హరీష్ రావు ఎదుటే బలప్రదర్శనకు దిగుతున్నారా…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ ఉపఎన్నికలో గెలుపుకోసం అధికారపార్టీ వ్యూహ రచన చేస్తుంటే.. మరోవైపు పార్టీలోని ఇద్దరు నేతల మధ్య పంచాయితీ కలవర పెడుతోందట. ఆ ఇద్దరూ కొత్తగా గులాబీ కండువా కప్పుకున్నవాళ్లే కావడంతో.. వారి అంతర్గత విభేదాలు టీఆర్ఎస్ శ్రేణులకు ఇబ్బందిగా మారాయట. ఒకే వరలో రెండు కత్తులు ఇమడలేవన్నట్టుగా చిటపటలాడుతున్నాట. వారెవరో.. లెట్స్ వాచ్..!
ఎడముఖం పెడముఖంగా కౌశిక్రెడ్డి, ఇ.పెద్దిరెడ్డి..?
Also Read
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Off The Record: మీనాక్షి నటరాజన్ అవకాశానికి గండి కొట్టింది ఎవరు? రాష్ట్ర నేతలు ఎవరైనా లీకులు ఇచ్చారా?
- Off The Record: దువ్వాడకు వైసీపీలోకి నో రీ ఎంట్రీ?.. రీల్స్ రాజా పొలిటికల్ కెరీర్ ఖతం అయినట్టేనా..?
- OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
హుజురాబాద్ ఉపఎన్నిక కాకమీద ఉంది. నియోజకవర్గంలో కులాలు, సంఘాలు, సంస్థల ఆత్మీయ సమ్మేళనాలపై టీఆర్ఎస్ ఎక్కువ ఫోకస్ పెట్టింది. మంత్రులు హరీష్రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అదేపనిగా ప్రచారం చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. హుజురాబాద్కే చెందిన ఇద్దరు నేతల మధ్య పంచాయితీ గులాబీ శిబిరంలో హాట్ టాపిక్గా మారింది. వారే కాంగ్రెస్ను వీడి వచ్చిన కౌశిక్రెడ్డి, బీజేపీకి గుడ్బై చెప్పి టీఆర్ఎస్ కండువా కప్పుకొన్న ఇ. పెద్దిరెడ్డి. ఇద్దరూ ఇటీవలే టీఆర్ఎస్లో చేరారు. గతంలో హుజురాబాద్ నుంచి పోటీ చేసిన నేతలే. మంత్రి హరీష్రావు హాజరైన ఓ కార్యక్రమంలో కౌశిక్రెడ్డి, పెద్దిరెడ్డి ఎడముఖం పెడముఖంగా ఉండటంతో పార్టీలో టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయారు. ఏమైందా అని అంతా ఆరా తీయడం మొదలుపెట్టారట.
ఎలాంటి పదవి ఇవ్వకపోవడంపై పెద్దిరెడ్డి అసంతృప్తి..!
రెడ్డి సామాజికవర్గ ఆత్మీయ సమ్మేళనంలో సెటైర్లు..!
కౌశిక్రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పంపేందుకు కేబినెట్ ప్రతిపాదించింది. అయితే మాజీ మంత్రిగా.. సీనియర్ పొలిటీషియన్గా ఉన్న తనకు ఏ పదవీ ఇవ్వకపోవడంపై అసంతృప్తితో ఉన్నారట ఇ.పెద్దిరెడ్డి. హుజురాబాద్లో తనకు పట్టు ఉందని.. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశానని.. కౌశిక్రెడ్డి కంటే తనకేం తక్కువని అనుచరుల దగ్గర వాపోతున్నారట ఇ.పెద్దిరెడ్డి. ఈ విషయం అధిష్ఠానం చెవిన పడటంతో బుజ్జగించే ప్రయత్నం చేసిందట. గత నెలలో రెడ్డి సామాజికవర్గ ఆత్మీయ సమ్మేళన సభ నిర్వహించారు. ఆ సభకు కౌశిక్రెడ్డి, పెద్దిరెడ్డి ఇద్దరూ వెళ్లారు. తన సామాజికవర్గం గురించి గొప్పగా చెప్పి వారిని ఓన్ చేసుకోవడానికి కౌశిక్రెడ్డి ప్రయత్నించారు. ఆ తర్వాత మాట్లాడిన పెద్దిరెడ్డి ఏ మాత్రం ఆలోచించకుండా.. కౌశిక్కు సెటైర్లు వేయడం పెద్ద చర్చగా మారింది.
హరీష్రావు ఎదుటే బలప్రదర్శకు దిగుతున్నారా?
టీఆర్ఎస్ పెద్దల దగ్గర మార్కులు కొట్టేసేందుకు కాంగ్రెస్ కేడర్కు గులాబీ కండువా కప్పే పనిలో కౌశిక్రెడ్డి ఉన్నారట. కౌశిక్రెడ్డి కంటే ముందే బీజేపీ, టీడీపీలలో ఉన్న నాయకులను టీఆర్ఎస్లో చేర్పించేందుకు పెద్దిరెడ్డి చూస్తున్నారట. ఇదే క్రమంలో మంత్రి హరీష్రావు మెప్పుకోసం ఇద్దరు నేతలూ బల ప్రదర్శనకు దిగుతున్నట్టు టాక్. అయితే వీరిద్దరి మధ్య వచ్చిన గ్యాప్తో టీఆర్ఎస్ కిందిస్థాయి కేడర్ ఇబ్బంది పడుతోందట. ఇది గమనించిన పార్టీ పెద్దలు.. వేర్వేరుగా ప్రచారంలో పాల్గొనాలని కౌశిక్రెడ్డి, ఇ. పెద్దిరెడ్డిలకు సూచించారట. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే బాధ్యత హరీష్రావుకు అప్పగించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వివిధ పార్టీల నుంచి వచ్చిన వారికి గులాబీ కండువాలు కప్పేయడంతో హుజురాబాద్ TRS హౌస్ఫుల్ అయింది. ఇలా వచ్చిన వారి మధ్య చిటపటలు కామన్ అయ్యాయి. మరి.. కౌశిక్రెడ్డి, పెద్దిరెడ్డిల మధ్య పంచాయితీని ఎలా కొలిక్కి తెస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!