమావేశంలో అన్నారు. గతేడాది ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ , పాక్ మధ్య యుద్ధాన్ని ఆపింది తానే అని…
India on Russian oil: భారత్ అమెరికా ట్రేడ్ డీల్ తర్వాత, భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు తగ్గించిందనే వార్తల నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చమురు కొనుగోళ్లు రాజకీయ ఒత్తిడితో కాకుండా, ఖర్చులు, లభ్యత, ప్రమాదాలను బట్టి జరుగుతాయని ఆయన క్లారిటీ ఇచ్చారు. మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్లో మాట్లాడిన జైశంకర్.. అమెరికాతో ట్రేడ్ డీల్ జరిగినా.. భారత వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి మారదని స్పష్టం చేశారు.
US:రష్యన్ చమురును కొనుగోలు చేయమని భారత్ తమకు హామీ ఇచ్చిందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అన్నారు. మాస్కో ఇంధన రంగంపై అమెరికా విధించిన తాజా ఆంక్షల మధ్య ఈ వ్యాఖ్యలు వచ్చాయి. శనివారం మ్యూనిచ్ భద్రతా సమావేశంలో రూబియో చెప్పినట్లు మీడియా నివేదించింది.
Modi-Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్రమోడీతో ఈరోజు(సోమవారం) ఫోన్లో మాట్లాడినట్లు భారత్లోని అమెరికా రాయబారి సెర్జియో గోర్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ట్విట్టర్ పోస్టులో ‘‘స్టే ట్యూన్డ్’’ అంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. అయితే, ఇరువురు నేతలు ఏ విషయంపై మాట్లాడారనే వివరాలను ఆయన వెల్లడించలేదు. అయితే, భారత్-అమెరికా మధ్య కీలక వాణజ్య ఒప్పందం త్వరలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. Read Also:…
Donald Trump: ప్రధాని నరేంద్రమోడీ ‘‘అద్భుత నాయకుడు’’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్తో బలమైన వాణిజ్య ఒప్పందం త్వరలో కుదురుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
Gaza Crisis: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం తర్వాత దెబ్బతిన్న గాజాలో పాలన, పునర్నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు ఉద్దేశించిన గాజా ‘‘బోర్డ్ ఆఫ్ పీస్’’లోకి భారతదేశాన్ని ట్రంప్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ట్రంప్ స్వయంగా ప్రధానమైన బోర్డుకు అధ్యక్షత వహిస్తుండగా, పాలస్తీనా టెక్నోక్రాట్ కమిటీ గాజా పాలన బాధ్యతల్ని చూస్తుంది, ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సలహాదారు పాత్రను పోషించే మరో విభాగంగా ఉంది. 20 పాయింట్ల గాజా శాంతి ప్రణాళికలో భాగంగా జనవరి 15న ఈ బోర్డును ఏర్పాటు చేశారు.
US: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రపంచ దేశాలపై టారిఫ్స్తో విరుచుకుపడుతున్నారు. ఇండియాపై ఏకంగా 50 శాతం సుంకాలు విధించారు. మరోవైపు, రేర్ ఎర్త్ ఖనిజాల కోసం పాకిస్తాన్తో డీల్ కుదుర్చుకున్నారు. ఇదిలా ఉంటే, ట్రంప్ అవలంభిస్తున్న విధానాలపై యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు, ట్రంప్ పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీ సభ్యుడు రిచ్ మెక్కార్మిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ పట్ల ట్రంప్ తీరును తప్పుపట్టారు. భారతదేశం అమెరికాలో పెట్టుబడుతుపెడుతోందని, పాకిస్తాన్ నుంచి…
Trump Tariffs: ఇరాన్ ప్రజాతిరుగుబాటు నేపథ్యంలో, ఆ దేశంతో వాణిజ్యం చేసే దేశాలపై 25 శాతం సుంకాలను విధిస్తామని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే, ఈ నిర్ణయం భారత్పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇరాన్ టాప్-5 వాణిజ్య భాగస్వాముల్లో భారత్ ఉంది.
India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరకపోవడానికి ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో నేరుగా మాట్లాడకపోవడమే అని ఆ దేశ వాణిజ్య కార్యదర్శి హోవర్డ్ లుట్నిక్ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలపై భారత్ స్పందిస్తూ.. ‘‘ఇవి సరైనవి కావు’’ అని చెప్పింది.
PM speaks to Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భారత ప్రధాని నరేంద్రమోడీ ఫోన్ చేశారు. యూఎస్ సుంకాల నేపథ్యంలో ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఇద్దరు నేతల మధ్య సంభాషణ ఆసక్తికరంగా మారింది. మోడీ, ట్రంప్లు రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంపొందించడం, ఎనర్జీ, డిఫెన్స్ రంగాలపై మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.