హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ మెట్రోను ఏర్పాటు చేశారు. ఈ మెట్రో రైళ్లు ప్రారంభం తరువాత ప్రతి రోజు కనీసం రెండు లక్షల మంది వరకు ప్రయాణం చేసేవారు. అయితే, మొదటి దశ కరోనా సమయంలో మెట్రో రైళ్లు మూతపడ్డాయి. ఆ తరువాత తిరిగి మెట్రో ప్రారంభమైనా చాలా కాలం వరకు పెద్దగా ప్రయాణికులు లేకపోవడంతో మెట్రో సర్వీసులు తగ్గించుకుంటూ వచ్చారు. కరోనా మహమ్మారి నుంచి బయటపడుతున్న సమయంలో మళ్ళీ సర్వీసులు పెరిగాయి. కాగా,…
కరోనా వైరస్ ఎవ్వరినీ వదలడంలేదు.. సామాన్యుల నుంచి వీఐపీల వరకు అంతా మహమ్మారి బారిన పడుతూనే ఉన్నారు.. తాజాగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్కు కూడా కరోనా వైరస్ సోకింది.. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది.. ఈ నెల 3వ తేదీన తిరుపతిలో జరిగిన పాదయాత్ర, బహిరంగసభలో పాల్గొన్న పవన్ కల్యాణ్.. హైదరాబాద్కు తిరిగి వచ్చిన తర్వాత కాస్త నలతగా ఉండడంతో.. వైద్యుల సూచనల మేరకు కోవిడ్ టెస్ట్లు చేయించుకున్నారు.. అయితే,…
తెలంగాణలో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలని కోరుతూ వైఎస్ షర్మిల నిన్నటి నుంచి నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 15 వ తేదీన ఇందిరాపార్క్ వద్ద దీక్షకు కూర్చున్నారు. అయితే, సాయంత్రం తరువాత పోలీసులు దీక్షను అడ్డుకున్నారు. అక్కడి నుంచి వైఎస్ షర్మిలను లోటస్ పాండ్ లోని తన ఇంటికి చేర్చడంతో అక్కడే ఆమె దీక్షకు దిగారు. ఇంట్లో నుంచే షర్మిల దీక్ష చేస్తున్నారు. ఏప్రిల్ 15 నుంచి మూడు రోజులపాటు దీక్ష చేస్తున్నట్టు ఏప్రిల్ 9 వ తేదీన…
గ్యాంగ్ స్టార్ హైదర్ ను అరెస్ట్ చేసారు హైదరాబాద్ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. గత వారం రోజులుగా ఒడిశా నుండి తప్పించుకుని హైదరాబాద్ లో తిరుగుతున్నాడు గ్యాంగ్ స్టార్. ఓ మర్డర్ కేస్ తో పాటు కిడ్నాప్ కేస్ లో మోస్ట్ వాంటెడ్ గా గ్యాంగ్ స్టార్ హైదర్ పోలీసుల లిస్ట్ లో ఉన్నాడు. అయితే వారం రోజుల క్రితం అనారోగ్య సమస్యతో హైదర్ ను కటక్ లో హాస్పిటల్ లో చికిత్స కోసం…
ఇప్పటికే సీబీఎస్ఈ పరీక్షలపై కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో.. అదేదారిలో తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేసింది.. ఎస్ఎస్సీ బోర్డు ఎగ్జామ్స్ ను రద్దు చేసింది.. ఇదే సమయంలో ఇంటర్ పరీక్షలను వాయిదా వేసింది.. రాష్ట్రంలో టెన్త్ విద్యార్థులు 5.2 లక్షల మంది, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు నాలుగున్నర లక్షల మంది వరకు ఉన్నారు. ఇంటర్ కు మే1 నుంచి 20 వరకు, టెన్త్ విద్యార్థులకు మే 17 నుంచి 26 వరకు పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా.. కరోనా సెకండ్…
పందెం కట్టాలన్నా, చప్పట్టు కొట్టాలన్నా లేక సవాళ్లు చేయాలన్నా ఇరు పక్షాలు ఉండాలి. ఒకరిని ఒకరు సవాలు చేయగరు. అంతేగాని మనకు మనమే సవాలు విసిరి అవతలి వారు అందుకోలేదు గనక పై చేయి సాధించినట్టు హడావుడి చేస్తే సమాజంలో చెల్లుబాటు కాదు. ఒక వివాదంలో తమ పాత్ర గురించిన ప్రమాణం చేయడం అవతలివారిని చేయమని సవాలు చేయడం అలాటిదే. ఇంతకూ ఏ దేవత మీద దేవుని మీద ప్రమాణం చేసినా చట్టం ముందు చెల్లుబాటు కాదు. ఈ లోగా…
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో మరణమృదంగం మోగుతోందా ? కేవలం 24 గంటల వ్యవధిలో 35 మంది ఎందుకు మరణించారు ? గాంధీలో కరోనా పేషంట్ల మరణాల రేటు ఎక్కువగా ఎందుకు ఉంటోంది ? అనేది పరిశీలిస్తే కీలక విషయాలు వెల్లడయ్యాయి. తెలంగాణలో కరోనా చికిత్సకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అతి పెద్ద ఆసుపత్రి గాంధీ. ప్రస్తుతం 305 మంది పేషెంట్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాదాపు పదిహేను వందల బెడ్లతో భారీగా ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిలో…
హైదరాబాద్లో చీటర్కు బుద్ధి చెప్పిందో మహిళ. హైదరాబాద్ గౌతమీనగర్కు చెందిన సయ్యద్ అహ్మద్ బాలానగర్ కార్పొరేటర్ వద్ద అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ఓ వివాహితకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇప్పిస్తానని నమ్మించాడు. ఆమె దగ్గర 10 లక్షలు వసూలు చేశాడు. రోజులు గడుస్తున్నా ఇల్లు రాకపోవడంతో ఆమె… నిందితుడిని నిలదీసింది. తన డబ్బులు ఇచ్చేయాలని కోరింది. డబ్బులు ఇవ్వనని.. ఎవరికైనా ఫిర్యాదు చేసుకోవచ్చన్నాడు. అంతేకాదు మళ్లీ డబ్బులు అడిగితే ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో…