బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న చిత్రం రాధేశ్యామ్. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జనవరి 14న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుచ్న్హి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులకు భారీ అంచనాలను నెలకొల్పాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో మేకర్స్ ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు. ప్రమోషన్స్ లో భాగంగా నేడు రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా జరగనుంది. ఈ ఈవెంట్ కి అభిమానులే ముఖ్య…
హైదరాబాద్ బాచుపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక వీఎన్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీ వద్ద 13వ అంతస్తు నుంచి దూకి బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థి ఆత్మహత్య విషయాన్ని తెలుసుకున్న కాలేజీ యాజమాన్యం వెంటనే గుట్టుచప్పుడు కాకుండా విద్యార్థి మృతదేహాన్ని సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు, మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే విద్యార్థి ఆత్మహత్య ఘటనను నిరసిస్తూ ఏబీవీపీ కార్యకర్తలు వీఎన్ఆర్ కాలేజీ వద్ద ఆందోళన చేపట్టారు. కాలేజీ…
తెలంగాణలో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మధ్యాహ్నం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి దీక్షకు దిగారు. ఈ మేరకు హైదరాబాద్లోని ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు రోడ్డుపై జగ్గారెడ్డి దీక్ష చేపట్టారు. రెండేళ్లుగా ఇంటర్ బోర్డు తీరు వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. తక్షణమే ఫెయిలైన విద్యార్థులకు కనీస మార్కులు వేసి పాస్ చేయాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. గ్రేస్ మార్కులను కలిపే పద్ధతిని అనుసరించాలని ఆయన ప్రభుత్వాన్ని…
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రంపంచదేశాలను వణికిస్తోంది.. భారత్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మహమ్మారి.. తెలంగాణలోనూ వెలుగు చూసింది.. విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి తెలంగాణలో అడుగుపెట్టిన ఒమిక్రాన్ ఇప్పుడు టెన్షన్ పెడుతోంది.. క్రమంగా ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు పెరుగుతూ పోతున్నాయి.. ఓవైపు డెల్టా వేరియంట్ కేసులు పూర్తిస్థాయిలో తగ్గిపోకముందే.. ఇప్పుడు ఒమిక్రాన్ ఆందోళన కలిగిస్తోంది.. అయితే, ఒమిక్రాన్ కట్టడికి క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ…
తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణలో మరో 14 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం రాష్ట్రంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 38కి చేరింది. ఎట్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన 14 మందికి కరోనా నిర్ధారణ జరిగినట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలియజేసింది. కేసులు పెరిగిపోతుండటంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఇప్పటికే మాస్క్ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. మాస్క్ లేకుంటే భారీ జరిమానాలు విధిస్తున్నారు. కేసులు పెరుగుతున్న దృష్ట్యా అవసరమైతే నైట్…
తెలంగాణ రాష్ట్రలో ఉద్యోగ దంపతుల బదిలీపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్రం వ్యాప్తంగా భార్యభర్తలు ఒకే చోట పని చేసేలా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలిస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. కొత్త జోనల్ కేటాయింపుల్లో చేరిన తర్వాతే ఉద్యోగుల్లో ఉండే భార్యభర్తలు దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొత్త జోనల్ వ్యవస్థ కేటాయింపులు అయిన తర్వాతే భార్య భర్తల బదిలీ విషయంలో ఆలోచిస్తామని…
తింటే గారెలు తినాలి. వింటే భారతం వినాలి అంటారు. కానీ ఇప్పుడు గారెల బదులు బిర్యానీ అనాలేమో. ఎందుకంటే అందరు మెచ్చిన వంటకంగా బిర్యానీ మారిపోయింది. అందునా మన హైదరాబాద్ బిర్యానీకి మరీ క్రేజ్. గల్లీ నుంచి ఢిల్లీ వరకు..టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు.. మహేశ్ నుంచి సల్మాన్ దాకా ..యాక్టర్లు క్రికెటర్లు అందరికి ఇష్టమైన వంటకం హైద్రాబాదీ బిర్యానీ. ఆర్డర్లలోనూ సరికొత్త రికార్డులు సృష్టించింది. నిమిషానికి 115 ఆర్డర్లలో టాప్ లో నిలిచింది. అందుకే ఫుడ్…
హైదరాబాద్ లోని కోకాపేట్ భూముల అమ్మకానికి కేసీఆర్ సర్కార్ అనుమతినిచ్చింది. కోకాపేట్ నియో పోలీస్ లోని భూముల వేలానికి హెచ్ ఎండీఏ కు అప్పగిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ నిర్ణయం తీసుకుంది. 239, 240 సర్వే నంబర్ల లోని భూమి పై హక్కులు పూర్తి గా ప్రభుత్వానివేనని నిర్ధారణ అయింది. తెలంగాణ రాష్ట్రప్రభుత్వ ఏజెంట్ గా హెచ్ ఎండీఏ ఈ భూముల వేలం నిర్వహించనున్నది. వేలంలో.. భూములు కొన్న బిల్డర్లకు రిజిస్ట్రేషన్లు చేయాలని రంగారెడ్డి.. కలెక్టరెట్కు…
టీఎస్ఎంఎస్ఐడీసీ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరణ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మగా అద్భుతంగా పని చేశారు. ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణలో కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు వైద్య సదుపాయాలు కల్పించే కీలకమైన సంస్థ టీఎస్ ఎం ఎస్ ఐడీసీ, అలాంటి సంస్థకు ఛైర్మగా బాధ్యతలు స్వీకరిస్తున్న ఎర్రోళ్ల శ్రీను కు నా అభినందనలు అని వైద్యాఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.…
ఒమిక్రాన్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ర్టంలో కేసులు నమోదు అవ్వగా తాజాగా తెలంగాణలో మరో ఒమిక్రాన్ పాజిటివ్ కేసు నమోదైంది. హైదరాబాద్ నగరంలోని హయత్నగర్లో 23 ఏండ్ల యువకుడికి ఒమిక్రాన్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో తెలంగాణలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 25కు చేరింది. హయత్నగర్కు చెందిన యువకుడు ఇటీవలే సూడాన్ నుంచి హైదరాబాద్కు వచ్చాడు. ఒమిక్రాన్ సోకిన యువకుడిని అధికారులు గచ్చిబౌలి టిమ్స్కు తరలించారు. ఈ యువకుడి…