Punishment For Drunk And Drive: మద్యం మత్తులో కారు నడిపి రోడ్డు ప్రమాదానికి కారణమైన ఓ యువకుడు, అతని స్నేహితురాలికి జడ్జి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ఇందుకు సంబంధించి పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, వెస్ట్మారేడుపల్లి సుమన్ హౌసింగ్ కాలనీలో నివసించే 27 ఏళ్ల తీగుళ్ల దయా సాయిరాజ్ (27), ఆయన స్నేహితురాలు గత నెల ఫిలింనగర్లో జరిగిన ఓ విందులో మద్యం తాగారు. ఆ తర్వాత అర్ధరాత్రి 2.30 గంటలకు, దయా…
Sewerage Overflow Free City : హైదరాబాద్ నగరంలో సీవరేజీ సమస్యలను పరిష్కరించేందుకు జలమండలి చేపట్టిన 90 రోజుల స్పెషల్ డ్రైవ్ నేటితో విజయవంతంగా ముగిసింది. గాంధీ జయంతి రోజున సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. 90 రోజులుగా నిర్విరామంగా సాగిన ఈ డ్రైవ్ ద్వారా నగరంలోని 17,050 ప్రాంతాల్లో 2,200 కిలోమీటర్ల సీవరేజీ పైపులైన్, 1.75 లక్షల మ్యాన్ హోళ్లను శుభ్రం చేశారు. ఈ చర్యల…
CMR College: హైదరాబాద్లోని CMR కాలేజ్ హాస్టల్ వద్ద విద్యార్థి సంఘాల వల్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థుల సమస్యలను తెలుసుకోవాలని వచ్చిన NSUI (నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా) విద్యార్థి సంఘ నాయకులు, కాలేజ్ యాజమాన్యంతో గొడవకు దిగారు. గర్ల్స్ హాస్టల్ లోపలికి అనుమతి లేకుండా ఎలా వెళ్ళారని సిబ్బంది ప్రశ్నించడంతో విద్యార్థి సంఘాల నాయకులు సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. నిన్నటి సంఘటనతో గర్ల్స్ హాస్టల్ లో భయాందోళనకు గురైన విద్యార్థులు, తల్లిదండ్రులకు సమాచారం…
Drunk Man: హైదరాబాద్లో న్యూ ఇయర్ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఇక మందుబాబులైతే బాగా చుక్కేసి చిందులు వేసినట్లు తెలుస్తోంది. ఐటీ కారిడార్లో మాత్రం ఆడా, మగా అనే తేడా లేకుండా ఫుల్లుగా మద్యం తాగి రోడ్లపై విచ్చలవిడిగా సంచరిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి.
Food Safety Rides: హైదరాబాద్ నగరంలోని కొంపల్లిలో వివిధ రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు జరుపగా, కొన్ని రెస్టారెంట్లు ఫుడ్ సేఫ్టీ నిబంధనలను పాటించడం లేదని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఉలవచారు, మల్నాడు కిచెన్, ట్రైన్ థీమ్ రెస్టారెంట్ లలో తనిఖీలు నిర్వహించారు అధికారులు. ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఈ రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించిన తర్వాత నిబంధనలను పూర్తిగా అనుసరించడం లేదని అధికారులు తెలిపారు. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో పాటు, కొన్ని రెస్టారెంట్లలో కంట్రోల్డ్…
హైదరాబాద్ నగరంలో వాహనదారులను లిఫ్ట్ అడిగి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు ఇద్దరు కిలాడీ లేడీలు.. ఆ మహిళలను లాలాగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మల్కాజ్గిరి ప్రాంతానికి చెందిన భాగ్య, సఫీల్గూడకు చెందిన వెన్నెల బంధువులు. గత కొంతకాలంగా వీరు వాహనాలపై వెళ్తున్న వారిని లిఫ్ట్ అడిగి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. నేడు ఖాజాగూడ భగీరథమ్మ చెరువులో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. చెరువు బఫర్ జోన్లోని నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. బఫర్ జోన్లోని 4 ఎకరాల ఖాళీ స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్ను హైడ్రా కూల్చివేసింది. ఆ స్థలంలో ఉన్న వైన్స్ను తక్షణమే ఖాళీ చేయాలంటూ హైడ్రా అధికారులు ఆదేశించారు. కూల్చివేతల సందర్భంగా అధికారులకు భారీ బందోబస్తు చేపట్టారు. ఇటీవల భగీరథమ్మ చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. భగీరథమ్మ చెరువు…
మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ప్రతాప సింగారం గ్రామంలో భార్య నిహారిక (35)ను భర్త శ్రీకర్ రెడ్డి బండ రాయితో తలపై కొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. శ్రీకర్ రెడ్డి అయ్యప్ప మాలలో ఉండడం విశేషం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిహారిక బాడీని గాంధీ మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. బోడుప్పల్ టెలీఫోన్ కాలనీకి చెందిన నిహారికకు…
Traffic Rules In Hyderabad: హైదరాబాద్ నగరంలో రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించాలని పోలీసులు నిర్ణయించారు. ఈ సమయంలో నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ పునరుద్ధరణ చర్యలు అమలు చేయనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఆంక్షలలో, మూడు కమిషనరేట్ల పరిధిలోని అన్ని ఫ్లైఓవర్లు మూసివేయడం, బేగంపేట్ టోవ్లీచౌకి ఫ్లైఓవర్ సహా ఇతర ఫ్లైఓవర్లను కూడా మూసివేయడంచేయనున్నారు. అయితే, పీవీ ఎక్స్ప్రెస్ వే పై ఎయిర్పోర్టుకు…
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా హైదరాబాద్ నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మంగళవారం రాత్రి 11గంటల నుండి ఉదయం 5గంటల వరకు వాహనాల పోకల్ని నిషేధిస్తూ ఓఆర్ఆర్, ఫ్లైఓవర్లు మూసివేయనున్నారు. భారీ వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. టాక్సీ, ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ తప్పనిసరి. బార్లు, పబ్బులు, క్లబ్లు నిబంధనలు పాటించాలని సూచించారు.