Minister Seethakka: విధుల్లో ఎలాంటి అలసత్వం ఉండకూడదు.. టార్గెట్ రీచ్ కావాలి
- మధురానగర్లోని మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ కార్యాలయంలో..,
- జిల్లా సంక్షేమ అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష సమావేశం
- జిల్లాల వారీగా మహిళా శిశు సంక్షేమ శాఖలో జరుగుతున్న అభివృద్ధి పురోగతిని..,
- పని తీరును, పథకాల అమలును సమీక్షించిన మంత్రి.
హైదరాబాద్ మధురానగర్లోని మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ కార్యాలయంలో జిల్లా సంక్షేమ అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాల వారీగా మహిళా శిశు సంక్షేమ శాఖలో జరుగుతున్న అభివృద్ధి పురోగతిని, పని తీరును, పథకాల అమలును మంత్రి సమీక్షించారు. అంగన్వాడి కేంద్రాల సొంత భవనాల నిర్మాణం, టాయిలెట్ల నిర్మాణం, తాగునీటి కనెక్షన్లు త్వరగా పూర్తి చేయాలని మంత్రి సీతక్క తెలిపారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖలకు తానే మంత్రిగా ఉన్నానని అన్నారు. దీంతో గ్రామ అభివృద్ధి నిధులను అంగన్వాడి కేంద్రాల నిర్మాణం కోసం వెచ్చించే అవకాశం దక్కిందని తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లా సంక్షేమ అధికారి సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సీతక్క సూచించారు.
Thatikonda Rajaiah: అది నాలుకా, తాటి మట్టా.. కడియం వ్యాఖ్యలపై కౌంటర్
Also Read
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
- KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
అంగన్వాడి కేంద్రాల్లో ఎలాంటి చిన్న పొరపాట్లు లేకుండా చూసుకోవాలి.. చిన్నారులే ఈ దేశ భవిష్యత్తు అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. వారిని మంచి పౌరులుగా తీర్చి దిద్దే బాధ్యత అంగన్వాడి టీచర్లదేనన్నారు. అధికారులంతా తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని తెలిపారు. విధుల్లో ఎలాంటి అలసత్వం ఉండకూడదు.. అధికారులంతా టార్గెట్ను రీచ్ కావాలని సూచించారు. త్వరలో జిల్లాలో పర్యటించి సమీక్షలు నిర్వహిస్తానని అన్నారు. సంక్షేమ శాఖలో డీడబ్ల్యూఓ (DWO)లే తమ కలెక్టర్లని తెలిపారు. జిల్లా సంక్షేమానికి మీరే బాసులున్నారు. సమాజంలో పేదలు అత్యంత బలహీనులకు సంక్షేమం అమలు చేసే అవకాశం మీకు దక్కింది.. వారందరినీ మీరు ఆదరించాలని చెప్పారు.
Gun Firing: ముంబైలో విచక్షణారహితంగా కాల్పులు.. ఒకరికి గాయాలు
జిల్లా అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు పెంచాలి.. అంగన్వాడి కేంద్రాల్లో పోషకాహారం చెక్ చేయాలని మంత్రి సూచించారు. నాసిరకం వస్తువులు వస్తే వెంటనే రిజెక్ట్ చేసి సప్లయర్ పై చర్యలు తీసుకోవాలని అన్నారు. పిల్లలలో పోషకాహార లోపాన్ని అధిగమించేలా పనిచేయాలి.. పోషకాహారాన్ని మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన అభిప్రాయాలను తెలియజేయాలని అన్నారు. బడిబాట తరహాలో ప్రజాప్రతినిధులు, అధికారులు అంగన్వాడి బాట చేపట్టాలిని తెలిపారు. అధికారులంతా సమయపాలన పాటించి జిల్లా సంక్షేమాన్ని నిత్యం పర్యవేక్షించాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
-
RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
-
Ukraine: ట్రంప్ను ప్రసన్నం చేసుకునేందుకు ఉక్రెయిన్ మాస్టర్ ప్లాన్!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?