Home
India Us Relations
India Us Relations News
-
India on Russian oil: రష్యా చమురు కొనుగోలుపై జైశంకర్ క్లారిటీ..
India on Russian oil: భారత్ అమెరికా ట్రేడ్ డీల్ తర్వాత, భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు తగ్గించిందనే వార్తల నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చమురు కొనుగోళ్లు రాజకీయ ఒత్తిడితో కాకుండా, ఖర్చులు, లభ్యత, ప్రమాదాలను బట్టి జరుగుతాయని ఆయన క్లారిటీ ఇచ్చారు. మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్లో మాట్లాడిన జైశంకర్.. అమెరికాతో ట్రేడ్ డీల్ జరిగినా.. భారత వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి మారదని స్పష్టం చేశారు. -
US: రష్యన్ ఆయిల్ కొనుగోలు చేయమని భారత్ హామీ ఇచ్చింది..
US:రష్యన్ చమురును కొనుగోలు చేయమని భారత్ తమకు హామీ ఇచ్చిందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అన్నారు. మాస్కో ఇంధన రంగంపై అమెరికా విధించిన తాజా ఆంక్షల మధ్య ఈ వ్యాఖ్యలు వచ్చాయి. శనివారం మ్యూనిచ్ భద్రతా సమావేశంలో రూబియో చెప్పినట్లు మీడియా నివేదించింది. -
Modi-Trump: ప్రధాని మోడీతో మాట్లాడిన ట్రంప్.. యూఎస్ రాయబారి ఆసక్తికర పోస్ట్..
Modi-Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్రమోడీతో ఈరోజు(సోమవారం) ఫోన్లో మాట్లాడినట్లు భారత్లోని అమెరికా రాయబారి సెర్జియో గోర్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ట్విట్టర్ పోస్టులో ‘‘స్టే ట్యూన్డ్’’ అంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. అయితే, ఇరువురు నేతలు ఏ విషయంపై మాట్లాడారనే వివరాలను ఆయన వెల్లడించలేదు. అయితే, భారత్-అమెరికా మధ్య కీలక వాణజ్య ఒప్పందం త్వరలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. Read Also:… -
Donald Trump: ప్రధాని మోడీ ‘‘అద్భుత నాయకుడు’’.. దావోస్లో ట్రంప్ ప్రశంసలు..
Donald Trump: ప్రధాని నరేంద్రమోడీ ‘‘అద్భుత నాయకుడు’’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్తో బలమైన వాణిజ్య ఒప్పందం త్వరలో కుదురుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. -
Gaza Crisis: గాజా ‘‘బోర్డ్ ఆఫ్ పీస్’’లో చేరాలి.. భారత్కు ట్రంప్ ఆహ్వానం..!
Gaza Crisis: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం తర్వాత దెబ్బతిన్న గాజాలో పాలన, పునర్నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు ఉద్దేశించిన గాజా ‘‘బోర్డ్ ఆఫ్ పీస్’’లోకి భారతదేశాన్ని ట్రంప్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ట్రంప్ స్వయంగా ప్రధానమైన బోర్డుకు అధ్యక్షత వహిస్తుండగా, పాలస్తీనా టెక్నోక్రాట్ కమిటీ గాజా పాలన బాధ్యతల్ని చూస్తుంది, ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సలహాదారు పాత్రను పోషించే మరో విభాగంగా ఉంది. 20 పాయింట్ల గాజా శాంతి ప్రణాళికలో భాగంగా జనవరి 15న ఈ బోర్డును ఏర్పాటు చేశారు. -
US: భారత్ పెట్టుబడుల్ని తెస్తోంది, పాకిస్తాన్ ఏం తెస్తోంది..?
US: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రపంచ దేశాలపై టారిఫ్స్తో విరుచుకుపడుతున్నారు. ఇండియాపై ఏకంగా 50 శాతం సుంకాలు విధించారు. మరోవైపు, రేర్ ఎర్త్ ఖనిజాల కోసం పాకిస్తాన్తో డీల్ కుదుర్చుకున్నారు. ఇదిలా ఉంటే, ట్రంప్ అవలంభిస్తున్న విధానాలపై యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు, ట్రంప్ పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీ సభ్యుడు రిచ్ మెక్కార్మిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ పట్ల ట్రంప్ తీరును తప్పుపట్టారు. భారతదేశం అమెరికాలో పెట్టుబడుతుపెడుతోందని, పాకిస్తాన్ నుంచి… -
Trump Tariffs: భారత్పై టారిఫ్ 75% అవుతుందా.. ఇరాన్పై ట్రంప్ నిర్ణయంతో ఆందోళన..
Trump Tariffs: ఇరాన్ ప్రజాతిరుగుబాటు నేపథ్యంలో, ఆ దేశంతో వాణిజ్యం చేసే దేశాలపై 25 శాతం సుంకాలను విధిస్తామని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే, ఈ నిర్ణయం భారత్పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇరాన్ టాప్-5 వాణిజ్య భాగస్వాముల్లో భారత్ ఉంది. -
India-US: ‘‘మోడీ ట్రంప్కు ఫోన్ చేయలేదు’’ వ్యాఖ్యలపై స్పందించిన భారత్..
India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరకపోవడానికి ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో నేరుగా మాట్లాడకపోవడమే అని ఆ దేశ వాణిజ్య కార్యదర్శి హోవర్డ్ లుట్నిక్ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలపై భారత్ స్పందిస్తూ.. ‘‘ఇవి సరైనవి కావు’’ అని చెప్పింది. -
PM speaks to Trump: ట్రంప్కు ప్రధాని మోడీ ఫోన్.. వీటిపైనే చర్చ..
PM speaks to Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భారత ప్రధాని నరేంద్రమోడీ ఫోన్ చేశారు. యూఎస్ సుంకాల నేపథ్యంలో ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఇద్దరు నేతల మధ్య సంభాషణ ఆసక్తికరంగా మారింది. మోడీ, ట్రంప్లు రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంపొందించడం, ఎనర్జీ, డిఫెన్స్ రంగాలపై మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. -
India – America: భారత్-అమెరికా మధ్య దోస్తి.. 10 ఏళ్లకు కుదిరిన రక్షణ ఒప్పందం
India – America: భారతదేశం – అమెరికా మధ్య 10 సంవత్సరాల రక్షణ ఒప్పందం కుదిరింది. మలేషియా రాజధాని కౌలాలంపూర్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమైన తర్వాత అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ ఈ ఒప్పందాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాలు ఒకదానితో ఒకటి సమాచారాన్ని పంచుకోనున్నాయి. అలాగే ఇరు దేశాలు సాంకేతిక సహాయం కూడా అందించుకోనున్నాయి. READ ALSO: 2025 బిలియనీర్ల ర్యాంకింగ్స్ – ఎవరి విలువ ఎంత…
తాజావార్తలు
-
Malayalam movie updates: మోహన్లాల్తో ప్రియదర్శన్ 100వ సినిమా వాయిదా.. కారణం ఇదేనా?
-
Syria New Parliament: సిరియాలో ‘కొత్త శకం’.. అసద్ పతనం తర్వాత తొలి పార్లమెంట్ ఇదే!
-
IND vs ENG 1st T20I: టీమిండియా విజయాన్ని అడ్డుకున్న వరుణుడు.. అభిషేక్, శ్రేయస్, దూబె మెరుపులు వృధా!
-
Small Savings Schemes: స్మాల్ సేవింగ్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసేవారికి గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లను ప్రకటించిన కేంద్రం
-
Kajal Aggarwal: కాజల్ కెరీర్లోనే మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. ఆ స్టార్ డైరెక్టర్తోనేనా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!