డ్రగ్స్ కు అలవాటు పడి అమ్మకం దారుగా మారిన 24 సంవత్సరాల లీలా కృష్ణ అనే యువకుడు.. ఎవరికి ఏ రకమైన డ్రగ్ కావాలన్నా సప్లై చేసే స్థాయికి ఎదిగాడు. ఇప్పటికే మూడుసార్లు డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడిన లీలా కృష్ణ గురువారం నాలుగోసారి ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళితే.. నిజాంపేట కుశాల్ పార్క్ హై టెన్షన్ లైన్ రోడ్డులో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం మేరకు ఎక్సైజ్ ఎస్ టీ ఎఫ్ సీఐ నాగరాజు…
TG High Court: బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహెల్ కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు అయింది. ఈ నెల 16వ తేదీన పంజాగుట్ట పోలీసుల ముందు సాహెల్ హాజరు కావాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
TG Police Dept: హైదరాబాద్ లోని గోషామహల్ పోలీస్ స్టేడియంలో ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్ మెంట్లో ట్రాన్స్ జెండర్ల నియామకాలు కొనసాగుతున్నాయి. తొలిసారిగా సిటీ కమిషనరేట్ పరిధిలో సెలెక్షన్స్ జరిగాయి. గోశామహల్ స్టేడియంలో ట్రాన్స్ జెండర్స్ కి ఈవెంట్స్ నిర్వహించిన అధికారులు.. నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పరిశీలించారు.
Google- Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ కంపెనీతో కీలక ఒప్పందం చేసుకుంది. దేశంలోని మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ (GSEC)ని హైదరాబాద్లో నెలకొల్పేందుకు గూగుల్ ముందుకొచ్చింది. భాగ్యనగరంలో స్థాపించే సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ప్రపంచంలోనే ఐదవది.
Harish Rao: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో తన మీద నమోదైన కేసును కొట్టివేయాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పిటిషన్ దాఖలు చేశారు.
HYDRA : హైడ్రా (హైదరాబాద్ డెవలప్మెంట్ అండ్ రిసోర్స్ అథారిటీ) పబ్లిక్ ఆస్తుల పరిరక్షణలో పౌరులను భాగస్వామ్యం చేసే లక్ష్యంతో ఒక ముఖ్యమైన కొత్త కార్యక్రమాన్ని ప్రకటించింది. ఆక్రమణలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రజా ఫిర్యాదుల వ్యవస్థను ఏర్పాటు చేస్తామని హైడ్రా చీఫ్ రంగనాథ్ వెల్లడించారు. వచ్చే ఏడాది నుంచి ప్రతి సోమవారం బుద్ధ భవన్లో ఫిర్యాదులను స్వీకరించనున్నారు. Hebah Patel: పింక్ చీరలో కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్న హెబ్బా పటేల్ ప్రభుత్వ భూములు, సరస్సులు, కాలువలు, ఉద్యానవనాలపై…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట తీరు, వ్యవహార శైలి గతానికంటే కాస్త భిన్నంగా కనిపిస్తోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. మహబూబ్నగర్ రైతు పండుగ వేదిక నుంచి మొదలుకుని.. తాజాగా జరిగిన సభల వరకు ఆయన ప్రసంగం చూస్తుంటే .. వ్యూహం మారినట్టు కనిపిస్తోందన్నది వారి మాట. శనివారం నిర్వహించిన రైతు పండుగ సభలో చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారాయన. రైతులకి ఏం చేస్తున్నాం.. ఏం చేయబోతున్నామని చెబుతూనే.. ప్రతిపక్షాలకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
Shivam Dube – SKY: నేడు (డిసెంబర్ 3)న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై, సర్వీసెస్ మ్యాచ్ జరిగింది. ఇందులో ముంబై 39 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్లో ప్రత్యర్థి బౌలర్లను చిత్తు చేస్తూ సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే అర్ధ సెంచరీలతో ఇన్నింగ్స్ ఆడారు. ఒకవైపు భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 46 బంతుల్లో 70 పరుగుల ఇన్నింగ్స్ ఆడగా, దూబే కేవలం 37 బంతుల్లో 71 పరుగులతో…