Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Investment Scams Through Telegram And Whatsapp

CV Anand: తస్మాత్ జాగ్రత్త.. టెలిగ్రామ్‌, వాట్సాప్‌ల ద్వారా పెట్టుబడి మోసాలు!

Published Date :July 22, 2023 , 3:46 pm
By NTV WebDesk
CV Anand: తస్మాత్ జాగ్రత్త.. టెలిగ్రామ్‌, వాట్సాప్‌ల ద్వారా పెట్టుబడి మోసాలు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

చైనా కేంద్రంగా పెట్టుబడులు పేరుతో భారీ మోసం జరుగుతుందని హైదరాబాద్ సీపీ ఆనంద్ తెలిపారు. చిక్కడపల్లికి చెందిన బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ముఠాను పట్టుకున్నామని ఆయన తెలిపారు. టెలిగ్రామ్ యాప్ ద్వారా రేట్ అండ్ రివ్యూ పేరుతో పార్ట్ టైం జాబ్ ఆఫర్ వచ్చింది బాధితుడికి.. ట్రావెలింగ్ బూస్ట్ 99.కామ్ లో బాధితుడు రిజిస్టర్ చేసుకున్నాడు.. ఈ వెబ్సైట్ ద్వారా బాధితుడికి ఐదు టాస్కులు ఇచ్చారు. వెయ్యి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 866 రూపాయలు ప్రాఫిట్ వస్తుందని నమ్మిస్తున్నారు. అయితే, ఆన్లైన్ విండోలో చూపించిన అమౌంట్ ను బాధితుడు విత్ డ్రా చేసుకోవడానికి వీలు లేకుండా లాక్ చేసి.. బాధితుడి దగ్గర నుంచి రూ.28 లక్షలను కొట్టేశారు.. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చిందని సీపీ ఆనంద్ పేర్కొన్నాడు.

Read Also: Guntur Kaaram: సినిమా నుంచి సినిమాటోగ్రాఫర్ అవుట్

ఈ రాధిక మార్కెటింగ్ అకౌంటు హైదరాబాద్ కు చెందిన మహమ్మద్ మున్వర్ మైంటైన్ చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ మొత్తం అకౌంట్లను అహ్మదాబాద్ కు చెందిన ప్రకాశ్ ప్రజాపతి మెయింటెయిన్ చేసేవాడు.. ఈ మొత్తం ఫ్రాడ్ లో చైనాకు చెందిన లుల్యో, నాన్ యే, కెవిన్ జూన్ లు ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఒక్కో అకౌంట్ ఓపెన్ చేసినందుకు రెండు లక్షల రూపాయలను ఈ ముఠా ఇస్తుంది. ఇలా ఒక్క ప్రజాపతే 65 అకౌంట్లను ఓపెన్ చేయించి చైనీయులకు అప్పగించాడు.. వీటి ద్వారా సుమారు 125 కోట్ల రూపాయల నగదు లావాదేవీలు జరిగాయి. ఇతర అకౌంట్ ల నుంచి మరో రూ.584 కోట్ల నగదు బదిలీ జరిగింది అని సీపీ ఆనంద్ తెలిపారు.

Read Also: Extramarital Affair: చెన్నైలో దారుణం..మహిళ ప్రాణం తీసిన అక్రమ సంబంధం..

ఈ కేసులో 17 మొబైల్ ఫోన్లు రెండు ల్యాప్ టాప్స్, 22 సిమ్ కార్డ్స్, నాలుగు డెబిట్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది మహేష్ బ్యాంకుకు సంబంధించిన కేసు చేశాము.. రోజుకి 20 నుంచి 30కి పైగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులు నమోదు అవుతున్నాయి.. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులో చైనాకు సంబంధించిన వాళ్ళు ప్రధాన నిందితులుగా ఉన్నారని హైదరాబాద్ కమిషనర్ ఆనంద్ అన్నారు. టెలిగ్రామ్, వాట్సాప్ లో ద్వారా పెట్టుబడి ఫ్రాడ్ లకు పాల్పడుతున్నారని గుర్తించామని సీపీ తెలిపారు. 15 వేల మంది మోసపోయారు.. ఒక్కొక్కరు 5 లక్షల వరకు మోసపోయారు అని హైదరాబాద్ సీపీ పేర్కొన్నారు.

Read Also: Governor Abdul Nazeer: విద్యను సమాజ హితం కోసం వినియోగించాలి..

సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగులే టార్గెట్ గా ఈ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి.. ఎక్కువ లాభాలు వస్తాయంటూ అత్యాశకు పోయి లక్షల రూపాయలను బాధితులు పోగొట్టుకుంటున్నారు అని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. క్రిప్టో కరెన్సీకి కన్వర్ట్ చేసుకొని నగదు తీసుకుంటున్నారు. బాయ్ లో ఉన్న నలుగురు ఒక్కో డాలర్ పైన పది రూపాయలు లాభం తీసుకొని చైనీయులకు పంపిస్తున్నారని హైదరాబాద్ కమిషనర్ చెప్పారు. హిజ్బుల్లా టెర్రర్ మాడ్యులర్ వాళ్ళకు ఈ నగదు లావాదేవీలు జరుపుతున్న వారికి లింకులు ఉన్నాయి. ఈ మోసంలో జరిగే నగదు లావాదేవీలు డబ్బులు ఉగ్రవాదులకు వెళ్తున్నాయని సీవీ ఆనంద్ అన్నారు. సామాన్యుడు వెళ్ళి ఒక్క అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఎన్నో ఇబ్బందులు పెడతారు.. అలాంటిది హైదరాబాద్ కు చెందిన వీరు లక్నో‌వెళ్ళి అక్కడ 65 అకౌంట్లు ఓపెన్ చేశారు.. బ్యాంకులు ఎలా వీటిని ఓపెన్ చేస్తున్నాయో అర్థం కావడం లేదు.. ఉగ్ర లింకులకు సంబంధించి ఎన్ఐఏకు సమాచారం అందించామని హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CV Anand
  • hyderabad
  • Investment scams
  • telegram
  • WhatsApp

తాజావార్తలు

  • Dhurandhar : The Revenge : తెలుగు రాష్ట్రాల్లో ధురందర్ దండయాత్ర.. టికెట్టు ముక్క లేదు

  • Donald Trump: “48 గంటల్లో హోర్ముజ్ తెరవండి.. లేదంటే..” ఇరాన్‌కు ట్రంప్ బిగ్ వార్నింగ్..

  • Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారు ఆస్తుల విషయంలో జాగ్రత్త!

  • Aditya Dhar : హ్యాట్రిక్ హిట్ కొట్టేసిన ఆదిత్యధర్.. ఈ ఇద్దరితో నెక్ట్స్ మల్టీస్టారర్

  • Vijayawada : విజయవాడ యనమలకుదురు శివాలయంలో ఇంటి దొంగలు

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions