బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని కాలరాస్తున్నాయి: డి.రాజా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో ప్రారంభమైన ఏఐవైఎఫ్ 16వ జాతీయ మహాసభలు. ఈ సభలు ఇవాళ్టినుంచి ఈనెల 10 వరకు జరగనున్నాయి. కాగా ఈ కార్యక్రమాలకు సీపీఐజనరల్ సెక్రటరీ డి. రాజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డి. రాజా మాట్లాడుతూ.. బీజేపీ పై నిప్పులు చెరిగారు. ఏ ఐవైఎఫ్ నాకు తల్లి లాంటిదన్నారు. కమ్యూనిస్టు పార్టీ భారతదేశ సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం పోరాడిందన్నారు. కాంగ్రెస్తో పాటు ముందుండి పోరాడిన పార్టీ కమ్యూనిస్టు పార్టీ అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని కాలరాస్తున్నాయన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో ఎలాంటి పాత్రలేని, బ్రిటిషర్లకు మోకరిల్లిన పార్టీ నేడు అధికారంలో ఉందని ఎద్దేవా చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న కమ్యూనిస్టు పార్టీ మాత్రం ప్రజాసమస్యలపై నేటికి వీధుల్లో పోరాడుతూనే ఉందన్నారు.
జవహార్లాల్ నెహ్రు ప్రభుత్వ రంగసంస్థలు ఆధునిక దేవాలయాలని నెలకొల్పితే వాటిని మోడీ ప్రభుత్వం ఆదానీ, అంబానీలకు అమ్ముతూ వారికి కొమ్ముకాస్తుందని విమర్శించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అచ్చేదీన్ ఎప్పుడు వస్తాయని ప్రజలు అడుగుతున్నారన్నారు. అంబానీ, అదానీలకు మాత్రమే మంచి రోజులు వచ్చాయి. సామాన్య ప్రజలకు రాలేదని దుయ్యబట్టారు. మోడీ పాలసీలు అన్నీ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉన్నాయంటూ ధ్వజమెత్తారు.
Also Read
- Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
- CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
- Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
Read Also: మూడో వేవ్ను సమర్థవంతంగా ఎదుర్కొందాం: హరీష్ రావు
బీజేపీ దేశాన్ని దోచుకుంటుంది. మోడీ పాలసీలను, మోడీ పాలన తీరును వ్యతిరేకిస్తే జైల్లో పెడుతున్నారు. హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. రైతుల ఉద్యమాన్ని చూసి….చేసేది లేక మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నారని డి. రాజా అన్నారు. మోడీ ప్రభుత్వాన్ని దింపేందుకు యువత ముందుకు రావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లపై పోరాటం ఎలా చేయాలో ఈ సమావేశాల్లో చర్చించాలని డి.రాజా అన్నారు.
తాజావార్తలు
-
Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
-
Veera Bhadrudu OTT: సూర్య ‘వీర భద్రుడు’ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
-
CM Chandrababu: సీఎం చంద్రబాబు బంపరాఫర్.. మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు..
-
Honda Hybrid Sedan: హోండా నెక్స్ట్ జనరేషన్ హైబ్రిడ్ సెడాన్.. 10% ఎక్కువ మైలేజ్, 30% తక్కువ ఖర్చు!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..