రాజేంద్ర నగర్ పీవీ ఎక్స్ ప్రెస్ పిల్లర్ నంబర్ 296 వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బైక్ డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న హైమద్ అనే వ్యక్తి మృతి అక్కడికక్కడే మృతి చెందాడు. హుటాహుటిన రాజేంద్రనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఎక్స్ప్రెస్ వేపై టూ వీలర్స్కు అనుమతి లేదు. ఆరంఘర్ నుంచి మెహదీపట్నం వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.కాగా పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా…
తెలంగాణలో ఉష్ణోగ్రతలు కాస్త పెరిగాయి.. చలి తీవ్రత తగ్గుముఖం పట్టింది.. ఇదే సమయంలో.. మూడు రోజుల పాటు తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతోంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. రాష్ట్రంలో కొన్నిచోట్ల ఆదివారం నుంచి మంగళవారం వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.. అంతేకాదు.. అకాల వర్షాలతోపాటు ఉరుములు, మెరుపులు కూడా వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది.. కాగా, ఇప్పటికే తెలంగాణలో కురిసిన వర్షాలతో…
కేంద్రంపై మరో పోరాటానికి రెడీ అవుతోంది టీఆర్ఎస్ పార్టీ… పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో దూకుడు పెంచాలని అధిష్టానం నిర్ణయించింది. కేంద్ర వైఖరిపై గట్టిగా పోరాడాలని సిగ్నల్స్ రావడంతో… ఆ దిశగా కసరత్తు మొదలు పెట్టారు టీఆర్ఎస్ ఎంపీలు. ఈ నెల 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి... దాంతో గులాబీ పార్టీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కసరత్తు మొదలుపెట్టింది. విభజన చట్టం అమలు, పెండింగ్ ప్రాజెక్టులు, రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై పార్లమెంట్ వేదికగా…
హైదరాబాద్ నగరంలో రవాణాను వేగవంతంగానిర్వహించే ఎంఎంటీఎస్ రైళ్లను రెండు రోజుల పాటు రద్దు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. నిర్వహణ పనుల కారణంగా ఈనెల 22, 23వ తేదీల్లో కొన్ని ఎంఎంటీఎస్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. లింగంపల్లి-హైదరాబాద్, హైదరాబాద్-లింగంపల్లి, ఫలక్నుమా-లింగంపల్లి, లింగంపల్లి-ఫలక్నుమా, సికింద్రాబాద్-లింగంపల్లి (రైల్ నెంబర్: 47150), Read Also: సంగారెడ్డిలో దారుణం.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి కుటుంబంతో సహా ఆత్మహత్య లింగంపల్లి-సికింద్రాబాద్ (రైల్ నెంబర్: 47195) సర్వీసులను తాత్కాలికంగా…
కరోనా మరోసారి పంజా విసురుతోంది.. ఒమిక్రాన్ ఎంట్రీతో థర్డ్ వేవ్ రూపంలో విరుచుకుపడుతోంది.. దీంతో.. అన్ని ప్రభుత్వాలు కట్టడి చర్యలకు దిగుతున్నాయి.. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా.. రేపటి నుంచి ఫీవర్ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.. మరోవైపు.. ప్రభుత్వం గతంలో విధించిన కరోనా ఆంక్షలు ఇవాళ్టితో ముగియనున్న నేపథ్యంలో.. కోవిడ్ ఆంక్షలు ఈ నెల 31 వరకు పొడిగించింది తెలంగాణ సర్కార్.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.. Read Also: కోవిడ్ పంజా.. తెలంగాణ సర్కార్…
సినిమా.. ఓ రంగల కల.. ఎన్నో ఆశలు.. కలలు.. ట్యాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ రంగంలోకి రావాలని ఆశపడతారు. కానీ విజయం అంత త్వరగా రాదు.. ఇప్పుడు స్టార్లగా నిలబడిన వారందరు ఒకప్పుడు ఎన్నో కష్టాలను దాటుకొని వచ్చినవారే.. ఇప్పుడు ఎంతమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది తమ జీవితాలను పణంగాపెట్టి కష్టపడుతున్నారు. అయితే చిత్ర పరిశ్రమలోకి రావడానికి ఒక యువ దర్శకుడు చేసిన పనిమాత్రం అందరికి షాక్ కి గురిచేయడమే కాకుండా…
డ్రగ్స్ వాడేవాళ్లకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం డ్రగ్స్ వాడకం అనేది ఇంటింటి సమస్యగా మారిందని.. ఇకపై డ్రగ్స్ వాడేవాళ్లను కఠినంగా శిక్షిస్తామని వ్యాఖ్యానించారు. డ్రగ్స్ వాడుతూ సినిమా వాళ్లు పట్టుబడినా మినహాయింపు ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఇకపై సినీ ప్రముఖులు డ్రగ్స్ వాడుతూ పట్టుబడితే జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. డ్రగ్స్ తీసుకునే వారిని అరెస్ట్ చేయకపోతే దీన్ని కట్టడి చేయలేమని సీపీ అభిప్రాయపడ్డారు. Read Also: తెలంగాణలో మరో భారీ…
బహుళ అంతస్తుల కట్టడాలపై డిస్ట్రిక్ టాస్క్ ఫోర్స్, హెచ్ఎండీఏ ఫోకస్ పెట్టింది. బుధవారం మరో పది అక్రమ నిర్మాణాల కూల్చివేసింది. వాటిల్లో ఐదు అంతస్తుల భవనాలు, రెండు ఎకరాల్లో గోదాములు ఉన్నాయి. మొత్తంగా మూడు రోజుల్లో 33 నిర్మాణాలపై టాస్క్ ఫోర్స్ బృందం కూల్చి వేసింది.మూడో రోజు తూంకుంట, మణి కొండ, శంషాబాద్, పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీలలో కొనసాగిన కూల్చివేతలు. అనధికారిక భవనాలు, అక్రమ నిర్మాణాల విషయంలో డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్, హెచ్ఎండీఎ యంత్రాంగం వేగాన్ని…
హైదరాబాద్లో చైన్ స్నాచర్లు వీరంగం సృష్టించారు. గంట వ్యవధిలోనే వేర్వేరు చోట్ల నాలుగు చోట్ల చైన్ స్నాచింగ్కు పాల్పడ్డారు. సికింద్రాబాద్లోని మారేడ్పల్లిలో ఒక మహిళ మెడలో నుంచి మూడున్నర తులాల బంగారు గొలుసు ఎత్తుకొని పారిపోయారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు అప్రమత్తమయ్యేలోపే పేట్ బషీరాబాద్ పరిధిలో మరో దొంగ మూడు చైనింగ్ స్నాచింగ్లకు పాల్పడగా ఒకటి విఫలమైంది. ఇద్దరు మహిళల మెడలో నుంచి బంగారు గొలుసును తెంపుకుని పారిపోయాడు. Read Also: పీజీ వైద్య కాలేజీల్లో ఫీజుల…
హైదరాబాద్ నగరంలో స్టీల్ బ్రిడ్జి ప్రజలకు అందుబాటులోకి రానుంది. పంజాగుట్ట నుంచి బంజారాహిల్స్ వెళ్లే రోడ్డులో ఈ బ్రిడ్జిని నిర్మించారు. పంజాగుట్ట శ్మశాన వాటిక పాత ద్వారాన్ని తొలగించి నూతన బ్రిడ్జిని నిర్మించడంతో… శ్మశాన వాటికకు వెళ్లేందుకు ప్రజలకు ఇబ్బందులు తొలగిపోనున్నాయి. పాత గేటు నుంచి హైటెన్షన్ విద్యుత్ పోల్ వరకు రోడ్డు విస్తరణ చేయడంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పనున్నాయి. Read Also: జూనియర్ ఆర్టిస్ట్ అనుమానాస్పద మృతి… ధర్నాకు దిగిన కుటుంబీకులు ఈ బ్రిడ్జి నిర్మాణం…