కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నిక నామినేషన్ పర్వం ముగిసింది. మొత్తం 26 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసారు. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్ వేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ మరోసారి నామినేషన్ దాఖలు చేసారు. ఆ గెల్లు శ్రీనివాస్ వెంట నామినేషన్ కేంద్రానికి మంత్రి హరీష్ రావు వచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి బలు మూరి వెంకట్ నామినేషన్ దాఖలు చేయగా అతని వెంట నామినేషన్ కు కేంద్రానికి వచ్చారు కాంగ్రెస్ నాయకులు…
హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. ఈ ఎన్నికను బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోరు రసవత్తరంగా మారింది. కురుక్షేత్రాన్ని తలపించేలా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు పోటీ పడుతున్నాయి. అయితే కాంగ్రెస్ ఈ రేసులో బాగా వెనుకబడినట్లు కన్పిస్తోంది. దీంతో త్రిముఖ పోటీ కాస్తా ద్విముఖ పోటీగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే కాంగ్రెస్ ఏ క్షణానైనా పుంజుకునే అవకాశం ఉందని ఆపార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈనెల తొలివారం…
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వీణవంక మండలం గన్ముకుల గ్రామంలో తెరాసా అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ… ఉద్యోగాలను భర్తీ చేయలేని ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం, రైల్వే వంటి సంస్థలలో కూడా ఇంతవరకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. పన్నుల మీద పన్నులు వేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. ఆ బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధర పెట్రోల్ ధరలు పెంచుతుంది. తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి. నన్ను గేల్పిస్తే స్థానికంగా అందుబాటులో ఉండి…
హుజురాబాద్లో ఉప ఎన్నికల వాతావరణం హీటెక్కిస్తోంది… ఇప్పటికే అధికార పార్టీకి చెందిన అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ దాఖలు చేయగా… మరో రెండు ప్రధాన పార్టీలు కూడా రంగంలోకి దిగాయి… బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్థిగా బలమూరి వెంకట్ రేపే నామినేషన్ దాఖలు చేయనున్నారు.. రేపు ఈటల రాజేందర్ నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పలువురు నేతలు,…
హుజూరాబాద్ ఉప ఎన్నిక హోరాహోరీగా జరుగడం ఖాయంగా కన్పిస్తోంది. ప్రచారంలో టీఆర్ఎస్, బీజేపీ ఢీ అంటే ఢీ అన్న రీతిలో దూసుకెళుతున్నాయి. ఎవరికీవారు తగ్గెదేలే అన్నట్లుగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం ఇంకా మైదానంలోకి దిగనట్లే కన్పిస్తోంది. పోలింగ్ తేదికి మరో 23రోజులే ఉన్నా కాంగ్రెస్ మాత్రం జోరు చూపించడం లేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఆపార్టీ నేతలతీరు ఉంది. దీంతో అసలు కాంగ్రెస్ రేసులో ఉందా? లేదంటే సైడ్ అయిందా?…
హుజురాబాద్లో బీజేపీ తరఫున ప్రచారానికి జాతీయ నాయకులు వస్తారా.. లేదా? EC ఆంక్షలు చూశాక కమలనాథులు మార్చిన వ్యూహం ఏంటి? అనుకున్నదొక్కటీ.. అయ్యిందొక్కటా? బీజేపీ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి? బీజేపీ నేతల దూకుడికి ఈసీ ఆంక్షలు బ్రేక్..! ఉపఎన్నిక షెడ్యూల్ రాకమునుపే హుజురాబాద్లో ప్రచారం ప్రారంభించింది బీజేపీ. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిశాక.. ప్రచారాన్ని మరో అంకానికి తీసుకెళ్లే పనుల్లో ఉన్నారు కమలనాథులు. రాష్ట్రస్థాయి నాయకులు.. సీనియర్ నేతలు.. పార్టీ కేడర్ ఇప్పటికే నియోజకవర్గంలో మోహరించాయి.…
హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయ వేడిరాజుకుంటోంది. రోజురోజుకు రాజకీయ సమీకరణాలు మారుతోన్నాయి. టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య హోరాహోరీ ఫైట్ నడుస్తోంది. ఎవరికీ వారు పై చేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా ఓటరు నాడి మాత్రం అంతుచిక్కడం లేదు. ఓటర్లు ఏ పార్టీ మొగ్గుచూపుతారన్నది ఇప్పటీకీ క్లారిటీ రావడం లేదు. పోలింగ్ తేది వరకు ఈ సస్పెన్స్ కొనసాగేలా కన్పిస్తుంది. దీంతో ఇక్కడ ఎవరు విజయం సాధిస్తారనేది మాత్రం ముందుగానే ఊహించడం కష్టంగా మారుతోంది.…
హుజురాబాద్ ఉపఎన్నికలో గెలుపుకోసం అధికారపార్టీ వ్యూహ రచన చేస్తుంటే.. మరోవైపు పార్టీలోని ఇద్దరు నేతల మధ్య పంచాయితీ కలవర పెడుతోందట. ఆ ఇద్దరూ కొత్తగా గులాబీ కండువా కప్పుకున్నవాళ్లే కావడంతో.. వారి అంతర్గత విభేదాలు టీఆర్ఎస్ శ్రేణులకు ఇబ్బందిగా మారాయట. ఒకే వరలో రెండు కత్తులు ఇమడలేవన్నట్టుగా చిటపటలాడుతున్నాట. వారెవరో.. లెట్స్ వాచ్..! ఎడముఖం పెడముఖంగా కౌశిక్రెడ్డి, ఇ.పెద్దిరెడ్డి..? హుజురాబాద్ ఉపఎన్నిక కాకమీద ఉంది. నియోజకవర్గంలో కులాలు, సంఘాలు, సంస్థల ఆత్మీయ సమ్మేళనాలపై టీఆర్ఎస్ ఎక్కువ ఫోకస్…
ప్రస్తుతం పోలీసు దిగ్బంధంలోకి హుజూరాబాద్ వెళ్ళిపోయింది. నియోజకవర్గం చుట్టూ 11 చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేసారు. ఆర్డీఓ కార్యాలయంతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్ల డ్రోన్ లతో నిఘా పెట్టారు. మంత్రులు హరీష్ రావ్, గంగుల కమలాకర్ వాహనాల సైతం తనిఖీ చేస్తున్నారు. వాహన తనిఖీలు ముమ్మరం చేసి నిన్న ఒక్కరోజే 15 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. నేడు అమావాస్య కావడంతో నామినేషన్లకు ప్రధాన అభ్యర్థులు దూరంగా ఉన్నారు. ఎనిమిదో తేదీన బీజేపీ అభ్యర్థి ఈటల,…
మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. గడిచిన ఐదు నెలలుగా హుజూరాబాద్ రాజకీయ వేడి రాజుకుంటోంది. ఈ ఎన్నికను ఈటల రాజేందర్ ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఇక్కడ మరోసారి గెలిచి సత్తాచాటాలని ఆయన భావిస్తున్నారు. ఈ కారణంగానే కమ్యూనిస్టు భావాలు కలిగిన ఈటల రాజేందర్ తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీలో చేరాల్సి వచ్చింది. బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ హుజూరాబాద్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. హుజురాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ కు…