Imran Khan: పాకిస్తాన్ పై అణు బాంబు వేయడం బెటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ తో పాటు ఆయన ప్రభుత్వాన్ని దోపిడీ ప్రభుత్వంగా అభివర్ణిస్తున్నారు. తాజాగా ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ను దొంగల చేతిలో పెట్టడం కన్నా అణుబాంబు వేయడం మంచిదంటూ వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రిక్-ఇ- ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
షహబాజ్ షరీఫ్, ఆయన పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దొంగలు అన్ని సంస్థలను, న్యాయ వ్యవస్థను నాశనం చేశారని విమర్శించారు. ఏ అధికారి ఈ నేరస్తుల కేసులు విచారిస్తారని ప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. మే 20న రాజధాని ఇస్లామాబాద్ లో 20 లక్షల మందితో లాంగ్ మార్చ్ చేస్తానని ప్రభుత్వానికి అల్టిమెటం జారీ చేశారు. మమ్మల్ని ఏ శక్తి కూడా అడ్డుకోలేదని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. నిజమైన స్వాతంత్ర్య పొందడానికి ప్రజలంతా పెద్ద ఎత్తున లాంగ్ మార్చ్ కు హాజరవుతారని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు.
Also Read
- Jinping: భారత్ పర్యటనకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్.. వచ్చేదెప్పుడంటే..!
- Trump: అమెరికాలో చదివే భారతీయ విద్యార్థులకు భారీ షాక్?.. ట్రంప్ సర్కార్ పరిశీలనలో $100,000 OPT ఫీజు
- Pakistan Coal Mine Blast: బొగ్గు గనిలో భారీ పేలుడు.. 32 మంది కార్మికులు మృతి
- ఆపదలో దేవుడిలా మారిన Apple Watch.. కూతురు ఇచ్చిన గిఫ్ట్.. తండ్రికి ప్రాణం పోసింది!
ఇటీవల అనూహ్య పరిణామాల మధ్య ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పడిపోయింది. కొత్తగా పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీ, గత ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ సోదరుడు షహబాజ్ షరీఫ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఇమ్రాన్ ఖాన్ తన పదవిని కాపాడుకునేందుకు చివరి వరకు ప్రయత్నం చేశారు. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాణం జరగకుండా అడ్డుకున్నారు. అయితే పాక్ సుప్రీం కోర్ట్ ఆదేశాలతో ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాసం ఎదుర్కొని గద్దె దిగాడు. అయితే అప్పటి నుంచి ఇమ్రాన్ ఖాన్ రగిలిపోతున్నారు. అమెరికా ప్రోద్భలంతోనే నేతలంతా అమ్ముడు పోయారని… తన ప్రభుత్వం పడిపోవడానికి విదేశీ శక్తులు కారణం అయ్యాయని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
మరోవైపు పదవి కోల్పోతున్న సమయంలో భారత్ పై తెగ ప్రశంసలు కురిపించారు. భారత దేశంలో రాజకీయ వ్యవస్థలో ఆర్మీ కలుగచేసుకోదని… పాక్ ఆర్మీకి చురకలు అంటించారు. భారత్ ను ఏ సూపర్ పవర్ కూడా శాసించలేదని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. భారత దేశం తమ ప్రజల ముఖ్యం అనుకుంటుందని ప్రశంసించారు.
తాజావార్తలు
-
Anil Ravipudi: త్రివిక్రమ్ను అనిల్ రావిపూడి డామినేట్ చేసేశాడా?
-
Jinping: భారత్ పర్యటనకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్.. వచ్చేదెప్పుడంటే..!
-
GMB, AVD, ART తర్వాత.. NTR పేరు కూడా చేరబోతోందా? సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా ఎన్టీఆర్!
-
Ambati Rambabu నారా లోకేష్ అక్రమాలకు పాల్పడ్డారు.. డీఎస్సీ పోస్టులు అమ్ముకున్నారు!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
ట్రెండింగ్
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!
-
200MP కెమెరా, 9,000mAh బ్యాటరీతో ఆగస్టు 11న ఎంట్రీ ఇవ్వనున్న Redmi K100 Pro Max.!