నష్టాల్లో కూరుకుపోతున్న టీఎస్ఆర్టీసీని గాడిలోపెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.. ఇప్పటికే ఆర్టీసీపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్.. ఆర్టీసీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. ఇక, ఆ తర్వాత మూడు, నాలుగు నెలల్లో ఆర్టీసీ కోలుకోకపోతే.. ప్రైవేట్పరం చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారంటూ ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్రెడ్డి స్పష్టం చేశారు.. సంస్థ బాగుకోసం అంతా కష్టపడి పనిచేయాలని సూచించారు. ఇక, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కూడా రంగంలోకి దిగారు.. ఇప్పటికే…
దేశంలో పుత్తడి ధరలు మళ్లీ దిగి వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లతో పాటుగా, దేశీయంగా మార్కెట్లు జోరు పెరిగింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో అన్ని రంగాలు తిరిగి తెరుచుకుంటున్నాయి. దీని ప్రభావం బంగారంపై పడింది. తాజాగా తగ్గిన ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 తగ్గి రూ.43,050 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.170 తగ్గి రూ.46,960కి…
తెలుగు అకాడమీలో నిధుల గోల్ మాల్ వ్యవహారం కలకలం రేపుతోంది.. యూబీఐలో తెలుగు అకాడమీ డిపాజిట్ చేసిన రూ.43 కోట్లు హాంఫట్ అయినట్టు ఇప్పటికే ఫిర్యాదు చేయగా.. ఇప్పుడు మరో ఫిర్యాదు అందింది.. సంతోష్నగర్లోని యూనియన్ బ్యాంక్ నుంచి రూ.8 కోట్లు గోల్మాల్ అయినట్టు తాజాగా ఫిర్యాదు చేసింది తెలుగు అకాడమీ.. దీంతో.. ఇప్పటి వరకు తెలుగు అకాడమీలో గోల్మాల్ అయిన నిధులు రూ.51 కోట్లకు చేరుకున్నాయి.. కార్వాన్, సంతోష్నగర్లోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ల నుంచి ఈ…
సినీ దర్శకనిర్మాత, రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళి ఇంటిపై రాళ్ల దాడికి దిగారు గుర్తుతెలియని వ్యక్తులు.. హైదరాబాద్ అమీర్పేట సమీపంలోని ఎల్లారెడ్డిగూడ నివాసం ఉంటున్నారు పోసాని.. అయితే, అర్ధరాత్రి ఆయన నివాసం దగ్గరకు వచ్చిన కొందరు దుండగులు.. పోసాని ఇంటిపై రాళ్లువిసిరారు.. పోసానిని బండ బూతులు తిడుతూ రెచ్చిపోయిన రాళ్ల దాడికి పూనుకున్నారు.. ఊహించన ఘటనతో వాచ్మన్ కుటుంబ సభ్యులు భయాందోళనకు దురయ్యారు.. అయితే, ఘటనా జరిగిన సమయంలో పోసానిగానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ…
తెలుగు అకాడమీలో అక్రమాలు వెలుగుచూశాయి.. తెలుగు అకాడమీకి సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్లలో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. వాటిని నిగ్గు తేల్చే పనిలో పడిపోయారు అధికారులు.. దాని కోసం ముగ్గురు సభ్యులతో కూడిన శాఖాపరమైన కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఉమర్ జలీల్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అకౌంట్స్ ఆఫీసర్ రాంబాబు, కాలేజీ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ యాదగిరి.. ఆ కమిషనర్ సభ్యులుగా ఉంటారు. అక్టోబర్ 2వ తేదీలోగా ఈ కమిటీ…
జనసేన అధినేత పవన్ కల్యాణ్పై దర్శకనిర్మాత, రచయిత, సినీ నటుడు పోసాని మురళి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపాయి.. పోసాని వ్యాఖ్యలను జీర్ణించుకోలేని కొందరు పవన్ అభిమానులు.. పోసానిపై దాడికి కూడా యత్నించారు.. పీఎస్లో కూడా ఫిర్యాదు చేశారు. ఇక, తాజాగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో పోసాని కృష్ణ మురళిపై ఫిర్యాదు చేశారు జనసేన నాయకులు.. పార్టీ అధినేత పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు, అసభ్య పదజాలంతో దూషించారని సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై…
తెలంగాణలో 26 ప్రైవేట్ జూనియర్ కాలేజీల భవితవ్యం అయోమయంగా మారింది. ఈ కాలేజీల్లో జాయినైన విద్యార్థుల పరిస్థితి గందరగోళంలో పడింది. కాలేజీల షిఫ్టింగ్ కు నోటిఫికేషన్ వేసి ఇంటర్బోర్డు.. దరఖాస్తులు తీసుకుంది. అయితే 3 నెలలుగా దరఖాస్తులను పెండింగ్లో పెట్టిన విద్యాశాఖ.. చివరకు అనుమతివ్వలేదు. షిఫ్టింగ్కు అనుమతి వస్తుంది అన్న ధీమాతో.. కొత్త ప్లేసులో కాలేజీలు అడ్మిషన్ తీసుకున్నాయి. అయితే, ఆ బిల్డింగ్ల ఫైర్ ఎన్వోసీల సమస్య ఇంకా కొలిక్కి రాలేదు. ఎన్వోసీ వస్తే తప్ప అనుబంధ…
తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీ పెట్టిన దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి కూతురు వైఎస్ షర్మిల.. రాష్ట్రంలో రాజన్న రాజ్యం స్థాపనే లక్ష్యం అంటున్నారు.. ఇక, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు.. అయితే, ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడానికి కీలకంగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ టీమ్.. ఇప్పుడు తెలంగాణలో వైఎస్ షర్మిల కోసం పనిచేస్తోంది. ఇవాళ లోటస్ పాండ్లోని పార్టీ కార్యాలయంలో వైఎస్ షర్మిలతో భేటీ…
ఐపీఎల్ మొదలైందంటే చాలు బెట్టింగ్ వీరులు రంగంలో దిగుతారు.. కోట్ల రూపాయలు కొల్లగొడతారు. ఆన్ లైన్ స్వేచ్ఛగా నడుస్తున్న బెట్టింగ్ ని అధికారులు కట్టడి చేయలేక పోతున్నారు. ఎప్పటికప్పుడు సీజన్ వారీగా బెట్టింగ్ మాఫియా ను పట్టుకొని కటకటా ల వెనక్కి నిట్టిన ప్రయోజనం లేకుండా పోతుంది . తాజాగా ఆన్ లైన్ బెట్టింగ్ ముఠా ను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు.సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీ ఐపిఎల్ బెట్టింగ్ రాకేట్ బయటపడింది. బెట్టింగ్ కు పాల్పడుతున్న 23…