పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ తో పాటు ఆయన ప్రభుత్వాన్ని దోపిడీ ప్రభుత్వంగా అభివర్ణిస్తున్నారు. తాజాగా ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ను దొంగల చేతిలో పెట్టడం కన్నా అణుబాంబు వేయడం మంచిదంటూ వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రిక్-ఇ- ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. షహబాజ్ షరీఫ్, ఆయన పార్టీ…
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై ప్రస్తుత అధికార పక్షం సభ్యులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇమ్రాన్ ప్రధానిగా ఉన్నప్పుడు పలు అక్రమాలకు పాల్పడ్డారని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వానికి అందిన కానుకల విషయంలో కేవలం 20 శాతం డబ్బు కట్టి రూ. 5.7కోట్లను ఇమ్రాన్ సొమ్ము చేసుకున్నారని మండిపడుతున్నారు. తాజాగా ఇమ్రాన్ ఖాన్కు సంబంధించి మరో దుబారా ఖర్చును ప్రభుత్వ నేతలు బహిర్గతం చేశారు. ఇమ్రాన్ తన ప్రభుత్వ హయాంలో ప్రధాని నివాసం నుంచి బానీగాలాలోని ప్రైవేటు…
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు బెదిరింపుల వ్యవహారం చర్చగా మారింది.. తమ నేత ఇమ్రాన్ ఖాన్కు ప్రాణహాని ఉందని ఆ పార్టీ నేతలు పేర్కొనడంతో.. పాకిస్థాన్ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.. ఇమ్రాన్ ఖాన్కు పూర్తి భద్రతల కల్పించాలని.. ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆదేశించారు.. ఈ మేరకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖను ప్రధాని షరీఫ్ ఆదేశించినట్లు ప్రధాని కార్యాలయం సోషల్ మీడియాలో వెల్లడించింది. ఇమ్రాన్ భద్రత విషయంలో తక్షణ, పటిష్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు..…
ఊహించని పరిణామాలతో ప్రధాని పదవి కోల్పోయిన పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్.. పాక్ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు.. తనకు ఇప్పుడు పదవి లేదని, తాను మరింత ప్రమాదకరంగా మారుతానంటూ వార్నింగ్ ఇచ్చారు.. ప్రధాని పదవి కోల్పోయిన తర్వాత తొలిసారి పెషావర్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రమాదకారిని కాదు.. కానీ, ఇప్పుడు మరింత ప్రమాదకారిగా మారుతానని పేర్కొన్నారు.. దేశంలో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్ష పార్టీల…
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రతిపక్షాలు పెట్టిన పరీక్షలో ఓడిపోయారు. జాతీయ అసెంబ్లీ విశ్వాసం సొందటంలో ఆయన విఫలమయ్యారు. శనివారం అర్ధరాత్రి అవిశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్లో విపక్షాలు విజయం సాధించాయి. దాంతో ఇమ్రాన్ తన పదవిని కోల్పోయారు. దేశ చరిత్రలోనే అవిశ్వాస తీర్మానం ద్వారా అధికారం నుంచి వైదొలిగిన తొలి ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ నిలిచారు. పదవిని కాపాడుకనేందుకు చివరి వరకు పోరాడిన ఆయనకు ఓటమి తప్పలేదు. దాంతో పాకిస్తాన్ 75 ఏళ్ల చరిత్రలో ఇప్పటి…
1. ఏపీలో మంత్రివర్గ విస్తరణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు కొత్త మంత్రులకు సీఎం జగన్ తేనీటి విందు ఇవ్వనున్నారు. 2. ఏపీలో నేడు మరో సంచలన ప్రకటన చేసే అవకాశం ఉంది. కొత్త మంత్రుల ప్రకటనతో పాటే పార్టీపరంగా రీజనల్ కమిటీల ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. పాత మంత్రులకు రీజనల్ కమిటీ బాధ్యతలు అప్పగించనున్నారు. సీఎం జగన్తో సజ్జల భేటీలోనూ చర్చించినట్టు సమాచారం. 3. పాక్లో ఇమ్రాన్ఖాన్ సర్కార్ కుప్పకూలింది. విశ్వాస తీర్మానంలో…
పాకిస్థాన్లో రాజకీయ సంక్షోభం నెలకొంది. జాతీయ అసెంబ్లీలో ఆదివారం విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఖాసీం ఖాన్ సూరీ తిరస్కరించారు. దీంతో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన కుర్చీని కాపాడుకున్నారు. అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించిన వెంటనే జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని కోరుతూ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీకి ఇమ్రాన్ ఖాన్ సిఫారసు పంపించారు. మరోవైపు తన సర్కారుపై అవిశ్వాస తీర్మానాన్ని సభలో తిరస్కరించిన వెంటనే జాతిని ఉద్దేశించి ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించారు.…
అవిశ్వాస తీర్మానంపై పోరాటం చేస్తున్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇవాళ జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన.. తాను రాజీనామా చేసే ప్రసక్తేలేదని మరోసారి స్పష్టం చేశారు.. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు విదేశీ శక్తులతో కలసి ముగ్గురు దొంగలు పనిచేస్తున్నారని మండిపడ్డారు.. కొన్ని విదేశాల నుంచి మాకు మెసేజ్లు వస్తున్నాయని తెలిపారు.. విదేశీ శక్తులు కుట్ర చేస్తుంటే.. దేశం లోపల వారికి సహకరించే శత్రువులు కూడా ఉన్నారని, ఇద్దరు కీలక మిత్రపక్షాలు ఫిరాయించిన తర్వాత…
పాకిస్థాన్లో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. ప్రధాని ఇమ్రాన్ఖాన్పై వ్యతిరేకత తీవ్రమైంది. అధికార కూటమి నుంచి ప్రధాన భాగస్వామ్య పార్టీలు తప్పుకోనున్నాయి. ప్రతిపక్షంలో చేరి ఇమ్రాన్ ఖాన్కు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నాయి. నాలుగేళ్ల ఖాన్ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత ఎక్కువ కావడంతో మిత్రపక్షాలు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రేపు పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం ఎదుర్కొనున్నారు ఇమ్రాన్ ఖాన్. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ తాను రాజీనామా చేయనని ఇమ్రాన్ ఖాన్ తేల్చి చెప్పారు. తనకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలన్నీ…
పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో ముగిపోవడంతో.. ఆయనకు పదవీ గండం తప్పేలా లేదు. ఇమ్రాన్ఖాన్కు వ్యతిరేకంగా సొంత పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు, మంత్రులు రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికే 25 మంది ఎంపీలు, ముగ్గురు మంత్రులు రాజీనామా చేశారు. ఇదే బాటలో మరికొందరు ఉన్నారు. ఈ నెలాఖరులో.. ఇమ్రాన్ఖాన్పై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగనుంది. ప్రతిపక్షాలు తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానం కారణంగా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం తీవ్ర…