Hyderabad: హైదరాబాద్ నగరంలో సాధారణంగానే కొన్ని పార్కులకు ఫ్యామిలీలు వెళ్లాలంటే జంకాల్సిన పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఇందిరా పార్క్ లాంటి పార్కుల్లో కొందరు ప్రేమికులు బహిరంగంగా రొమాన్స్ చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తారు. మరికొన్ని పార్కుల్లో అయితే చైన్ స్నాచింగ్ వంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి వాటికి చెక్ చెప్పేందుకు జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణయించుకున్నారు. నగరంలోని పలు ప్రాంతాలతో పాటు పార్కుల్లోనూ సీసీ కెమెరాలు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు 8 వేల కెమెరాలను…
Bharat Jodo Yatra: తెలంగాణలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ జోడో యాత్ర ఎనిమిదో రోజుకు చేరుకుంది. రాత్రి బోయిన్ పల్లిలో బసచేసిన రాహుల్ గాంధీ పాదయాత్రను హుషారుగా ప్రారంభించారు.
Telugu Serial Actress Arresst: వెండితెర కంటే బుల్లితెర నటీనటులకు ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది. తెలుగులో పలు సీరియళ్లలో నటిస్తున్న తమ అభిమాన నటి పోలీసుల అదుపులో ఉందనే వార్త ఇప్పుడు ప్రేక్షకుల్లో కలకలం రేపుతోంది.
మహిళలు ఎక్కడున్నా.. ఎక్కడికి వెళ్లినా లైంగిక వేధింపులు తప్పడంలేదు.. పసికూనల నుంచి పండు ముసలి వరకు ఎవ్వరినీ వదలడంలేదు కామాంధులు.. ఇలాంటి ఘటనలు నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయి.. అయితే, తాజాగా, చర్లపల్లి సెంట్రల్ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ చింతల దశరథంపై బదిలీ వేటు వేసింది జైళ్ల శాఖ.. జైలులో ఉన్నవారిని కలిసేందుకు, చూసేందుకు సాధారణంగా ములాకత్కు వస్తుంటారు.. ఖైదీల కుటుంబ సభ్యులు.. అయితే, ములాకత్కు వచ్చే ఖైదీల భార్యలను వేధిస్తున్నాడని దశరథంపై ఆరోపణలు వచ్చాయి.. దీంతో,…
హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఎన్టీవీ-భక్తి టీవీ ఘనంగా కోటిదీపోత్సవాన్ని నిర్వహిస్తోంది.. తొలి రోజు అన్ని కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.. శివనామస్మరణతో ఎన్టీఆర్ స్టేడియం పరిసర ప్రాంతాలు మారుమోగి పోయాయి.. వేలాది మంది భక్తులు వచ్చి కోటిదీపోత్సవంలో పాలుపంచుకున్నారు.. ఇక, రెండో రోజు కోటిదీపోత్సవం ప్రారంభమైంది… కన్నులపండుగగా.. ఇల కైలాసంలో జరుగుతోన్న ఆ దీపాల ఉత్సవాన్ని లైవ్లో వీక్షించేందుకు కింది వీడియో లింక్ను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=5bjCLsDY210
డీఏవీ పబ్లిక్ స్కూల్ అనుమతిని పునరుద్ధరించింది విద్యాశాఖ.. ఈ విద్యా సంవత్సరానికి తాత్కాలిక అనుమతిని ఇచ్చిన విద్యాశాఖ.. తాము సూచించిన నిబంధనలు పక్కాగా అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
దేశాన్ని మళ్లీ ఏకం చేసేందుకు తెలంగాణలో భారత్ జోడో యాత్రతో ముందుకు సాగుతున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల తల్లి రాధిక వేముల కలిసి సంఘీభావం తెలిపారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ను పోలీసులు పీడీ చట్టం కింద అక్రమంగా అరెస్ట్ చేశారని, ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని సీనియర్ న్యాయవాది రవిచందర్ వాదించారు. కొందరిని సంతృప్తి పరిచేందుకు రాజా సింగ్పై పీడీ యాక్ట్ ప్రయోగించారని రాజా సింగ్ భార్య ఉషాభాయ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్లో పేర్కొన్నారు.
కార్తిక మాసం వచ్చిందంటే చాలు అందరి దృష్టి హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంవైపే వెళ్తుంది.. ఎందుకంటే ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే కోటి దీపోత్సవమే కారణం.. వేలసంఖ్యలో భక్తులు వచ్చి కోటిదీపోత్సవంలో పాల్గొని దీపాలు వెలిగిస్తారు.. ఇక, కుదరని వాళ్లు ఎన్టీవీ, భక్తి టీవీల్లో లైవ్లో వీక్షిస్తుంటారు.. ఈ ఏడాది కోటి దీపోత్సవం ఈ రోజే ప్రారంభమైంది… కోటిదీపోత్సవం-2022 మొదటి రోజు శంఖారావంతో ప్రారంభమైంది.. ఉత్సవంలో భాగంగా ప్రాంగణంలోని మహాశివలింగానికి ప్రదోషకాల అభిషేకం నిర్వహించారు.. ఇక, బ్రహ్మశ్రీ డా||…