Himayatsagar Reservior: పెరిగిన వరద ఉధృతి.. ఆరు గేట్లు ఎత్తివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా మోస్తారు నుంచి భరీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాయత్ సాగర్ ప్రాజెక్టులోని ఆరు గేట్లను అధికారులు ఎత్తేశారు. అయితే, ఇప్పటికే వరద నీరు భారీగా వస్తుండటంతో శుక్రవారం ఈ ప్రాజెక్ట్ లోని రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడిచిపెట్టారు. మూసీ నది పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ నగరంలో వర్షాలు కొనసాగుతుండటంతో హిమాయత్ సాగర్ ఆరు గేట్లను ఎత్తి అదనపు నీటిని విడుదల చేసినట్టు సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి. గేట్లు ఎత్తి 4120 క్యూసెక్కుల నీటిని మూసీ నదిలోకి విడుదల చేశారు.
Read Also: Extramarital Affair: భర్త ఇంట్లో ఉండగానే.. ప్రియుడ్ని ఇంటికి పిలిపించి..
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద ప్రవాహం భారీగా వస్తుండటంతో.. హిమాయత్ సాగర్ జలాశయంకు భారీగా నీరు చేరుతుంది. వరద ప్రవాహం ఎక్కువ ఉండడంతో మరో రెండు క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు అధికారులు రిలీజ్ చేశారు. అయినా.. హిమాయత్ సాగర్ ప్రాజెక్ట్ కు ఇన్ ఫ్లో తగ్గకపోవడంతో మరో ఆరు గేట్ల ద్వారా నీటిని దిగువకు జల మండలి అధికారులు విడుదల చేశారు. హిమాయత్ నగర్ నుంచి రాజేంద్రనగర్ వైపు వెళ్లే ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డును అధికారులు మూసి వేశారు. ఇరువైపుల బారీ కేడ్స్ ను రాజేంద్రనగర్ పోలీసులు ఏర్పాటు చేశారు. దీంతో కింద ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డు మీదకు భారీగా నీటి ప్రవాహం వచ్చింది. సర్వీస్ రోడ్డు మీద ఫుల్ ఫోర్స్ తో నీరు వెళ్తుంది. సర్వీస్ రోడ్డు మీద రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేసి.. వాహనాలు రాకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read Also: Snakes: అల్లుళ్లకు కట్నంగా స్నేక్ రాజాలు.. అదే వారి ఆచారం..!
చార్మినార్, ఖైరతాబాద్, కూకట్ పల్లి, ఎల్బీనగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లిలో ఈ నెల 24 వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. పలు చోట్ల భారీ వర్షాలు సైతం కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. హిమాయత్ సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తిన తర్వాత మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇదిలా ఉండగా, రాగల 24 గంటల్లో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెదర్ డిపార్ట్మెంట్ రెడ్ అలర్ట్ ప్రకటించింది. తెలంగాణతో పాటు హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ప్రకటించారు. అయితే, హైదరాబాద్ కు ఆరెంజ్, రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు హైదరాబాద్ వాతావరణశాఖ డైరెక్టర్ నాగరత్నం తెలిపారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!