తెలంగాణలో జరుగుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలన్నీ కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమి ఫైనల్ గా భావిస్తున్నాయి. అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా బరిలో దిగుతుండటంతో హుజూరాబాద్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు నువ్వా.. నేనా అన్నట్లుగా హూజూరాబాద్ ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలింగ్ కు ఇంకా 13రోజులు ఉన్నాయి. అయితే 72గంటల ముందే…
హుజురాబాద్ మండలం పోతిరెడ్డి పేటలో ఈటెల రాజేందర్ మాట్లాడుతూ… నేను మధ్యలో వచ్చి మధ్యలో పోలేదు. సమైక్య పాలనలో ఎన్ని అవమానలు భరించాం. పదవుల కోసం పెదవులు మూసుకున్నారు. ఎక్కడ అడిగిన ఈటెల కు కేసీఆర్ ద్రోహం చేసిండు అంటున్నారు. రాజేందర్ గెలిస్తే ఎమ్ వస్తుంది అంటున్నారు. రాజేందర్ గెలిస్తే ప్రగతి భవన్ నుండి బయటికి వస్తాడు. నిరుద్యోగ భృతి వస్థలేదు. అడిగితే నన్ను పార్టీ నుండి బయటికి పంపాడు. వందల కోట్లు నా మీద నన్ను…
ఈటల రాజేందర్ బీజేపీ పార్టీలో చేరిన తరువాత అబద్ధాల ను ఒంటపట్టించుకున్నాడు అని మంత్రి హరీష్ రావు అన్నారు. తాజాగా హుజురాబాద్ లో మాట్లాడిన ఆయన… ఈ మధ్య ఏమీటింగ్ లకు పోయిన కరెంట్ కట్ చేస్తున్నారని,మమ్మల్ని వేధిస్తున్నారంటూ టిఆర్ఎస్ పార్టీ మీద దుష్ప్రశారం చేస్తున్నారు. అబద్ధాలతో బురదజల్లి ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కమలపూర్ లో బాల్క సుమన్ కారు ప్రమాదంలో ఆటో డ్రైవర్ చనిపోయాదంటూ ఎన్నికల కోడ్ ఉల్లంఘించి రహదారిపై బైటాయించుండు ఈటల రాజేందర్…
హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం దేశరాజపల్లిలో ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ… ఎక్కడి వాడో వచ్చి మన ఊర్లలో మన బొడ్రాయి దగ్గర ఈటల రాజేందర్ ఒక్క రూపాయి అభివృద్ధి చెయ్యలేదు అని అంటున్నారు. బ్రోకర్ గాళ్ళు, పని చేయని వారు వచ్చి మాట్లాడుతుంటే మీరు కూడా విని ఊరుకుంటే ఎంత బాధ అనిపిస్తుంది అన్నారు. ఈ ఊరికి రోడ్డు నేను ఇక్కడ ఎమ్మెల్యే కాకముందే వేయించిన. చిన్న ఊరి వారికి కూడా పెద్ద బ్రిడ్జి…
హుజూరాబాద్ ఉప ఎన్నికపైనే యావత్ తెలంగాణ ప్రజల దృష్టి నెలకొంది. గడిచిన ఐదు నెలలుగా హుజూరాబాద్ లో రాజకీయ వేడి రాజుకుంటోంది. ప్రధాన పార్టీల నేతలంతా హుజూరాబాద్ కేంద్రంగా ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. హుజూరాబాద్ లో ఇప్పటికే ఓసారి సర్వే నిర్వహించిన అధికార పార్టీ మరోసారి సర్వే చేపట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గులాబీ బాస్ ఆదేశాలతో సర్వే ఏజెన్సీలు, నిఘా వర్గాలు మరోసారి రంగంలోకి దిగి రీ సర్వే చేపడుతున్నాయి. ఈ…
హుజూరాబాద్ ఎన్నికల ప్రచారం కనీవినీ ఎరుగని రీతిలో సాగుతోంది. టీఆర్ఎస్, బీజేపీ పోటా పోటీగా క్యాంపెయిన్లో దూసుకుపోతున్నాయి. టీఆర్ఎస్ ప్రచార బాధ్యతలను మంత్రి హరీశ్రావు తీసుకున్నారు. ఆయన నేతృత్వంలో సీనియర్ నేత బి.వినోద్, మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి తదితరులు గెల్లు గెలుపు కోసం ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఈ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని చాలా రోజులుగా అధికార పార్టీ హుజూరాబాద్లో పావులు కదుపుతోంది. ముఖ్యంగా…
ఈ నెల 30న జరగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక తెలుగు వారినే కాదు ఢిల్లీని కూడా ఆకర్షిస్తోంది. ఈ హైవోల్టేజీ ఎన్నికను టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనే కంటే కేసీఆర్ వర్సెస్ ఈటల అంటే బాగుంటుందేమో. నిజానికి హుజూరాబాద్ ప్రజలు అలాగే పరగణిస్తున్నారు. పైగా ఈ ఉప పోరును ఒకరిపై ఒకరికి ద్వేషంతో చేస్తున్న పోరుగా చూస్తున్నారు. ఎలా మొదలైందో కానీ.. మొత్తానికి ఆట మొదలైంది. అయితే ఈ ఆటలో ఎవరు గెలుస్తారో ఇప్పటికి ఇప్పుడు చెప్పటం…
హుజూరాబాద్ ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా మారుతోంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రధాన పార్టీల నేతలంతా హుజూరాబాద్ లో తిష్టవేసి తగ్గెదేలే అన్నట్లుగా ప్రచారం చేస్తూ ఓటర్లు ఆకట్టుకుంటున్నారు. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా ఆయా పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రధాన పార్టీలన్నీ ప్రస్తుతం హుజూరాబాద్ నుంచి పక్కచూపులు చూస్తున్నాయి. నేతలంతా హుజూరాబాద్ సరిహద్దు మండలాలపై ఫోకస్ పెడుతుండటంతో ఎన్నికల ప్రచారం ఆసక్తిని రేపుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల…
హుజురాబాద్ ఉప ఎన్నికలు ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య కాకరేపుతున్నాయి.. ఇప్పటికే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదుల పర్వం కొనసాగుతుండగా.. హుజురాబాద్ బై పోల్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. తెలంగాణ ఉద్యమ సమయంలో నిజాయితీగా పోరాడిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ నాయకులు ఇష్టారాజ్యాంగ మాట్లాడుతూ , ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.. ఇక, సంతలో కూరగాయలు…
తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు హీటెక్కుతున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక సాక్షిగా అధికార, ప్రతిపక్ష పార్టీలు కురుక్షేత్రాన్ని తలపించేలా పోటీపడుతున్నారు. ఎవరికీ వారు తగ్గెదేలా అన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో హుజూరాబాద్ ఓటర్లు ఎవరి వైపు మొగ్గుచూపుతారనేది ఆసక్తికరంగా మారింది. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రచారంలో దూసుకెళుతుండగా కాంగ్రెస్ మాత్రం కొంచెం వెనుకంజలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రధాన పార్టీలు చేస్తున్న ప్రచారంపై స్థానిక ఓటర్లు మాత్రం పెదవి విరుస్తున్నారనే టాక్ విన్పిస్తోంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్…