హైదరాబాద్ లో 4 గంటలపాటు వర్షం దంచికొట్టింది. ఉరుములు, మెరుపులతో కూడిన వానతో నగరవాసులను వణికించింది. అంతేకాకుండా రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. లంగర్ హౌస్ కుతుబ్ షాహీ మజీద్ పై పిడుగుపడింది. దీంతో మజీద్ పైన ఉన్న కలుషం కింద పడిపోయింది. అంతేకాకుండా మజీద్ గోడ పగుళ్లు వచ్చాయి. సంఘటన స్థలంలో ఎవరూ లేకపోవడంతో ఎవరికి ఎలాంటి హాని జరగలేదు.
Hyderabad Gold Idli: హైదరాబాద్ అనగానే మనకు బిర్యానీ, హలీమ్ వంటి ఎన్నో ప్రత్యేక వంటకాలు గుర్తొస్తాయి. ఇక్కడి వంటకాలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
గ్రూప్-4 అభ్యర్థులకు బిగ్ అలర్ట్. అయితే, జులై 1వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన గ్రూప్-4 పరీక్ష ఫలితాల కోసం అభ్యర్థులు వేచి చూస్తున్నారు. వచ్చేనెల మొదటివారంలో గ్రూప్-4 ప్రాథమిక కీని విడుదల చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు చేస్తుంది. ఆ తర్వాత సుమారు వారం రోజుల పాటు అభ్యంతరాలకు అవకాశం ఇవ్వాలని అనుకుంటుంది.
తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాలు, అనుబంధ హాస్టళ్ల డైట్ ఛార్జీలను పెంచుతూ తెలంగాణ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. డైట్ ఛార్జీల ప్రతిపాదనకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదముద్ర వేశారు. దీంతో పెరిగిన డైట్ ఛార్జీలు జులై నెల నుంచి అమలులోకి వస్తాయని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల్లో ప్రకటించింది. అయితే, 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదివే విద్యార్థులకు నెలకు రూ. 950 నుంచి రూ.1,200లకు, 8వ తరగతి నుంచి 10వ తరగతి వారికి 1,400, ఇంటర్…
సమాజ సేవ చేసేందుకు భార్య చేస్తున్న కృషికి గుర్తింపుగా.. జీవిత భాగస్వామి జీవితంలో రాణించాలని ఓ భర్త చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. హెడ్కానిస్టేబుల్ శిక్షణ ముగించుకుని ఇంటికి వచ్చిన భార్యకు ఊహించని విధంగా భర్త ఘన స్వాగతం పలికాడు. జీవితకాలం గుర్తుండిపోయేలా ఆమె గ్రాంఢ్ వెల్ కమ్ చెప్పాడు.
తెలంగాణ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా మోస్తారు నుంచి భరీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాయత్ సాగర్ ప్రాజెక్టులోని ఆరు గేట్లను అధికారులు ఎత్తేశారు. అయితే, ఇప్పటికే వరద నీరు భారీగా వస్తుండటంతో శుక్రవారం ఈ ప్రాజెక్ట్ లోని రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడిచిపెట్టారు. మూసీ నది పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగులే టార్గెట్ గా ఈ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి.. ఎక్కువ లాభాలు వస్తాయంటూ అత్యాశకు పోయి లక్షల రూపాయలను బాధితులు పోగొట్టుకుంటున్నారు అని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. క్రిప్టో కరెన్సీకి కన్వర్ట్ చేసుకొని నగదు తీసుకుంటున్నారు. బాయ్ లో ఉన్న నలుగురు ఒక్కో డాలర్ పైన పది రూపాయలు లాభం తీసుకొని చైనీయులకు పంపిస్తున్నారని హైదరాబాద్ కమిషనర్ చెప్పారు. హిజ్బుల్లా టెర్రర్ మాడ్యులర్ వాళ్ళకు ఈ నగదు లావాదేవీలు జరుపుతున్న వారికి లింకులు…
Cyber Fords hyderabad: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు పదే పదే హెచ్చరిస్తున్నా ప్రజల్లో మాత్రం అవగాహన రావడం లేదు. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని మోసపోతూనే ఉన్నారు.