రష్యాతో అమెరికా వాణిజ్యం చేస్తోందంటూ భారత్ చేసిన వాదనలపై విలేకరులు ట్రంప్ను క్వశ్చన్ చేశారు. మాస్కో నుంచి వాషింగ్టన్ యురేనియం, ఎరువులు దిగుమతి చేసుకుంటోందా? అని ప్రశ్నించారు. దీనికి ట్రంప్ బదులిస్తూ.. ఈ విషయం గురించి నాకు తెలియదు.. తెలుసుకుని.. త్వరలోనే మీకు సమాధానమిస్తానని చెప్పారు.
Nikki haley: అమెరికాలో రిపబ్లికన్ పార్టీకి చెందిన భారత సంతతి నేత నిక్కీ హేలీ మరోసారి భారత పక్షాన గళం విప్పారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై విధించబోయే టారిఫ్ బెదిరింపులపై ఆమె స్పందించారు. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ.. భారత్ వంటి బలమైన మిత్ర దేశంతో సంబంధాలు చెడకుండా చూసుకోవాలి. చైనా వంటి శత్రువుకు మినహాయింపులు ఇవ్వొద్దు అని ట్వీట్ చేశారు. Donald Trump: 5 నెలల్లో 5 యుద్ధాలు ఆపాను! భారత్-పాకిస్థాన్ సీజ్ఫైర్పై మరోసారి…
F-35 Fighter Jets: అమెరికాకు చెందిన అత్యాధునిక, 5వ తరం ఫైటర్ జెట్ F-35 విమానాల కోనుగోలుపై అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదని కేంద్రం లోక్సభకు తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్రమోడీ వాషింగ్టన్ పర్యటన తర్వాత భారత్ ఈ విమానాలను కొనుగోలు చేయాలని అమెరికా ప్రతిపాదించింది.
డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ను ‘ఎక్స్’లో షేర్ చేసిన హర్ష్ గొయెంకా, భారత్కు పాకిస్థాన్ చమురును విక్రయిస్తారని చెప్పడమంటే టీ20 మ్యాచ్లో టెయిలెండర్ ట్రిపుల్ సెంచరీ చేస్తాడని చెప్పడమేనని ఎద్దేవా చేశారు. సాంకేతిక అంశాలను పక్కనబెడితే, వాస్తవ రూపంలో కూడా అది అసాధ్యమే అని ఆయన అన్నారు.
CM Revanth Reddy : హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో జరిగిన అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అమెరికా స్వాతంత్ర్యం ప్రపంచ దృష్టికోణాన్ని పూర్తిగా మార్చిందని ప్రశంసించారు. అమెరికా ప్రజాస్వామ్యానికి మార్గదర్శిగా నిలవడమే కాకుండా, ఆవిష్కరణలకు నాంది పలికిన దేశంగా ఎదిగిందని రేవంత్ పేర్కొన్నారు. ఓటమిని అంగీకరించని ఆత్మవిశ్వాసం అమెరికా స్ఫూర్తికి చిహ్నమని, అదే తరహాలో…
US-India Trade Deal: భారత్, అమెరికా మధ్య త్వరలో ‘‘వాణిజ్య ఒప్పందం’’ ఖరారు కావచ్చని యూఎస్ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ తెలిపారు. ఈ వారం న్యూఢిల్లీలో జరిగే భారత్-అమెరికా చర్చల చివరి రౌండ్ సమావేశాలకు ముందు ఈ ప్రకటన వచ్చింది. ‘‘ఇరు దేశాలు కలిసి పనిచేసే స్థలాన్ని కనుగొన్నాము కాబట్టి, త్వరలోనే అమెరికా, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం వస్తుందని మీరు ఆశించాలి’’ అని యుఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరం (యుఎస్ఐఎస్పిఎఫ్) ఎనిమిదవ ఎడిషన్లో లుట్నిక్…
అమెరికా వీధుల్లో ఏర్పాటు చేసిన 'మేడ్ ఇన్ ఇండియా' మ్యాన్హోల్ కవర్ల చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమెరికాలో స్థానిక తయారీ రంగాన్ని ప్రోత్సహించే అంశంపై చర్చ జరుగుతోంది. భారతదేశంలో తయారు చేసిన మ్యాన్హోల్ కవర్ అక్కడి రోడ్ల వద్దకు ఎలా చేరుకున్నాయి.? అనే చర్చ సోషల్ మీడియాలో ప్రారంభమైంది.
JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత పర్యటనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ 21-24 మధ్య భారత్ సందర్శించవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఉపాధ్యక్షుడి భార్య ఉషా వాన్స్ కూడా ఆయన వెంట ఉండనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీ, ఇతర సీనియర్ అధికారులతో సమావేశాలు ఉంటాయని, అధికారిక కార్యక్రమాలతో పాటు జైపూర్, ఆగ్రాలను సందర్శించవచ్చని తెలుస్తోంది.
India On USCIRF: US కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్ (USCIRF) భారతదేశంలో మైనారిటీల పరిస్థితిపై మరోసారి తప్పుగా నివేదించింది. భారత్లో మైనారిటీల పరిస్థితి క్షీణిస్తోందని పేర్కొంది. అయితే, ఈ నివేదికపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. USCIRFని ‘‘ఆందోళన కలిగించే సంస్థ’’గా గుర్తించాలని భారత్ నొక్కి చెప్పింది.