ధరల పెరుగుదల అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.. నిత్యావసరాల నుంచి ప్రతీది పెరిగిపోతోంది.. ఓవైపు వేతనాల్లో పెద్దగా పెరుగుదల లేకపోయినా.. అన్ని వస్తువుల ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి.. ప్రతీ సామాన్యుడు, మధ్య తరగతి ప్రజలు దీంతో ఆందోళనకు చెందుతున్నారంటే సర్వసాధారణమే.. కానీ, ఏకంగా ఓ దేశ ప్రధానికే ఈ వ్యవహారం నిద్ర పట్టనివ్వడం లేదట.. ఆయన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. తాజాగా ధరల పెరుగుదలపై స్పందించిన ఇమ్రాన్.. ధరల పెరుగుదల ఒక్కొక్కసారి తనను రాత్రివేళల్లో నిద్రపోనివ్వడం…
ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లపై అమెరికా 20 ఏళ్ల పాటు జరిపిన పోరాటంలో పాకిస్తాన్ భాగస్వామ్యం కావడంపై ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా.. కేవలం డబ్బు కోసమే అమెరికాతో తమ దేశం అప్పట్లో చేతులు కలిపిందని వ్యాఖ్యానించారు. ఇస్లామాబాద్లో మంగళవారం విదేశాంగ శాఖ అధికారుల సమావేశంలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడారు. ”ఇతరులు మనల్ని వాడుకునేందుకు నాడు మనమే అవకాశమిచ్చాం. దేశ ప్రతిష్టను పణంగా పెట్టాం. ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా కాకుండా, డబ్బు…
ఈ ఏడాది చివరి నాటికి పాకిస్తాన్ దివాలా తీసిన అణ్వాయుధ శక్తిగా మారుతుంది. ఇబ్బడి ముబ్బడిగా చేసిన అప్పుల వల్లే దానికి ఈ దుస్థితి దాపురించింది. పాకిస్తాన్ విదేశీ రుణ భారం దాని జీడీపీ కంటే ఎక్కువ. విదేశీ రుణాలు పెరగడం జాతీయ భద్రతా సమస్యలను సృష్టిస్తుందని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంగీకరించారు. అణ్వాయుధ శక్తి కలిగిన పాకిస్థాన్ ఆర్థికంగా దివాలా తీయడం ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా అనేక భద్రతా పరమైన చిక్కులను సృష్టిస్తుంది. ప్రస్తుతం పాకిస్తాన్ విదేశాలకు…
ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు చేయడానికి ఇస్లామిస్టులకు, తీవ్రవాదులతో చేరి TLP గ్రూపులు కట్టింది. ప్రస్తుతం ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టకపోవడంతో తెహ్రీక్-ఇ-లబ్బైక్ పాకిస్థాన్ (TLP)ని నిషేధిత సంస్థల జాబితా నుంచి తొలగిచేందుకు అనుమ తిని ఇస్తున్నట్టు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంగీకరించారు. ఫ్రాన్స్లో ప్రచురితమైన దైవదూషణ కార్టూన్ల సమస్యపై ఫ్రెంచ్ రాయబారిని బహిష్కరించాలని ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకు వచ్చేందుకు ఈ గ్రూప్ హింసాత్మక నిరసననలు చేపట్టింది. ఈ ఏడాది ఏప్రిల్లో TLP ని నిషేధిత…
పాకిస్తాన్లో ఇమ్రాన్ఖాన్కు వ్యతిరేకంగా జనం పెద్ద ఎత్తున రోడ్లెక్కి నిరసనకు దిగుతుండడంతో శాంతిభద్రతల సమస్య తలెత్తుతోంది. తన విధానాలతో దేశాన్ని సర్వనాశనం చేస్తున్న ఇమ్రాన్ వెంటనే గద్దె దిగాలని ఆందోళన కారులు డిమాండ్ చేస్తున్నారు. పాకిస్తాన్తో నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగిపోవడంతో సామాన్యులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రోజురోజుకీ పెరుగుతున్న ధరలు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రతిపక్షాలు, కార్మికులు, ప్రజలు వేలాది మంది కరాచీలో రోడ్లపైకి వచ్చి ర్యాలీలు చేస్తున్నారు. ప్రధాని తక్షణమే రాజీనామా చేయాలని…
ఆయన దేశంలోని క్రికెటర్లకు ఆరాధ్య దైవం. రిటైర్మంట్ తర్వాత పాలిటిక్స్లోకి వచ్చి ప్రధాని అయ్యారు. క్రికెట్లోనే కాదు పాలిటిక్స్లోనూ లీడర్ని అని నిరూపించుకున్నారు. అయితే ఇటీవల ఆయన చేసిన పని.. అతడిని నవ్వులపాలు చేస్తోంది. ఇమ్రాన్ ఖాన్.. పాకిస్థాన్ ప్రధానమంత్రి. క్రికెటర్ నుంచి ప్రధానిగా ఎదిగిన లీడర్. పాకిస్థాన్లో ఎంతో ఖ్యాతి ఉన్న ఇమ్రాన్ ఖాన్.. ఇప్పుడు తలదించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆయన చేసిన పని.. ఇటీవల బయటపడింది. గిఫ్ట్గా వచ్చిన గడియారంను అమ్మి.. ఆ డబ్బులు…
ఆమెరికాపై పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పాక్ నిందలు వేస్తున్నదని ఆరోపించారు. 2001లో అమెరికా దళాలు ఆఫ్ఘనిస్తాన్పై దాడులు చేసిన సమయంలో పాకిస్తాన్లో రాజకీయ సుస్థిరత లేదని, జనరల్ పర్వేజ్ ముషారఫ్ తిరుగుబాటు చేసి పాలన చేజిక్కించుకున్నారని, ముషారఫ్కు అమెరికా మద్ధతు అవసరమవడంతో ఆఫ్ఘన్లో యుద్ధానికి మద్ధతు పలికారని, ఇది తప్పుడు నిర్ణయం అని పాక్ పీఎం పేర్కొన్నారు. అయితే, విదేశీదళాలకు వ్యతిరేకంగా వారికి శిక్షణ ఇచ్చామని, అమెరికాకు వ్యతిరేకంగా…
పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడనే ఫేక్ వార్త ప్రచారంతో ట్విట్టర్ లో #RIPImranKhan అనే హ్యాష్ ట్యాగ్ టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఆయన ఆసుపత్రిలో ఉన్నట్టు కొన్ని ఫొటోలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో ఆయనకు పెద్ద ఎత్తున సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ ఆత్మకు శాంతి చేకూరాలని నెటిజన్లు ట్వీట్లు కూడా చేస్తున్నారు. చివరకు ఆ వార్త ఫేక్ అని తేలింది. గతంలో ఎప్పుడో అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇమ్రాన్ ఖాన్…
ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల చేతిలోకి వెళ్లిపోయింది.. చాలా దేశాలు ఈ పరిణామాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి.. రాక్షస మూకల చేతుల్లోకి ఆఫ్ఘన్ వెళ్లిపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.. ఈ తరుణంలో తాలిబన్లతో స్నేహానికి తాము సిద్ధమని చైనా ప్రకటిస్తే.. ఇక, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. ఆఫ్ఘన్లో జరిగిన పరిణామాలను బానిస సంకెళ్లను తెంచుకోవడంగా అభివర్ణించారు ఇమ్రాన్.. ఇతరుల సంస్కృతిని ఆకళింపు చేసుకోవడంపై స్పందిస్తూ.. ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లీష్ను ఓ మీడియంగా తీసుకోవడంపై…
అమెరికా-పాక్ దేశాల మధ్య మంచి మైత్రి ఉన్నది. అయితే, ఈ మైత్రి గత కొంతకాలంగా సజావుగా ఉండటంలేదు. పాక్లో ఉగ్రవాదం పెరిగిపోవడంతో పాటుగా, ఆ దేశం చైనాతో బలమైన సంబందాలు కలిగి ఉండటం వలన అమెరికా పాక్ కు దూరమైందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. రెండు దశాబ్దాల కాలం క్రితం అమెరికా దళాలు అఫ్ఘనిస్తాన్లో అడుగుపెట్టి తాలిబన్, ఆల్ఖైదా వంటి తీవ్రవాద సంస్థలపై విరుచుకుపడ్డాయి. ఆ సమయంలో పాక్ సహకారంలో అమెరికా తాలిబన్ల ఆటకట్టించింది. ప్రస్తుతం అమెరికా-పాక్…