Trump Tariffs: భారత్పై టారిఫ్ 75% అవుతుందా.. ఇరాన్పై ట్రంప్ నిర్ణయంతో ఆందోళన..
- ఇరాన్ వాణిజ్యంపై 25 శాతం సుంకాలు..
- ట్రంప్ నిర్ణయంతో భారత్పై ప్రభావం..
Trump Tariffs: ఇరాన్ ప్రజాతిరుగుబాటు నేపథ్యంలో, ఆ దేశంతో వాణిజ్యం చేసే దేశాలపై 25 శాతం సుంకాలను విధిస్తామని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే, ఈ నిర్ణయం భారత్పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇరాన్ టాప్-5 వాణిజ్య భాగస్వాముల్లో భారత్ ఉంది. ఒక వేళ ఇరాన్తో భారత్ వాణిజ్యం చేస్తే, ఇప్పుడున్న 50 శాతం సుంకాలకు తోడు మరో 25 శాతం పెరిగి, 75 శాతానికి పెరగవచ్చు. భారత్కు ఇరాన్ దీర్ఘకాలిక వాణిజ్య, వ్యూహాత్మక భాగస్వామిగా ఉంది. ఇరాన్ నుంచి దిగుమతులతో పోలిస్తే, భారత్ ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయి. ఇదే కాకుండా చైనా పాకిస్తాన్లో నిర్మిస్తున్న గ్వాదర్ ఓడరేవుకు కౌంటర్గా ఇరాన్లో ఇండియా చాబహార్ పోర్టును నిర్మిస్తుంది. దీని ద్వారా, పాకిస్తాన్ అవసరం లేకుండా మధ్య ఆసియాలోకి భారత్ సులువుగా చేరవచ్చు.
Read Also: Giriraj Singh: ‘‘పందుల పెంపకం’’ అంటూ కేంద్రమంత్రి వ్యాఖ్యలు.. ఒక వర్గాన్ని అవమానించారని విమర్శలు..
Also Read
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..
- AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి...
- LPG Crisis: గ్యాస్ టెన్షన్కు గుడ్బై.. 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి!
చైనా ఇరాన్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయినప్పటికీ, ఇటీవలి సంవత్సరాలలో భారతదేశం టాప్-5లో చోటు దర్కించుకుంది. టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం ప్రకారం, 2024–25లో ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు $1.68 బిలియన్లు, భారత ఎగుమతులు $1.24 బిలియన్లు, దిగుమతులు $440 మిలియన్లు. ఇరాన్కు భారత్ సేంద్రీయ ఎరువులు, బాస్మతి బియ్యం, టీ, చక్కెర, ఔషధాలు, పండ్లు, పప్పు ధాన్యాలు, మాంసం ఉత్పత్తుల్ని ఎగుమతి చేస్తోంది. దిగుమతుల్లో మిథనాల్, పెట్రోలియం బిటుమెన్, లిక్విఫైడ్ ప్రొపేన్, ఆపిల్స్, ఖర్జూరం, రసాయనాలు ఉన్నాయి. ఆంక్షలు, భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవల రెండు దేశాల వాణిజ్యం మధ్య హెచ్చుతగ్గులు కనిపించాయి.
అమెరికన్ సుంకాల నేపథ్యంలో, భారత కంపెనీలు యూఎస్ మార్కెట్ను కాపాడుకోవడానికి ఇరాన్తో వాణిజ్యనాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇదే కాకుండా, భారతదేశ వ్యూహాత్మక అవసరాలనున కూడా ట్రంప్ చర్యలు ప్రభావితం చేస్తున్నాయి. 2015 ఒప్పందం నుండి భారతదేశం మరియు ఇరాన్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన చాబహార్ పోర్టు ప్రాజెక్ట్, భారతదేశ ప్రాంతీయ కనెక్టివిటీ ప్రణాళికలు మరియు మానవతా సరఫరా మార్గాలకు కేంద్రంగా ఉంది. గతంలో చాబహార్ విషయంలో భారత్కు అమెరికా మినహాయింపులు ఇచ్చినప్పటికీ, ఇటీవల ట్రంప్ ప్రభుత్వం వాటిని ఉపసంహరించుకున్నాడు. ఈ నేపథ్యంలో అమెరికా నిర్ణయం భారత్కు ఇబ్బందికరంగా మారింది.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!