PAKISTAN: పెట్రోల్ ధరల మంట.. పాకిస్థాన్లో రోడ్డెక్కిన వేలాది మంది
- పాకిస్తాన్లో పెట్రోల్ ధరల మంటలు..
- పెట్రోల్, నిత్యవసరాల ధరల పెరుగుదలపై ప్రజాగ్రహం..
- జమాతే ఇస్లామీ నేతృత్వంలో ప్రధాన నగరాల్లో నిరసనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PAKISTAN: అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం చేసి అంతర్జాతీయంగా తనను తాను సూపర్ పవర్గా భావించుకుంటోంది పాకిస్తాన్. కానీ దేశంలో మాత్రం ఆర్థిక సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇదే కాకుండా బలూచిస్తాన్, ఖైబర్ ఫక్తుంఖ్వా, పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)ల్లో తిరుగుబాటు ఎదుర్కొంటోంది. ఇదిలా ఉంటే, ఇప్పుడు పెరుగుతున్న పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరలపై ప్రజాగ్రహం తీవ్ర స్థాయికి చేరుతోంది. పెట్రోలియం లెవీ, ద్రవ్యోల్బణాన్ని వ్యతిరేకిస్తూ జమాత్-ఇ-ఇస్లామీ ఆందోళనకు పిలుపునివ్వడంతో వేల సంఖ్యలో ప్రజలు రోడ్ల పైకి వచ్చారు.
కరాచీ, లాహోర్, పెషావర్, క్వెట్టా, ఇస్లామాబాద్, రావల్పిండి, అబోట్టాబాద్ వంటి నగరాల్లో నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. ప్రధాన రహదారులతో పాటు, హైవేలపై ఆందోళనలు చేవారు. లెవీని వెనక్కి తీసుకోవాలి, ఎలాంటి లెవీ లేకుండా రూ. 225కే ఇంధనం ఇవ్వాలి అంటూ నినాదాలు చేశారు. జమాత్-ఇ-ఇస్లామీ అధినేత హఫీజ్ నయీముర్ రెహ్మాన్ ప్రభుత్వ పన్ను విధానాలను తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం పెట్రోలియం పై లెవీ ద్వారా రూ. 8 ట్రిలియన్ల పాకిస్తానీ రూపాయలను వసూలు చేసిందని ఆరోపించారు. మరోవైపు, ఐఎంఎఫ్ లెవీని తగ్గించేందుకు అంగీకరించిందని ప్రభుత్వం చెబుతోంది.
Also Read
- ISI Spy Trap: పాక్ ISI స్పై ట్రాప్.. ‘నగ్న ఫొటోలు’ ఎరగా వేసి భారత రక్షణ అధికారులను టార్గెట్ చేస్తున్న పాక్ ISI?
- Bangladesh: పాకిస్తాన్ బాటలో బంగ్లాదేశ్.. చైనా నుంచి 20 ఫైటర్ జెట్ల కొనుగోలు!
- Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
- Nepal Floods: 538కి చేరిన నేపాల్ మృతుల సంఖ్య..
శుక్రవారం జరిగిన నిరసనలు కేవలం ట్రైలర్ మాత్రమే అని జమాతే ఇస్లామీ వార్నింగ్ ఇచ్చింది. అవసరమైనే ఈ నిరసనల్ని దీర్ఘకాలం కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ రెహ్మాన్ తెలిపారు. ఇరాన్ యుద్ధం, ఆర్థిక సంక్షోభం కారణంగా ఏప్రిల్లో లీటర్ పెట్రోల్ రూ. 459 పాకిస్తానీ రూపాయలకు చేరింది. భారత కరెన్సీలో చెప్పాలంటే రూ. 157.26. డీజిల్ ధర రూ. 520.35 పాక్ రూపాలయకు చేరింది. దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇరాన్ యుద్ధం తర్వాత ఇంధన ధరలు అత్యధికంగా పెరిగిన దేశాల్లో పాక్ రెండోస్థానంలో ఉంది.
తాజావార్తలు
-
Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
-
Range Rover Sport Twenty Edition: రేంజ్ రోవర్ స్పోర్ట్ ట్వంటీ లిమిటెడ్ ఎడిషన్ విడుదల.. 537HP పవర్, కొత్త ఆరెంజ్ కలర్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
ISI Spy Trap: పాక్ ISI స్పై ట్రాప్.. ‘నగ్న ఫొటోలు’ ఎరగా వేసి భారత రక్షణ అధికారులను టార్గెట్ చేస్తున్న పాక్ ISI?
-
Hrehaan Roshan: హృతిక్ రోషన్ కొడుకు సింగర్గా ఎంట్రీ.. తొలి పాటతోనే అదరగొట్టిన హృహాన్!
ట్రెండింగ్
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!