Andhra Pradesh: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు అరెస్ట్..
- పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురక కిషోర్ అరెస్ట్
- హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు
- 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిన తురక కిషోర్
- మాచర్లలో టీడీపీ నేతలపై దాడితో సహా, పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న తురక కిషోర్.
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తురక కిషోర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తురక కిషర్ను ఏపీ పోలీసులు హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం తురక కిషోర్ అజ్ఞాతంలోకి వెళ్లారు. అప్పటినుండి పోలీసుల కళ్ళు కప్పి తిరుగుతున్న కిషోర్ను.. పోలీసులు ఈరోజు హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. మాచర్లలో టీడీపీ నేతలపై దాడితో సహా.. పలు కేసుల్లో తురక కిషోర్ నిందితుడిగా ఉన్నాడు.
Read Also: Bird flu: “బర్డ్ ఫ్లూ”తో 3 పులులు, ఒక చిరుత మృతి.. మహారాష్ట్రలో రెడ్ అలర్ట్..
Also Read
- Ambati Rambabu New Case: అంబటి రాంబాబుకి షాక్.. మరో కేసు నమోదు..
- Palnadu Police Crime: పల్నాడులో క్రిమినల్స్గా మారిపోయిన పోలీసులు.. వరుస ఘటనలు.. తాజాగా లాయర్ హత్య..
- Macharla: ఏకాంతంగా ఉన్న జంటలే టార్గెట్.. వీడియోలతో ఏఎస్ఐ అరాచకాలు..!
- Macherla Police Blackmail: వీడు పోలీసేనా..? లవర్స్ ఏకాంత వీడియోలు తీసి బ్లాక్ మెయిల్.. కోరిక తీర్చాలని వేధింపులు..!
తురక కిషోర్పై ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో టీడీపీ నేతలు బొండా ఉమా, బుద్ధ వెంకన్నలపై మాచర్ల పట్టణంలో దాడి చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. 2022 డిసెంబర్ 16న తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘ఇదేం కర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో టీడీపీ ఇంఛార్జి జూలకంటి బ్రహ్మానందరెడ్డిపై కిషోర్ దాడి చేశాడు. దాడి అనంతరం మాచర్ల పట్టణంలో వైసీపీ నాయకులను వెంటబెట్టుకొని టీడీపీ ఆస్తులను, పార్టీ కార్యాలయం వాహానాలను ధ్వంసం చేసిన ఘటనలలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.
Read Also: Venkatrami Reddy: ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామన్నారు.. ఇప్పటికి ఎలాంటి ప్రకటన లేదు
2024 మే నెలలో జరిగిన సాధారణ ఎన్నికలలో మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజున పలు హింసకాండలో తురక కిషోర్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. రెంటచింతల మండలం పాలువాయి గేటులో పోలింగ్ రోజు అక్కడ ఏజెంట్గా ఉన్న నంబూరు శేషగిరిరావుపై దాడి చేసి గాయపరిచిన సంఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అలాగే మాచర్ల పట్టణం పీడబ్ల్యుడి కాలనీలో టీడీపీ నేత ఎనుముల కేశవరెడ్డి ఇంటిపై విధ్వంసానికి పాల్పడి పలువురిని గాయపరిచిన సంఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. పోలింగ్ మరుసటి రోజు కారంపూడి పట్టణంలో సీఐ నారాయణస్వామి పై దాడి, టీడీపీ కార్యాలయం విధ్వంసం, తెలుగుదేశం నాయకుల వాహనాలు ధ్వంసం చేసిన కేసులో తురక కిషోర్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.
తాజావార్తలు
-
రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
-
MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!