బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విన్నర్ గా విజె సన్నీ గెలిచిన విషయం తెలిసిందే. ట్రోఫీ గెలిచి బయటికి వచ్చిన దగ్గరనుంచి సన్నీ పలు మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చే పనిలో ఉన్నాడు. ఇక నిన్న హైదరాబాద్లో జరిగిన ప్రెస్మీట్ లో మీడియా ఛానళ్లు, యూట్యూబ్ ఛానళ్లు పాల్గొన్నాయి. ఇక ఈ కార్యక్రమంలో చిన్న అపశృతి దొర్లింది. సన్నీ చేతికి కరెంట్ షాక్ తగిలింది. సన్నీ మాట్లాడుతూ ఫోన్ లో ఒక క్లిప్పింగ్ చూపించడానికి ఫోన్ పట్టుకోగా..…
తెలంగాణలో కొత్తగా మరో 4 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24కు చేరింది. గడిచిన 24 గంటల్లో ఎట్ రిస్క్ దేశాల నుంచి 726 మంది శంషాబాద్ విమానాశ్రాయానికి చేరుకున్నారని, వారదందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా నలుగురికి పాజిటివ్గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు.దీంతో వారి శాంపిల్స్ను అధికారులు జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపించారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 9,122 మంది ప్రయాణికులు వచ్చారు.…
సాధారణంగా పెద్ద షాపింగ్ మాళ్లకు వెళ్లే కస్టమర్లకు క్యారీబ్యాగ్స్ విషయంలో సమస్య ఎదురవుతుంది. క్యారీబ్యాగ్ తీసుకువెళ్లకపోతే అదనంగా 5-10 రూపాయిలు చెల్లించాల్సి ఉంటుంది. వేలకు వేలు పెట్టి సరుకులు, వస్తువులు కొనేటప్పుడు క్యారీబ్యాగ్ ఉచితంగా ఇవ్వమని కస్టమర్లు అడిగితే షాపింగ్ మాల్ నిర్వాహకులు ససేమిరా అంటారు. ఈ విషయంపై హైదరాబాద్ తార్నాకకు చెందిన ఆకాశ్కుమార్ వినియోగదారుల ఫోరానికి ఫిర్యాదు చేశాడు. Read Also: సామాన్యులకు గుడ్న్యూస్.. తగ్గనున్న వంటనూనె ధరలు వివరాల్లోకి వెళ్తే… 2019 మే 11న…
నిధుల మళ్లింపు వ్యవహారంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుకు (టీఆర్ఎస్) చెందిన మధుకాన్ సంస్థల కార్యాలయాలు, ఇళ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. రాంచీ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి సంబంధించి బ్యాంకులను రూ.1064 కోట్ల మేర మోసం చేశారన్న ఆరోపణలపై ఇదివరకే సీబీఐ కేసు నమోదు చేయగా ఇప్పుడు ఈడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. నామా నాగేశ్వరరావు నేతృత్వంలోని మధుకాన్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ రాంచీ-జంషెడ్పూర్ల మధ్య 163 కిలోమీటర్ల పొడవైన నాలుగు…
ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో తెలుగుదేశం అధినేత, చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగ ఆయన మాట్లాడారు. శత్రువులను కూడా గౌరవించమని బైబిల్ చెబుతుంటే, సొంత పార్టీ కార్యకర్తల్ని కూడా కనికరించని పరిస్థితుల్లో వైసీపీ ఉందన్నారు. తోటి వారిని ప్రేమించాలనే బైబిల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ర్టంలో పరిపాలన కొనసాగుతుందన్నారు. ప్రశ్నించే వారిపై దాడుల్ని యేసు ప్రభువు ఆమోదిస్తారా? ఉన్నత ప్రమాణాలు పాటించే క్రైస్తవ విద్యా సంస్థలకు గ్రాంట్ నిలిపేసిన ఏకైక ప్రభుత్వం వైసీపీదేనని ఎద్దేవా…
హైదరాబాద్ గోషామహల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. గోషామహల్ లోని జింగుర్ బస్తీలో ఒక సెంట్ దుకాణంలో మంటలు చెలరేగాయి. దీంతో భారీగా ఎగిసిపడుతున్నాయి మంటలు. సంఘటన స్థలానికి చేరుకుని ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చి, సహాయక చర్యలు చేపట్టారు మాజీ టీఆర్ఎస్ కార్పొరేటర్ ముకేష్ సింగ్. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. షాపులో షార్ట్ సర్క్యూట్ తో మంటలు వ్యాపించి వుంటాయని అనుమానిస్తున్నారు. లక్షల్లో ఆస్తి నష్టం సంభవించినట్టు సమాచారం.…
టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగిపోతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు గ్రీన్ ఛాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటారు. తాజాగా శ్యామ్ సింగరాయ్ మూవీ యూనిట్ కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొంది. ఈ మేరకు జూబ్లీహిల్స్లోని ప్రశాసన్ నగర్లో ఉన్న జీహెచ్ఎంసీ పార్కులో నేచురల్ స్టార్ హీరో నాని, హీరోయిన్లు సాయి పల్లవి, కృతిశెట్టి, నిర్మాత బోయినపల్లి వెంకట్ మొక్కలు నాటారు. Read Also: అనంతరం నేచురల్…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు మరోసారి బహిరంగ లేఖ రాశారు టి.పీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి… ఈసారి లేఖలో పోస్టింగుల కోసం వెయిటింగ్లో ఉన్న అధికారుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.. ఎక్సైజ్ శాఖలో అకారణంగా మూడు సంవత్సరాలుగా పోస్టింగ్స్ ఇవ్వకుండా వెయిటింగ్లో పెట్టిన అధికారులకు వెంటనే పోస్టింగ్స్ ఇవ్వాలని విన్నవించారు.. ఆంధ్ర నుండి తెలంగాణకు కేటాయించిన తెలంగాణ బిడ్డలైన ముగ్గురు ఎక్సైజ్ సూపరింటెండెంట్లను ఎటువంటి కారణం లేకుండా రెండు సంవత్సరాలుగా పోస్టింగ్ ఇవ్వకుండా జీతాలు ఇవ్వకుండా…
ఈ సృష్టిలో తీయనైనది ప్రేమ. అది ఎవరి మధ్య అయినా పుడుతుంది. దానికి రంగు, కులం, మతంతో సంబంధం లేదు. అలా ఇద్దరు అబ్బాయిల మధ్య కూడా పుట్టింది. దీంతో ఆ ఇద్దరు పెద్దల సమక్షంలో పెళ్లి కూడా చేసుకున్నారు. ఇది జరిగింది ఎక్కడో కాదు మన తెలంగాణలో. తెలంగాణలో తొలిసారిగా ఇద్దరు అబ్బాయిలు ప్రేమించుకుని పెళ్లి చేసుకుని రికార్డు సృష్టించారు. Read Also: వరంగల్ బాలుడికి అరుదైన అవకాశం వివరాల్లోకి వెళ్తే.. 8 ఏళ్ల క్రితం…
మేడమ్ బాగా బిజీ. విపక్షాలకే కాదు.. అధికారపక్షానికి కూడా అందుబాటులో ఉండరట. ఇన్నాళ్లూ ఈ అంశంపై లోలోనే మథన పడుతున్న స్వపక్షీయులు.. టైమ్ రాగానే ఫిర్యాదు చేసేశారు. అదికూడా.. మేడమ్ సమక్షంలోనే చెప్పాల్సినవి చెప్పేయడంతో.. ఈ ఎపిసోడ్ అధికారపార్టీలో ఆసక్తికర చర్చగా మారింది. మేయర్పై సొంతపార్టీ కార్పొరేటర్లే గుర్రు..! గద్వాల విజయలక్ష్మి. గ్రేటర్ హైదరాబాద్ మేయర్. మహానగరంలో కీలక పదవిలో ఉన్నారామె. సిటీలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా.. స్పందించాల్సింది నగర ప్రథమ పౌరురాలిగా విజయలక్ష్మే. కానీ..…