Andhra Pradesh: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు అరెస్ట్..
- పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురక కిషోర్ అరెస్ట్
- హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు
- 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిన తురక కిషోర్
- మాచర్లలో టీడీపీ నేతలపై దాడితో సహా, పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న తురక కిషోర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తురక కిషోర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తురక కిషర్ను ఏపీ పోలీసులు హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం తురక కిషోర్ అజ్ఞాతంలోకి వెళ్లారు. అప్పటినుండి పోలీసుల కళ్ళు కప్పి తిరుగుతున్న కిషోర్ను.. పోలీసులు ఈరోజు హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. మాచర్లలో టీడీపీ నేతలపై దాడితో సహా.. పలు కేసుల్లో తురక కిషోర్ నిందితుడిగా ఉన్నాడు.
Read Also: Bird flu: “బర్డ్ ఫ్లూ”తో 3 పులులు, ఒక చిరుత మృతి.. మహారాష్ట్రలో రెడ్ అలర్ట్..
Also Read
- CM Chandrababu: రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
- Ambati Rambabu New Case: అంబటి రాంబాబుకి షాక్.. మరో కేసు నమోదు..
- Palnadu Police Crime: పల్నాడులో క్రిమినల్స్గా మారిపోయిన పోలీసులు.. వరుస ఘటనలు.. తాజాగా లాయర్ హత్య..
తురక కిషోర్పై ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో టీడీపీ నేతలు బొండా ఉమా, బుద్ధ వెంకన్నలపై మాచర్ల పట్టణంలో దాడి చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. 2022 డిసెంబర్ 16న తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘ఇదేం కర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో టీడీపీ ఇంఛార్జి జూలకంటి బ్రహ్మానందరెడ్డిపై కిషోర్ దాడి చేశాడు. దాడి అనంతరం మాచర్ల పట్టణంలో వైసీపీ నాయకులను వెంటబెట్టుకొని టీడీపీ ఆస్తులను, పార్టీ కార్యాలయం వాహానాలను ధ్వంసం చేసిన ఘటనలలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.
Read Also: Venkatrami Reddy: ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామన్నారు.. ఇప్పటికి ఎలాంటి ప్రకటన లేదు
2024 మే నెలలో జరిగిన సాధారణ ఎన్నికలలో మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజున పలు హింసకాండలో తురక కిషోర్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. రెంటచింతల మండలం పాలువాయి గేటులో పోలింగ్ రోజు అక్కడ ఏజెంట్గా ఉన్న నంబూరు శేషగిరిరావుపై దాడి చేసి గాయపరిచిన సంఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అలాగే మాచర్ల పట్టణం పీడబ్ల్యుడి కాలనీలో టీడీపీ నేత ఎనుముల కేశవరెడ్డి ఇంటిపై విధ్వంసానికి పాల్పడి పలువురిని గాయపరిచిన సంఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. పోలింగ్ మరుసటి రోజు కారంపూడి పట్టణంలో సీఐ నారాయణస్వామి పై దాడి, టీడీపీ కార్యాలయం విధ్వంసం, తెలుగుదేశం నాయకుల వాహనాలు ధ్వంసం చేసిన కేసులో తురక కిషోర్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.
తాజావార్తలు
-
YS Jagan: పీఎస్కు వెళ్లాలంటే భయపడే పరిస్థితి.. జగన్ సంచలన వ్యాఖ్యలు
-
UK Roads Melt at 40°C: 40°Cకే UK రోడ్లు కరుగుతుంటే.. 45°C దాటినా తట్టుకుంటున్న భారతీయ రోడ్లు.. ఆసక్తికరమైన కారణాలు
-
Varanasi : ‘వారణాసి’ వార్ సీన్స్.. మైండ్ బ్లోయింగ్ అంతే
-
Ayodhya: “వాష్రూమ్లలో డబ్బు దాచాం”.. అయోధ్య కేసులో నిందితుడు బయటపెట్టిన సంచలన నిజాలు
-
Yadagirigutta: మెగా ఫ్యామిలీకి గుడ్ న్యూస్.. యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డులో కొనిదెల సురేఖకు చోటు
ట్రెండింగ్
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!