Transport Officer: NTVతో రంగారెడ్డి జిల్లా ఉప రవాణా శాఖ అధికారి సదానందం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై గత మూడో రోజులుగా తనిఖీలు కొనసాగిస్తున్నామని తెలిపారు.
హైదరాబాద్ పట్టణ పరిధిలోని ప్రధాన బస్ స్టాప్ల దగ్గర జనం బస్సుల కోసం నిరీక్షిస్తున్నారు. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండల పరిధిలోని పంతంగి , కేతేపల్లి మండల పరిధిలోని కొర్లపహాడ్ టోల్ ప్లాజాల దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
RTA Raids: రంగారెడ్డి జిల్లా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై మూడో రోజు రవాణా శాఖ దాడులు కొనసాగుతున్నాయి. రాజేంద్రనగర్- ఆరంఘర్ చౌరస్తా దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారుల కొరడా ఝలిపిస్తున్నారు.
Fraud: తెలంగాణలో పెట్టుబడుల పేరుతో ఘరానా మోసం చోటు చేసుకుంది. GBR పేరుతో నకిలీ వెబ్ సైట్ తో పెట్టుబడుల ఆశతో.. వాట్సాప్ గ్రూపుల ద్వారా లాభాలు అంటూ ప్రచారాలు చేశారు. క్రిప్టో కరెన్సీ పెట్టుబడులు అంటూ అత్యధిక లాభాలు అంటూ 43 మందికి పైగా టోకరా పెట్టారు.
దానం నాగేందర్... గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో ఆయనది డిఫరెంట్ పొలిటికల్ స్టైల్. అధికారం ఎక్కడుంటే అక్కడ వాలిపోవడం అలవాటని చెప్పుకుంటారు. పార్టీలు, లాయల్టీలు జాన్తానై.. పని జరగడమే మనకు ముఖ్యం అన్నట్టుగా ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. ఎథిక్స్, యాలక్కాయలు తర్వాత సంగతి.... ముందు మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోవాల్రా భై... అంటారన్నది కాంగ్రెస్ వర్గాల్లో ఆయన మీదున్న అభిప్రాయం అట. అందుకు తగ్గట్టే... తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అప్పటిదాకా వేసుకున్న కాంగ్రెస్ కండువాను పక్కన పడేసి...…
టెక్నాలజీని వాడుకుని మోసాలకు పాల్పడే వారి సంఖ్య పెరిగిపోయింది. సోషల్ మీడియా యాప్స్ ద్వారా ఫ్రాడ్ చేస్తూ అమాయకులను నట్టేట ముంచేస్తున్నారు కేటుగాళ్లు. ఈజీమనికి అలవాటు పడి సరికొత్త ఎత్తుగడలతో మోసం చేస్తూ ఖాతాలు ఖాళీ చేస్తున్నారు.
గోషామహల్లో చాక్నావాడి నాళా మరోసారి కుంగింది. కుంగిన సమయం అర్ధరాత్రి కావడంతో పెను ప్రమాదం తప్పింది. దారుసల్లాం నుండి చాక్నావాడి వెళ్లే దారి మధ్యలో సివరేజి నాళా కుంగిపోయింది. ఇప్పటికే గతంలో రెండు సార్లు ఈ నాళా కుంగింది. గతంలో కుంగిన నాళా నిర్మాణ పనులకు కోసమని రీడిమిక్స్ లారీ అక్కడకు వచ్చింది.
CM Revanth Reddy : హైటెక్ సిటీలో CII జాతీయ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ CII గ్రీన్ బిజినెస్ సెంటర్లో సమావేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని హైదరాబాద్ లో నిర్వహించడం సంతోషమన్నారు. తెలంగాణ ఏర్పడి దశాబ్దం గడుస్తోంది… తెలంగాణ అభివృద్ధికి సంబంధించి మాకో కల ఉంది.. అదే తెలంగాణ రైజింగ్ అని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్…
Formula E Race Case : ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో హెచ్ఎండీఏ (HMDA) మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్రెడ్డి (BLN Reddy) ఈ రోజు ఏసీబీ కార్యాలయానికి హాజరయ్యారు. శుక్రవారం జరిగే విచారణలో, బీఎల్ఎన్ రెడ్డి నుండి హెచ్ఎండీఏ నిధులను ఫార్ములా ఈ ఆపరేషన్స్ (FEO) సంస్థకు బదిలీ చేసిన అంశంపై ఏసీబీ తన విచారణను కొనసాగించనుంది. ఈ విచారణలో బీఎల్ఎన్ రెడ్డి పై ప్రశ్నలు సంధించడానికి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్…
HYDRA : తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్రంలోని చెరువులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా ఈ ప్రక్రియ ద్వారా అక్రమ కబ్జాలపై బుద్ధి చూపిస్తుంది. గత కొన్ని నెలల్లో, చెరువులపై కబ్జాలు చేయడంపై కఠిన చర్యలు తీసుకోవడంతో, వందల ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని, అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. తాజాగా, నెక్నాంపూర్ చెరువులో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని నిర్ణయించారు. అయితే శుక్రవారం.. మణికొండలోని నెక్నాంపూర్ చెరువులో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ హైడ్రా…