తెలుగు పాపులర్ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ వార్తతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. హైదరాబాద్లోని నిజాంపేటలో వర్టెక్స్ ప్రీ విలేజ్ గేటెడ్ కమ్యూనిటీలో ఈ ఘటన జరిగింది. ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని అందరూ భావిస్తుండగా.. తాజాగా ఆమె కుమార్తె సంచలన వ్యాఖ్యలు దయ ప్రసాద్ చేసింది. తన తల్లి కల్పన ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టి పారేసింది.
హైదరాబాద్ మలక్పేటలో వివాహిత శిరీష్ హత్య కేసులో కీలక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శిరీషాను భర్త వినయ్, ఆడపడుచు సరిత చంపినట్లుగా పోలీసులు నిర్ధారించారు. సరిత అక్రమ సంబంధాన్ని ప్రశ్నించినందుకే శిరీషను చంపినట్లుగా పోలీసులు తేల్చారు.
CPI Party: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీపీఐ నేతల బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా స్థానికంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు గురించి చర్చ కొనసాగింది.
ప్రముఖ పాపులర్ తెలుగు సింగర్ కల్పనకు సంబంధించి హెల్త్ అప్డేట్ను నిజాంపేట హోలిస్టిక్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ప్రాణానికి ఎలాంటి ప్రాణ హాని లేదని చెప్పారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.
ప్రముఖ పాపులర్ తెలుగు సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం వ్యవహారం అభిమానులను ఉలిక్కిపడేలా చేసింది. హైదరాబాద్లోని నిజాంపేటలో ఆమె నివాసంలో ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. రెండు రోజుల నుంచి ఉలుకుపలుకు లేకపోవడంతో అపార్ట్మెంట్ వాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేపీహెచ్బీ పోలీసులు వచ్చి తలుపులు బద్ధలు గొట్టి లోపలికి వెళ్లారు.
టాలీవుడ్ సహా దక్షిణాది భాషలలో పలు సూపర్ హిట్ సాంగ్స్ పాడిన సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ మేరకు తాజాగా సమాచారం వెలుగులోకి వచ్చింది. ఆమె నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా సమాచారం. దీంతో ఆమెను స్థానిక హాలిస్టిక్ అనే ఆసుపత్రికి తీసుకు వెళ్లారు పోలీసులు. ఆమె ప్రస్తుతం నిజాంపేట పరిసరాలలో నివాసం ఉంటుంది. నిజాంపేటలోని వర్టెక్స్ ప్రివిలేజ్ లో తన భర్తతో కలిసి కల్పన నివాసం ఉంటుంది. అయితే రెండు రోజుల నుంచి…
ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్రం నుండి కూడా.. పార్టీ ఆవిర్భావ వేడుకులకు వెళ్లాలనే నేతలు సిద్ధం అవుతున్నారు.. అందులో భాగంగా జిల్లాల నాయకులు, నియోజకవర్గం నేతలు, పార్టీ కార్యకర్తలు తరలి రావాలని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వేమురి శంకర్ గౌడ్ కోరారు.
Ambulance Misuse: అత్యవసర పరిస్థితుల్లోనే అంబులెన్స్లు సైరన్ వాడాలనే నిబంధనలను ఉల్లంఘిస్తూ.. ఒక అంబులెన్స్ డ్రైవర్ తన పెంపుడు కుక్కకు ఆపరేషన్ కోసం సైరన్తో వెళ్లడం హైదరాబాద్ నగరంలో తీవ్ర సంచలనం రేపింది. పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద ఈ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. సైరన్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు.. ఈ క్రమంలో పంజాగుట్ట వద్ద అతి వేగంగా, సైరన్లు మోగిస్తూ వచ్చిన ఒక అంబులెన్స్ను పోలీసులు ఆపి తనిఖీ…
ATM Robbery Case: రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లిలో ఏటీఎం చోరీ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఏటీఎం చోరీకి ప్రయత్నించిన సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తేలింది.
Fire Accident: హైదరాబాద్ నగరంలోని అంబర్పేట్లో గల ఫ్లైఓవర్ కింద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చే నంబర్ చౌరస్తా దగ్గర ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల కోసం వేసిన షెడ్లలో ఈరోజు ( మార్చ్ 4) ఉదయం ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందాయి.