India-US: ‘‘మోడీ ట్రంప్కు ఫోన్ చేయలేదు’’ వ్యాఖ్యలపై స్పందించిన భారత్..
- ‘‘ట్రంప్కు మోడీ ఫోన్ చేయలేదు’’ వ్యాఖ్యలపై స్పందించిన భారత్..
- లుట్నిక్ వ్యాఖ్యలు సరైనవి కావన్న విదేశాంగ శాఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరకపోవడానికి ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో నేరుగా మాట్లాడకపోవడమే అని ఆ దేశ వాణిజ్య కార్యదర్శి హోవర్డ్ లుట్నిక్ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలపై భారత్ స్పందిస్తూ.. ‘‘ఇవి సరైనవి కావు’’ అని చెప్పింది. అమెరికా విధించిన టారిఫ్స్, వాణిజ్య కారణాల కన్నా ట్రంప్కు ఉన్న వ్యక్తిగత అసంతృప్తి కారణమని లుట్నిక్ వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. మోడీ వ్యక్తిగతంగా ట్రంప్తో మాట్లాడి ట్రేడ్ డీల్ ముగించలేదన్న కారణంతోనే ట్రంప్ ఆగ్రహించారని, దీని ఫలితంగానే భారత్పై 50 శాతం సుంకాలు విధించబడ్డాయి, ఇంకా భారీ సుంకాలు ఉంటాయని అమెరికా భారత్ను హెచ్చరిస్తోంది.
Read Also: డాక్టర్ అవసరం లేకుండా ఇమ్యూనిటీ పెంచే ఆహారాలు ఇవే!
Also Read
- MK Stalin: రాహుల్గాంధీకి వెరైటీగా బర్త్డే విషెస్ చెప్పిన స్టాలిన్
- Rahul Gandhi: ఖర్గే ఆధ్వర్యంలో బర్త్డే కేక్ కట్ చేసిన రాహుల్ గాంధీ.. అభిమానులతో ఫొటోలు
- WhatsApp Subscription India: ఉచిత వాట్సాప్ యుగానికి ముగింపు?.. భారత్లో చెల్లింపు సేవల ఆరంభం
- Supreme Court: ఫుట్పాత్పై నడవడం ప్రాథమిక హక్కు.. ప్రత్యేక చట్టం తేవాలని కేంద్రానికి సూచన
అయితే, ఈ వ్యాఖ్యలు వచ్చిన కొన్ని గంటల్లోనే భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ ఈ వ్యాఖ్యల్ని మేం గమనించాము. భారత్, అమెరికా మధ్య గతేడాది ఫిబ్రవరిలో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద చర్చలు జరుగుతున్నాయి. అప్పటి నుంచి రెండు దేశాలు అనేక చర్చల్లో పాల్గొన్నాయి. సమతుల్యత, పరస్పర లాభకరమైన ఒప్పందానికి చేరువైన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే, ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చర్చల స్వభావాన్ని సరిగ్గా ప్రతిబింబిచవు’’ అని అన్నారు. రెండు దేశాల మధ్య లాభదాయకమైన ట్రేడ్ డీల్కు భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. చర్చల్ని తుది దశకు తీసుకెళ్లాలనే ఆసక్తి భారత్కు ఉందని అన్నారు. 2025లో ప్రధాని మోడీ, ట్రంప్లు 8 సార్లు ఫోన్లో మాట్లాడారని, ఈ సంభాషణల్లో ఇరు దేశాలు విస్తృత భాగస్వామ్యానికి సంబంధించి అనేక అంశాలపై చర్చించినట్లు భారత్ చెప్పింది.
దీనికి ముందు, ట్రంప్ సహాయకుడు, వాణిజ్య కార్యదర్శి హోవర్డ్ లుట్నిక్ మాట్లాడుతూ.. భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం నిలిచిపోవడానికి కారణం మోడీ ట్రంప్తో వ్యక్తిగతంగా ఫోన్ చేయకపోవడమే అని అన్నారు. గతేడాది చర్చలు విఫలమైన తర్వాత భారత్పై అమెరికా 50 శాతం సుంకాలను విధించింది. ఇందులో 25 శాతం రష్యా ఆయిల్ కొంటున్నందుకు విధించింది. మరో 25 శాతం ‘‘పరస్పర సుంకాలు’’. ట్రేడ్ డీల్ అంతా సిద్ధంగా ఉందని, మోడీ ట్రంప్కు ఫోన్ చేయాల్సి ఉంది, కానీ వారు అలా చేయడంలో అసౌకర్యంగా భావించారని, అందుకే మోడీ ఫోన్ చేయలేని లుట్నిక్ ఆల్ ఇన్ పాడ్కాస్ట్లో వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Trump: ఇరాన్కు ఒక్క పైసా కూడా ఇవ్వం.. స్విట్జర్లాండ్ చర్చలు వాయిదాపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం
-
PhonePe: ఫోన్పే వాడితే రూ.100 కట్.. ఎలాగో తెలుసా?
-
Team India: వాళ్లు ఫ్యామిలీలతో గడపొద్దా..? మాజీ కెప్టెన్ ఆగ్రహం..
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
MK Stalin: రాహుల్గాంధీకి వెరైటీగా బర్త్డే విషెస్ చెప్పిన స్టాలిన్
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?