తెలుగు రాష్ట్రాలలో పుల్లారెడ్డి స్వీట్స్కు ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుల్లారెడ్డి స్వీట్స్ అంటే ఎవరికైనా నోరూరుతుంది. అయితే పుల్లారెడ్డి స్వీట్ షాపుకు హైదరాబాద్లోని జీహెచ్ఎంసీ అధికారులు షాకిచ్చారు. రూ.25వేలు జరిమానా విధించారు. వివరాల్లోకి వెళ్తే… ఇటీవల శంషాబాద్లోని పుల్లారెడ్డి స్వీట్ హౌస్లో కొంతమంది కస్టమర్లు స్వీట్లు కొనుగోలు చేశారు.
Read Also: మనిషిని నాశనం చేసే ఐదు విషపూరిత అలవాట్లు
అయితే వారు కొనుగోలు చేసిన మిఠాయిలు పాచిపోయి ఉండటంతో కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై బాధితులు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు శంషాబాద్లోని పుల్లారెడ్డి స్వీట్ హౌస్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో పాచిపోయిన మిఠాయిలను అధికారులు గుర్తించారు. కస్టమర్ల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందుకు నిబంధనల ప్రకారం జీహెచ్ఎంసీ అధికారులు పుల్లారెడ్డి స్వీట్స్ హౌస్కు రూ.25 వేలు జరిమానా విధించారు. మరోసారి పాచిపోయిన స్వీట్స్ను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.