హీటెక్కిన హుజూరాబాద్ ప్రచారం.. మిగిలింది పది రోజులే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో జరుగుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలన్నీ కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమి ఫైనల్ గా భావిస్తున్నాయి. అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా బరిలో దిగుతుండటంతో హుజూరాబాద్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు నువ్వా.. నేనా అన్నట్లుగా హూజూరాబాద్ ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలింగ్ కు ఇంకా 13రోజులు ఉన్నాయి. అయితే 72గంటల ముందే స్థానికేతరులు హుజూరాబాద్ ను వీడాల్సి ఉంటుందని ఈసీ స్పష్టం చేస్తోంది.
ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే హుజూరాబాద్ లో స్ఠానికేతరులైన స్టార్ క్యాంపెయిన్ల ప్రచారం పట్టుమని పదిరోజులు ఉండనుంది. దీనిని సద్వినియోగం చేసుకోనేలా స్టార్ క్యాంపెనర్లంతా హుజూరాబాద్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ పదిరోజుల్లోనే ఓటర్లను తమవైపు తిప్పుకునేలా హామీలిస్తూ వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు. గడిచిన ఐదు నెలలుగా హూజూరాబాద్లో ప్రచారం చేస్తున్న స్థానికేతరులు ఇటీవల దసరా పండుగ రావడంతో సొంత ఊళ్లకు వెళ్లారు. ఆదివారం నాటికి వారంతా తిరిగి రావడంతో మళ్లీ హుజూరాబాద్లో ప్రచారం వేడిక్కినట్లు కన్పిస్తోంది.
Also Read
- Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
- Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
- Honeymoon Murder Case: ‘మీ భర్తపై దాడి జరిగినప్పుడు మీరేం చేశారు’ సోనమ్కు సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు
- Rahul Gandhi: మోడీ ఇంటి దగ్గర నిరసన.. పోలీసుల అదుపులో రాహుల్గాంధీ, ఖర్గే
పోలింగ్ సమయం దగ్గరపడుతుండటంతో ఇప్పటికే ఉన్న నేతలకుతోడుగా స్టార్ క్యాంపెనర్లు సైతం రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రచారంలో ముందున్నారు. 18ఏళ్లు ఎమ్మెల్యే చేసిన అనుభవం ఆయనకు ఉండటం ఆయనకు కలిసి రానుంది. స్థానిక నేతలతో ఆయనకు ఉన్న పరిచయాలు ఈ ఎన్నికలో ఉపయోగపడునున్నాయి. అదేవిధంగా బీజేపీ పెద్దలు ఈటలకు అండగా నిలుస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ బరిలో ఉన్నారు. ఆయన స్థానికేతరుడు కావడం ఆయనకు మైనస్ గా మారనుంది. ప్రచారంలోనూ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్, బీజేపీలతో పోలిస్తే కాస్తా వెనుకబడినట్లు ఉందనే టాక్ విన్పిస్తోంది.
టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఆయనకు అండగా స్థానిక, స్థానికేతర నేతలు నిలుస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మంత్రి హరీష్ రావుకు తోడుగా స్థానిక నేతలైన ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంత్, ఎమ్మెల్యే వొడితేల సతీష్ కుమార్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి తదితరుల నేతలంతా గెల్లు శ్రీనివాస్ తరుఫున ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మరో పది రోజుల్లో స్టార్ క్యాంపెయినర్లు హుజూరాబాద్ ను వీడినా స్థానిక టీఆర్ఎస్ నేతలు మాత్రం ఆయనకు అండగా ఉండనున్నారు. ఈనెల 27 తర్వాత స్థానిక నేతలంతా హూజురాబాద్లో పోల్ మెనేజ్మెంట్ చక్కబెట్టే అవకాశం ఉంది. కాగా ఈ ఎన్నికల్లో రిజల్ట్ ఎవరికి అనుకూలంగా వస్తుందనేది మాత్రం సస్పెన్స్ గా మారింది.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!