MP Eatala Rajender: మూసీ ప్రక్షాళన కోసం కేంద్రం నిధులు కేటాయించాలి..
- మూసీ ప్రక్షాళన, మురుగునీటి శుద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించాలి..
- భ్రమైన తాగునీటి కోసం తెలంగాణకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి: ఎంపీ ఈటల రాజేందర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Eatala Rajender: మూసీ ప్రక్షాళన, మురుగునీటి శుద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించాలని మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ కోరారు. పార్లమెంట్ లో మాట్లాడిన ఆయన.. శుభ్రమైన తాగునీటి కోసం తెలంగాణకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరంలో పట్టణీకరణ వేగంగా పెరిగిపోతుండటంతో.. నీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఇక, పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వాలు తగినంత మౌలిక సదుపాయాలు, సేవలను అందించడంలో ఇబ్బంది పడుతున్నాయని పేర్కొన్నారు. ఈ సవాళ్లను గుర్తించి కేంద్రం స్మార్ట్ సిటీస్, అమృత్ పథకాల కింద నిధులు ఇవ్వడం ఎంతో ప్రశంసనీయమైందన్నారు.
Read Also: Electronics Premier League: ఐపీఎల్ 2025 కోసం అమెజాన్ ఇండియా ప్రత్యేక డీల్స్!
Also Read
అయితే, హైదరాబాద్ నగరంలోని సరస్సులు మురుగునీటితో కలుషితం కావడంతో నగరం పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. ఒకప్పుడు ఈ నగరాన్ని సరస్సుల నగరంగా పిలిచేవారు. హుస్సేన్ సాగర్తో సహా దాని నీటి వనరులు అన్ని మురుగునీటి ప్రవాహాల కారణంగా పూర్తిగా కలుషితమయ్యాయి.. దీంతో జీవవైవిద్యం పూర్తిగా దెబ్బ తినే పరిస్థితి ఏర్పడింది.. కలుషితమైన నీరు బయటకు రావడంతో పాటు భూగర్భ జలాలు కూడా కాలుష్యమైపోతున్నాయి.. ఇలాంటి నీటి ద్వారా వ్యాధులు వ్యా్ప్తి చెందే పరిస్థితులు నెలకున్నాయని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. అయితే, మురుగునీటిని మళ్లించటంతో పాటు మురుగునీటి శుద్ధి కేంద్రాలను మరింత బలోపేతం చేసేలా మరన్నీ నిధులు ఇవ్వాలన్నారు. ఒకప్పుడు హైదరాబాద్ కు మూసీ జీవనదిగా ఉండేది.. కానీ, ఇప్పుడు విషపూరిత వ్యర్థాలు, శుద్ధి చేయని మురుగునీటి ప్రవాహాలతో తీవ్రమైన పర్యావరణ, ఆరోగ్యకరమైన ఇబ్బందులను సృష్టిస్తుందన్నారు. వీటికి, జలశక్తి మంత్రిత్వ శాఖ తగినంత నిధులను కేటాయించి.. మూసీ నది వెంబడి ఉన్న STPలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ఎంపీ ఈటల రాజేందర్ కోరారు.
తాజావార్తలు
-
Yemen Airport Attack: యెమెన్లో ల్యాండ్ అవుతుండగా క్షిపణుల వర్షం.. ఇరాన్ ప్రయాణికుల ప్రాణాలు గాల్లో!
-
RBI Report: తీవ్ర ద్రవ్యోల్బణంలో తెలంగాణ.. ఆర్బీఐ నివేదిక
-
Jani Master: చిరంజీవి సమక్షంలో కలిసిన జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్.. పెద్దరికం అంటే ఇదే!
-
Suryakumar Yadav: టీ20 జట్టులోకి మళ్లీ సూర్యకుమార్ యాదవ్..? బీసీసీఐ కీలక సంకేతాలు
-
UK-Iran: ఐఆర్జీసీపై బ్రిటన్ సంచలన నిర్ణయం.. ఉగ్ర సంస్థగా ప్రకటన
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!