Road Accident: కొంప ముంచిన ఓవర్ స్పీడ్.. ముగ్గురు మైనర్ల దుర్మరణం
- కొంప ముంచిన ఓవర్ స్పీడ్.
- హైదరాబాద్ లోని ప్లైఓవర్పై ఘోర రోడ్డు ప్రమాదం
- ప్రమాదంలో ముగ్గురు మైనర్లు దుర్మరణం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Road Accident: ఓవర్ స్పీడింగ్ కారణంగా హైదరాబాద్ లోని బహుదూర్ పుర్ నుంచి ఆరంఘర్ వెళ్లే కొత్త ప్లైఓవర్పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మైనర్లు ప్రాణాలు కోల్పోయారు. బహదూర్ పూరాకు చెందిన మైనర్లు మాస్ ఖాద్రీ, మహ్మద్ అహ్మద్, మరో బాలుడు బైక్పై ఆరంఘర్ వైపు వెళ్తుండగా శివరాంపల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది. బైక్ అధిక వేగంతో ముందుకు దూసుకుపోవడంతో అదుపు తప్పి ముందుగా ఎలక్ట్రిక్ పోల్ను ఢీ కొట్టింది. ఆ తర్వాత డివైడర్ను ఢీ కొట్టడంతో ముగ్గురు రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో ఇద్దరు మైనర్లు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలతో ఉన్న మరో మైనర్ బాలుడిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, మార్గం మధ్యలో అతడు కూడా మృతి చెందాడు.
Also Read: IAS Officers Transfer: మధ్యప్రదేశ్ లో 42 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
ఈ ప్రమాదం మృతుల కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది. మాస్ ఖాద్రీ, మహ్మద్ అహ్మద్ కుటుంబ సభ్యులు తమ కొడుకులను కోల్పోవడంతో కన్నీటిపర్యంతమయ్యారు. వీరి మరణంతో బహదూర్ పూరా ప్రాంతంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసుల ప్రకారం, ప్రమాదానికి మితిమీరిన వేగం, త్రిబుల్ రైడింగ్ ప్రధాన కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అనుమతించని రీతిలో ముగ్గురు ఒకే బైక్పై ప్రయాణించడం ప్రమాదాన్ని మరింత తీవ్రతరం చేసింది. ప్రమాదానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫ్లైఓవర్పై ట్రాఫిక్ నియంత్రణ కోసం మరింత కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Also Read: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అధిక వేగంతో ప్రయాణించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. రోడ్డు భద్రతకు ప్రాధాన్యత ఇచ్చి, యువత తమ జీవితాలను ప్రమాదంలో పడేయకుండా ఉండాలని సూచించారు. ఈ ఘటన నగర వాసులందరికీ ఒక గుణపాఠం.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!