Hyderabad Rains Today: వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ‘హైడ్రా’ అప్రమత్తమైంది. 24/7 సేవలందించే పనిలో నిమగ్నమైంది. రహదారులపై నీరు నిలవకుండా.. ఎప్పటికప్పుడు క్యాచ్పిట్లలో, కల్వర్టుల్లో చెత్తను తొలగిస్తూ వరద సాఫీగా సాగేలా హైడ్రా బృందాలు పని చేస్తున్నాయి. నగర వ్యాప్తంగా 436 ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉందని హైడ్రా గుర్తించింది. ఇందులో 150 ప్రాంతాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించింది. ఆ ప్రాంతాల్లో హెవీ మోటార్లు ఏర్పాటు చేయడమే కాకుండా.. వరద సాఫీగా వెళ్లేలా ఏర్పాట్లను చేసింది.…
మంగళవారం హైదరాబాద్ చందానగర్లోని ఖాజానా జ్యువెలరీ షాప్లో దొంగలు దోపిడీకి ప్రయత్నించిన విషయం తెలిసిందే. పట్టపగలు తుపాకులతో చొరబడిన దుండగులు 10 నిమిషాల పాటు షాప్లో బీభత్సం సృష్టించారు. ఖాజానా జ్యువెలరీ సిబ్బందిలో ఒకరిపై కాల్పులు జరిపి.. వెండి వస్తువులు, 1గ్రామ్ గోల్డ్ ఆభరణాలతో పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం 12 బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై తాజాగా మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ స్పందించారు. ఈ కేసును ఛాలెంజ్గా…
తెలుగు సినీ పరిశ్రమలో గత కొంతకాలంగా వేతన పెంపు వివాదం కారణంగా నిలిచిపోయిన చిత్రీకరణల సమస్యను పరిష్కరించేందుకు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో ఫిల్మ్ ఫెడరేషన్, ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మధ్య చివరి దశ చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో పరిశ్రమ ఎదుర్కొంటున్న సాంకేతిక, ఆర్థిక, మరియు నిర్మాణ సవాళ్లపై విస్తృతంగా చర్చించారు. ఈ కీలక సమావేశంలో ఫెడరేషన్ తరపున కోఆర్డినేషన్ ఛైర్మన్ వీరశంకర్, యూనియన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని, ప్రధాన…
Srushti Ivf Center : ఆ ఆడవాళ్లు.. అమ్మతనాన్ని అంగట్లో పెట్టారు. అలాంటి వాళ్లను.. ఆడవాళ్లు అనేకంటే కిరాతకులని చెప్పవచ్చు. 18 మంది ఆడవాళ్లు కలిసి ఏకంగా ఒక ముఠాగా ఏర్పడ్డారు. అమ్మతనం కోసం వెంపర్లాడుతున్న మహిళలు టార్గెట్గా చేసుకొని నీచపు దందాకు తెగబడ్డారు. కోట్ల రూపాయలు సంపాదించారు. డాక్టర్ నమ్రత గ్యాంగ్లో మొత్తం 18 మంది సభ్యులు ఉన్నారు. తల్లితనం కోసం తల్లడిల్లుతున్న వారిని టార్గెట్ చేసుకుని.. IVF పేరుతో ఆ తర్వాత సరోగసీ పేరుతో…
Khazana Jewellery : సాధారణంగా దొంగతనాలు అర్ధరాత్రి దాటాకే జరుగుతుంటాయి. కానీ ఈసారి హైదరాబాద్లో దోపిడీ దొంగలు రూట్ మార్చారు. అర్ధరాత్రి తాళాలు పగలగొట్టడం లేదా గోడలకు కన్నాలు పెట్టడం..లాంటివి రిస్క్ అనుకున్నారో ఏమో.. తెల్లవారి షాపు తెరిచిన వెంటనే లోపలికి చొరబడ్డారు. నిజానికి భారీగా బంగారు ఆభరణాలు దోచుకుందామని జువెలరీ షాపుకు వచ్చారు. కానీ వారికి వెండి ఆభరణాలు తప్ప మరేమీ దొరకలేదు. తుపాకులతో కొద్దిసేపు హడావుడి చేసి వెళ్లిపోయారు. ఉదయం 10:30 గంటల సమయం..…
Multi Level Parking : హైదరాబాద్ వాసులను ఏళ్లుగా ఇబ్బంది పెడుతున్న వాహనాల పార్కింగ్ సమస్యకు త్వరలోనే పరిష్కారం రానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో నాంపల్లి హృదయభాగంలో అత్యాధునిక మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి కావొచ్చింది. ఈ సౌకర్యం ప్రారంభమైతే నగర కేంద్ర ప్రాంతంలో పార్కింగ్ సమస్యలకు శాశ్వతంగా చెక్ పడనుంది. సుమారు రూ.100 కోట్ల వ్యయంతో, పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించిన ఈ కాంప్లెక్స్ దేశంలోనే తొలిసారిగా జర్మన్ పాలిస్ పార్కింగ్…
Cyberabad Traffic Police Issues Heavy Rain Alert for Hyderabad: అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో గత 5-6 రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీగా వానలతో దాదాపుగా అన్ని జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వరదలకు చెరువులు, జలాశయాలు నిండిపోయాయి. మరోవైపు రహదారులపై వరద చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. భారీ వర్షాలకు హైదరాబాద్ నగర వ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. ప్రయాణికులు గంటల పాటు ట్రాఫిక్లో చిక్కుకుపోతున్నారు. ఈరోజు హైదరాబాద్లో భారీ…
Hydra Marshals Comments on Salary Cuts: హైడ్రా మార్షల్స్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వేతనాలు తగ్గించడంతో ఆగ్రహించిన మార్షల్స్.. నేడు తమ విధులను బహిష్కరించారు. దాంతో హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎమర్జెన్సీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎమర్జెన్సీ సేవలు నిలిచిపోవడంతో పాటు 51 హైడ్రా వాహనాలు కూడా ఆగిపోయాయి. నగరంలోని 150 డివిజన్లలో హైడ్రా సేవలకు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. విధుల బహిష్కరణపై మార్షల్స్ స్పందించారు. తమ డైరెక్టర్ జనరల్ ఆదేశాల ప్రకారం…
Hydra Marshals Strike in Hyderabad After Salary Cut: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ (హైడ్రా)లోని మార్షల్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జీతాలు తగ్గించడంతో మార్షల్స్ విధులను బహిష్కరించారు. విధుల బహిష్కరణతో మాన్సూన్ ఆపరేషన్పై ప్రభావం పడింది. హైడ్రా కంట్రోల్ రూమ్ సేవలకు అంతరాయం కలిగింది. ట్రైనింగ్ కార్యక్రమం, ప్రజావాణి సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ స్థలాలు, చెరువుల పరిరక్షణకు హైడ్రా కృషి చేస్తున్న విషయం తెలిసిందే. గత నెల 23న…
రాఖీ పండుగ....గులాబీ పార్టీ ఇంటి గుట్టును బజారున పడేలా చేసిందా ? ఈ పండుగకైనా ఇంటి మనుషులు కలుస్తారేమో అనుకున్న క్యాడర్కి...నిరాశే మిగిలిందా ? ఎన్టీవీ వేదికగా రాఖీ కట్టడానికి సిద్ధమని చెల్లెలు చెప్పినా...అన్నయ్య మాత్రం అందుకు ససేమిరా అన్నారా ? అన్నాచెల్లెళ్ల వ్యవహారశైలి...తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్టాపిక్గా మారింది. ఇద్దరి మధ్య వార్ పీక్ స్టేజ్కి చేరుకుందా ?