హుజురాబాద్ నుంచి ‘సైడ్’ అవుతున్న ప్రచారం.. ఎందుకంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజూరాబాద్ ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా మారుతోంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రధాన పార్టీల నేతలంతా హుజూరాబాద్ లో తిష్టవేసి తగ్గెదేలే అన్నట్లుగా ప్రచారం చేస్తూ ఓటర్లు ఆకట్టుకుంటున్నారు. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా ఆయా పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రధాన పార్టీలన్నీ ప్రస్తుతం హుజూరాబాద్ నుంచి పక్కచూపులు చూస్తున్నాయి. నేతలంతా హుజూరాబాద్ సరిహద్దు మండలాలపై ఫోకస్ పెడుతుండటంతో ఎన్నికల ప్రచారం ఆసక్తిని రేపుతోంది.
హుజూరాబాద్ ఉప ఎన్నికల కారణంగా ఈ నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ నడుస్తోంది. దీంతో ఆయా పార్టీల నేతలంతా ఖచ్చితంగా ఎన్నికల కోడ్ పాటించాల్సిందే. కోవిడ్ నిబంధనలు పాటించకపోతే సదరు పార్టీ నేతలపై ఎన్నికల నియామవళి ప్రకారంగా కేసులు నమోదు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే పలువురు నేతలపై కోవిడ్ నిబంధనలు పాటించలేదని కారణంతో కేసులు బుక్కయినట్లు తెలుస్తోంది. దీంతో నేతలంతా హుజూరాబాద్ నియోజకవర్గంలో కంటే మరో ప్రాంతానికి ప్రజలను తరలించి అక్కడ ప్రచారం చేయాలని భావిస్తున్నారు.
Also Read
- Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. 'వ్యూహ లక్ష్మి అచ్చు' గురించి తెలుసా.?
- Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
- Eid-ul-Fitr 2026: దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు.. ఈద్-ఉల్-ఫితర్ ప్రాముఖ్యత ఏంటి..? ఎలా జరుపుకుంటారు..?
- Gas Cylinder Code: గ్యాస్ సిలిండర్పై ఉండే కోడ్ అర్థం మీకు తెలుసా?
ఇందులో భాగంగానే ప్రధాన పార్టీలన్నీ హుజూరాబాద్ సరిహద్దు మండలాలపై దృష్టి సారిస్తున్నాయి. అందరిచూపు ప్రధానంగా పెంచికల్ పేటనే ఉంది. ఈ మండలం హుజూరాబాద్ కు కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ మండలానికి ప్రజలను తరలించడానికి ఖర్చు కూడా తక్కువ అవుతుండటంతో అందరూ ఈ మండలంపైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో నేతలంతా హుజూరాబాద్ ఓటర్లను పెంచికల్ పేటకు తరలిస్తూ అక్కడ ప్రచారం చేస్తున్నారు. వచ్చిపోయే వారితో ఈ మండలంలో సందడి వాతావరణం నెలకొంటోంది.
హుజూరాబాద్ కు పొరుగున ఉన్న మండలంలో ప్రచారం చేస్తే ఎన్నికల కోడ్ వర్తించే అవకాశాలు ఉండవని నేతలు భావిస్తున్నారు. అనుమతికి మంచి ప్రజలు సభకు వచ్చారనే కేసుల భయం కూడా వారికి ఉండదు. అదేవిధంగా ఇక్కడ ప్రచారానికి అయిన ఖర్చు కూడా అభ్యర్థుల ఖాతాలో పడే అవకాశం లేదని తెలుస్తోంది. ఇన్ని అవకాశాలు రాజకీయ నాయకులు లభిస్తుండంతో నేతలంతా దీనిని సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డారు. ఈ కారణంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో కంటే సరిహద్దు మండలాల్లోనే ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నట్లు కన్పిస్తోంది.
తాజావార్తలు
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
-
Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!